E-Paper
Advertisement

Raashii Khanna: రాశీ కన్నాకు కొత్త భయం.. ఎయిర్ పోర్టులో అడుగు పెడుతూనే..

Raashii Khanna: రాశీ కన్నాకు కొత్త భయం.. ఎయిర్ పోర్టులో అడుగు పెడుతూనే..
Advertisement

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తర్వాత.. చాలా మంది ఫ్లైట్ జర్నీ అంటేనే భయంతో వణికిపోతున్నారు. ప్రతి ఒక్కరి మదిలో అవే దృశ్యాలు మెదులుతున్నాయి. ఆ ఘటనతో హీరోయిన్ రాశీ ఖన్నా కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యింది. ఈ విమాన ప్రమాదంలో 242 మందిలో 241 మంది చనిపోవడంతో షాకయ్యింది. ఆ ప్రమాదం తర్వాత ఎప్పుడు విమానం ఎక్కినా అసౌకర్యంగా, భయంగా ఫీలవుతున్నట్లు రాశీ చెప్పుకొచ్చింది. ఈ మేరకు ఇన్ స్టాలో ఓ పోస్టు పెట్టింది.

విమాన ప్రయాణం అంటేనే ఆందోళనగా ఉంది!

Advertisement

తాజాగా విమాన ప్రయాణం చేసిన రాశీ ఖన్నా తన ఇన్ స్టాలో ఓ పోస్టు పెట్టింది. ఎయిర్ ఇండియా ప్రమాదం తర్వాత ఫ్లైట్ జర్నీ అంటే ఎంతలా ఆందోళన కలుగుతుందో చెప్పుకొచ్చింది. విమాన ప్రమాదాలకు సంబంధించి తనతో ఎలా భయాన్ని కలిగిస్తున్నాయో వివరించే ప్రయత్నం చేసింది. ఈ మేరకు తన విమాన ప్రయాణానికి సంబంధించి కొన్ని ఫోటోలను పంచుకుంది. ఒకప్పుడు ఆహ్లాదంగా అనిపించిన విమాన ప్రయాణం ఇప్పుడు, భారీగా మారినట్లు వెల్లడించింది. “ప్రపంచంలో చాలా అశాంతి నెలకొని ఉంది. ప్రతి విమాన ప్రయాణం ఇప్పుడు భారంగా అనిపిస్తుంది. కేవలం ఆకాశం వల్ల కాదు. మనం క్యారీ చేసే హెడ్ లైన్స్ వల్ల. ఒకప్పుడు ప్రయాణ సమయాన్ని తగ్గించుకునేందుకు విమాన ప్రయాణం ఓ మార్గంగా కనిపించేది. ఇటీవల విమానం ప్రయాణం అంటే శ్వాస ఆగినంద పని అయినట్లు అనిపిస్తోంది. ప్రయాణ ఆందోళన నాలోనే ఉందా? మరెవరైనా అనుభవిస్తున్నారా?” అంటూ రాసుకొచ్చింది.

Advertisement

Read Also: యాంకర్ జాహ్నవి ఇప్పుడు ఏం చేస్తోంది? ఇండస్ట్రీకి అందుకే దూరమైందా?

అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో 241 మంది దుర్మరణం

జూన్ 12న లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 డ్రీమ్‌ లైనర్ విమానం సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కొద్ది సేపటికే గుజరాత్‌ అహ్మదాబాద్‌ లోని మేఘాని నగర్ ప్రాంతంలో బిజె మెడికల్ కాలేజీ హాస్టల్ కాంప్లెక్స్‌ పైకి కూలిపోయింది. ఈ దుర్ఘటనలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీతో సహా 241 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒకే ఒక్క ప్రయాణీకుడు ప్రాణాలతో బయటపడ్డాడు. మిగతా వాళ్లంతా మాంసపు ముద్దలుగా మారిపోయారు. వారి శవాలను గుర్తించేందుకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించాల్సి వచ్చింది. ఈ పరీక్షల ఆధారంగా మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ విమాన ప్రమాదం పట్ల దేశ వ్యాప్తంగా ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. చాలా మంది నాటి నుంచి విమాన ప్రయాణం చేయాలంటేనే భయపడుతున్నారు. పలువురు సెలబ్రిటీలు కూడా భయం భయంగానూ విమాన ప్రయాణాలు చేస్తున్నారు.

Read Also: 72 గంటలు నరకం చూపించిన ఎయిర్ ఇండియా.. దేశం కాని దేశంలో..

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×