Rakul Preet Singh: బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ కీలక పాత్రలో నటించిన సినిమా బడే మియా.. చోటే మియా.. ఈచిత్రం 2024 ఏప్రిల్ 11న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారాన్, మానుషీ చిల్లర్, సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమా నిర్మాతగా జాకీ భగ్నాని రూపొందించారు. ఈ సినిమా అనుకున్నంత స్థాయిలో ప్రేక్షకులను మెప్పించ లేకపోయింది.ఆవిషయంపై ఇన్నిరోజుల తర్వాత నిర్మాత జాకీ భగ్నాని మాట్లాడడంతో.. సోషల్ మీడియాలో ఆయన వ్యాఖ్యలు హార్ట్ టాపిక్ అయింది.అసలు ఆయన సినిమా గురించి ఏం మాట్లాడాడో ఇప్పుడు చూద్దాం..
ఆ హీరో వల్ల అప్పుల పాలు అయ్యా..
టాలీవుడ్ నటి రకుల్ ప్రీత్ సింగ్ 2024లో జాకీ భగ్నాని ను వివాహం చేసుకున్నారు. వీరిది ప్రేమ వివాహం. జాకీ నిర్మాతగా వ్యవహరించిన బడే మియా చోటే మియా చిత్రం రిలీజ్ టైంలో వీరి పెళ్లి జరిగింది. అక్షయ్ కుమార్ హీరోగా చేసిన చిత్రం పై చాలా రోజుల తర్వాత జాకీ మాట్లాడడం జరిగింది. ఈ సినిమా వల్ల ఆయన ఎన్నో ఇబ్బందులు పడినట్లు, తన ఆస్తులను కూడా తాకట్టు పెట్టినట్లు సోషల్ మీడియా వేదికగా తన బాధని వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ.. ‘జీవితంలో నాకు ఒక గుణపాఠం నేర్పిన చిత్రం ఇది. ఈ సినిమా కోసం మేము చాలా ఖర్చు పెట్టాము. మా ఆస్తులుని కూడా తాకట్టు పెట్టాము. అయినా మా బాధ ఎవరికి పట్టట్లేదు. మేము తీసిన సినిమా ప్రేక్షకులు ఆదరించలేదు. కంటెంట్ వారికి కనెక్ట్ అవ్వలేదు. అందుకు ఎవరిని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ప్రేక్షకులు నిర్ణయం ఎప్పుడు కరెక్ట్ గానే ఉంటుంది. వారికి సినిమా నచ్చలేదు. అందుకే ఈ మూవీ పరాజయం పొందింది’ అని జాకీ అన్నారు.
ఆస్తులు తాకట్టు పెట్టాను ..
జాకీ భగ్నానీ వసు, భగ్నానీ కుమారుడు నిర్మాత పూజ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సినిమాలు నిర్మిస్తారు. గతంలో ఈయన బెల్బాటం, గణపత్ వంటి చిత్రాలను నిర్మించారు. ఇక బడే మియా చోటే మియా చిత్రం దాదాపు 350 కోట్లు ఖర్చుపెట్టి నిర్మించారు.ఆయన తన ఆస్తులను తాకట్టు పెట్టి తీసిన సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది. కేవలం102 కోట్లు మాత్రమే వసూలు చేయగలిగింది. ఇది భారతీయ సినిమా చరిత్రలోనే అత్యంత ఖరీదైన సినిమాల్లో ఒకటి. సైన్స్ ఫిక్షన్ యాక్షన్ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి ఆలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి సంగీతం జూలియస్ ప్యాకీయం అందించారు.
Balakrishna : అఖండ 2 సెట్ లోనే మరో సినిమా ఫిక్స్.. స్క్రిప్ట్ మీ ఊహకే వదిలేస్తున్నా..