Rashmika Madanna: నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఛలో సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చినా అమ్మడిని నేషనల్ క్రష్ గా మార్చింది మాత్రం గీతగోవిందమే. ఇంకేం ఇంకేం కావాలే సాంగ్ తో ఈ చిన్నది సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ సినిమాలోనే రష్మికకు విజయ్ దేవరకొండ పరిచయమయ్యాడు. వీరి పరిచయం స్నేహంగా మారి.. ప్రేమ వరకు వచ్చిందని బయట టాక్. కానీ, తామిద్దరం కేవలం ఫ్రెండ్స్ మాత్రమే అని ఈ జంట ఎన్నోసార్లు చెప్పుకొస్తూనే ఉంది. ఇక ఫ్రెండ్స్ లానే విజయ్ – రష్మిక ఒకరి సినిమాలకు ఒకరు సపోర్ట్ గా ఉంటారు. రష్మిక నటించిన ఏ సినిమాకు అయినా విజయ్ ఆల్ ది బెస్ట్ చెప్తాడు. రష్మిక కూడా అంతే. ముఖ్యంగా ది ఫ్యామిలీ స్టార్ ఆమెకు ఎంతో ప్రత్యేకమని చెప్పాలి. గీతగోవిందం తెరకెక్కించిన దర్శకుడు పరశురామే.. ఫ్యామిలీ స్టార్ డైరెక్టర్ కాబట్టి.
ఇక నేడు ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయిన విషయం తెల్సిందే. తాజాగా రష్మిక ఈ ట్రైలర్ ను షేర్ చేస్తూ చిత్ర బృందానికి బెస్ట్ విషెస్ తెలిపింది. “మై డార్లింగ్స్.. పరుశురామ్ , విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ మీకు బెస్ట్ సినిమా కావాలని కోరుకుంటున్నాను. ఏప్రిల్ 5 న వస్తుంది.. ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నా.. మీరు కచ్చితంగా ఒక విజయాన్ని చేతిలో పెట్టేసుకున్నారు. పార్టీ కావాలి. మృణాల్.. ఆల్ ది బెస్ట్ ” అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.
ఇక రష్మిక సినిమాల సంగతి గురించి మాట్లాడితే.. ప్రస్తుతం రష్మిక చేతిలో పాన్ ఇండియా చిత్రాలే ఉన్నాయి. అల్లు అర్జున్ సరసన పుష్ప 2 లో నటిస్తోంది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో గర్ల్ ఫ్రెండ్ అనే చిత్రం చేస్తుంది. ఇవి కాకుండా ధనుష్ సరసన కుబేరలో కూడా అమ్మడే హీరోయిన్. మరి ఈ సినిమాలతో రష్మిక ఎలాంటి విజయాలను అందుకుంటుందో చూడాలి.
I wish my darlings @ParasuramPetla 🌻 and @TheDeverakonda 🤍 the bestestestestttt for #FamilyStar .. ❤️❤️
April 5th it isssss! So exciteddddd! 🩷
You guys definitely have a winner on hand! 🥳💃🏻 party kavaliiiii! 🥳🥳✨@mrunal0801 all the best my love! ❤️ https://t.co/f4aPH1ajnk— Rashmika Mandanna (@iamRashmika) March 28, 2024