E-Paper
Advertisement

Producers Meet : సమావేశంలో గందరగోళం… తలుపులు తన్నుకుంటూ బయటికి వెళ్లిపోయిన స్టార్ ప్రొడ్యూసర్..

Producers Meet : సమావేశంలో గందరగోళం… తలుపులు తన్నుకుంటూ బయటికి వెళ్లిపోయిన స్టార్ ప్రొడ్యూసర్..
Advertisement

Producers Meet :గత కొన్ని రోజులుగా సినిమాలలో సరైన కంటెంట్ లేకపోవడం, పెరిగిన టికెట్ ధరలు, ఇతర కారణాలవల్ల ప్రేక్షకులు థియేటర్ కి వెళ్లి సినిమా చూడడానికి వెనుకడుగు వేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే థియేటర్ యాజమాన్యం పూర్తిగా నష్టపోతోంది. అందుకే థియేటర్ అద్దె కూడా చెల్లించలేని స్థితిలో ఉండడంతో ఎగ్జిబిటర్లు అందరూ జూన్ 1 నుండి సినిమా థియేటర్లను మూసివేయాలని నిర్మాతలకు లేఖ రాయబోతున్నారంటూ ఒక వార్త తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. ఇక అందులో భాగంగానే ఈరోజు ఉదయం 11:00 గంటలకు రెండు తెలుగు రాష్ట్రాలలోని డిస్ట్రిబ్యూటర్స్ తెలుగు ఫిలిం ఛాంబర్ లో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి మొత్తం 40 మంది డిస్ట్రిబ్యూటర్లు హాజరవడం జరిగింది.

ఫిలిం ఛాంబర్ లో నిర్మాతల సమావేశం..

Advertisement

అయితే ఇదే రోజు సాయంత్రం 4:00 గంటలకు తెలుగు నిర్మాతలు ఫిలిం ఛాంబర్ లో సమావేశమయ్యారు. ఇక డిస్ట్రిబ్యూటర్లు, ప్రొడ్యూసర్లలో మెజారిటీ సభ్యులు సమ్మె వద్దు.. థియేటర్లు రన్ చేస్తూనే సమస్యను పరిష్కరించుకునే విధంగా కృషి చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంతేకాదు గతంలో క్యూబ్ సమస్యలపై కొన్ని రోజులు థియేటర్లు మూసివేసినా.. ఆర్టిస్టుల రెమ్యూనరేషన్ కారణంగా షూటింగ్ నిలిపివేసినా.. ఈ రెండు విషయాల్లోనూ సత్ఫలితాలు రాకపోవడంతో.. ఈసారి థియేటర్లు మూతపడకుండా సినిమాలు రన్ చేస్తూనే సమస్యను పరిష్కరించే విధంగా కృషి చేయాలని డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు తెలిపారు. దీనికి తోడు పైరసీ, ఐపిఎల్ , ఓటీటీ రూపంలో ప్రేక్షకులు థియేటర్లకు రావడం లేదు. పైగా మే 30 నుంచి వరుస సినిమాలు.. అందులోనూ స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అవుతూ ఉండడంతో ఇప్పుడు థియేటర్లు మోసేస్తే అటు నిర్మాతలకు, ఇటు డిస్ట్రిబ్యూటర్లకు మరింత ఇబ్బంది అవుతుంది. కాబట్టి థియేటర్లు మూసివేయాలి అనే ఆలోచనను ప్రస్తుతం వేయాల్సిందిగా నిర్మాతలు కోరారు.తెలుగు ఇండస్ట్రీ అభివృద్ధికి సహకరించే విధంగా తోడ్పడాలని ఎగ్జిబిటర్లకు, డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు తెలియజేశారు.

అసంతృప్తిగా ముగిసిన మీటింగ్.. కోపంతో తలుపు తన్నిన సురేష్ బాబు..

Advertisement

అయితే ఇంతవరకు బాగానే ఉన్నా.. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఫిలిం ఛాంబర్ లో నిర్మాతల సమావేశం అసంపూర్ణంగానే ముగిసినట్లు తెలుస్తోంది. అసలు విషయంలోకి వెళ్తే.. షేరింగ్ బేస్ లో ఇవ్వడం నిర్మాతలకు ఇష్టం లేదట. డిస్ట్రిబ్యూటర్స్ డిమాండ్స్ ముందు పెట్టడంతో కోపంతో నిర్మాతలు ఊగిపోయినట్లు తెలుస్తోంది. దీంతో నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు తలుపులు తన్నుకుంటూ బయటకు వెళ్లిపోయినట్లు సమాచారం. మరి దీనిపై మిగతా నిర్మాతల నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి.

ALSO READ:Arti – Jayam Ravi: రవి మోహన్ చెప్పింది నిజమేనా.. ఆ హీరోతో ఆర్తి ఎఫైర్.. ఒక్కొక్కటిగా బయటపడుతున్న నిజాలు!

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×