Venuswamy : సినీ సెలబ్రిటీల జాతకాలు చెప్తూ ఒక్కసారిగా సోషల్ మీడియాలో ఫేమస్ అయిపోయారు ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి. అంతేకాదు హీరోయిన్లతో హీరోలతో పూజలు చేయిస్తూ ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఒక్కసారిగా క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఆయనతో పూజలు చేయించుకున్న తర్వాత కొందరు లైఫ్ మారిందని నమ్ముతున్నారు. ఈ క్రమంలో హీరోయిన్లు ఆయనతో పూజలు చేయించుకోవడానికి వరుసగా క్యూ కడుతున్నారు. రష్మిక మందన్న అలాంటి స్టార్ హీరోయిన్లు సైతం పూజలు చేయించుకోవడంతో ప్రతి ఒక్కరూ అదే బాటపడుతున్నారు. ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీలోని ఎంతోమంది హీరోయిన్లు ఆయనతో పూజలు చేయించుకున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వేణు స్వామి.. అమ్మాయిలు ఎందుకు ఆయనతో పూజ చేయించుకుంటారు అన్న విషయాన్ని బయటపెట్టారు. ఈ వీడియో బార్లు ఇవ్వడంతో ఇది కాస్త సంచలనంగా మారింది.
సినీ హీరోయిన్ల తో పూజలు చేసి ఒక్కసారిగా ఫేమస్ అయ్యాడు ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి. ఒకరేది చేస్తే అదే చేయడం మనుషుల సహజ అలవాటు. ఒక హీరోయిన్ను ఈయనతో పూజలు చేయించుకొని మంచి ఆఫర్లను అందుకుంది. దాంతో ప్రతి ఒక్కరు కూడా ఆయనతో పూజలు చేయించుకుంటే మంచి జరుగుతుందని అభిప్రాయంతో పూజలు చేయిస్తున్నారు. అందుకు సంబంధించిన వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన అమ్మాయిలు తన దగ్గర పూజ చేయించుకోవడానికి వచ్చేది అందుకోసమే అని సంచలన నిజాన్ని బయటపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమ్మాయిలు కేవలం సినిమాల్లో అవకాశాలకు మాత్రమే కాదు. రాజకీయాల్లో కూడా రాణించాలని పూజలు చేయించుకుంటున్నారు. సినిమా వాళ్ళతో పోలిస్తే మిగతా వాళ్ళు చాలామంది నన్ను ప్రతిరోజు అడుగుతూ పూజలు చేయిస్తారు. రాజకీయ లబ్ధి కోసమే ఎక్కువ మంది ఇలాంటి పూజలు చేస్తారని ఆయన బాంబు పెల్చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవ్వడంతో అసలు మేటర్ ఇదే అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.
Also Read:బిగ్ బాస్ లో చేసిన ఆ మిస్టేక్ వల్లే ఇండస్ట్రీకి దూరమాయ్యాను.. తేజు షాకింగ్ కామెంట్స్..
ప్రముఖ వివాదాస్పద జ్యోతిష్కుడు వేణు స్వామి ఏం చేసినా సంచలంగానే మారుతుంది. ఆయన చెప్పింది ఒకసారి జరిగింది కానీ ఈ మధ్య ఏమి జరగడం లేదు. అయినా కూడా ఆయన దగ్గరికి క్యూ కడుతూనే ఉన్నారు. గతంలో ఈయన ఏపీ రాజకీయాల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. అవి కాస్త రాజకీయ దుమారం లేపాయి. ఆ తర్వాత టాలీవుడ్ స్టార్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ఎన్నో విషయాలను పంచుకున్నారు. కేసు నుంచి బయటపడడం మాత్రమే కాదు వరుస అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతాడు అని వేణు స్వామి అన్నాడు. ఆయన అన్నట్లుగానే ఏమో తెలియదు కానీ అల్లు అర్జున్ ప్రస్తుతం భారీ ప్రాజెక్టులు చేస్తున్నారు.. అల్లు అర్జున్ ని ఎవరు ఏం పీకలేరు అంటూ తాజాగా పాల్గొన్న ఇంటర్వ్యూలో స్టేట్మెంట్ ఇచ్చాడు. అల్లు అర్జున్ ని టచ్ చేయాలంటే మరో జన్మ ఎత్తాల్సిందే అని వేణు స్వామి అనడం విశేషం.. ఇంకా ఎన్నో విషయాలను ఆయన అభిమానులతో పంచుకున్నారు.. ఇంటర్వ్యూ వీడియో ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్ గా మారింది..