Hospital Accident: కారణాలు ఏమైనా కావచ్చు.. ఈ మధ్యకాలం ఆసుపత్రిలో ఆగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. నిన్న మహారాష్ట్ర కాగా, నేడు ఇస్లామాబాద్ వంతైంది. ఇస్లామాబాద్లోని అతి పెద్ద ఆసుపత్రిలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 15 మంది నవజాత శిశువులు మంటల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు. అసలు ఆసుపత్రిలో ఏం జరిగింది?
పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్లోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఘోర ప్రమాదం జరిగింది. పాక్లోని అతిపెద్ద ప్రభుత్వ ఆసుపత్రి పాకిస్తాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్-పిమ్స్లోని గైనకాలజీ వార్డులో బుధవారం ఉదయం 7 గంటల సమయంలో ఎయిర్ కండిషనర్ కంప్రెసర్ పేలింది. ఈ ఘటనలో గైనకాలజీ వార్డులో చోటు చేసుకుంది. ఒక్కసారిగా మంటలు ఆసుపత్రిని కమ్మేశాయి.
ఈ ప్రమాదంలో మొత్తం 15 మంది శిశువులు ప్రాణాలు కోల్పోయారు. ఆసుపత్రిలోని ఎంసీహెచ్ వార్డు మూడవ అంతస్తులో జరిగిన ఈ ప్రమాదంలో 14 మంది చిన్నారుల మృతదేహాలు పూర్తిగా కాలిపోయాయి. ఈ విషయాన్ని జిల్లా యంత్రాంగం తెలిపింది. కేవలం ఒక పసికందుని సిబ్బంది కాపాడారు. ఎయిర్ కండిషనింగ్ వ్యవస్థలో ఏర్పడిన సాంకేతిక లోపం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించారు.
ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక-సహాయక బృందాలు అక్కడికి చేరుకున్నాయి. దాదాపు రెండు గంటల తర్వాత మంటలను అదుపులోకి తెచ్చాయి. మృతుల సంఖ్యపై అంతర్జాతీయ మీడియా సంస్థలు 14 మంది పేర్కొన్నారు. ఆసుపత్రి వర్గాలు 15 మంది శిశువులు మృతి చెందినట్టు పేర్కొన్నాయి.
ఈ ఘటన తర్వాత ఆసుపత్రి పరిసర ప్రాంతాల్లో గందరగోళం నెలకొంది. నవజాత శిశువుల మృతితో కుటుంబ సభ్యులు దుఃఖంలో మునిగిపోయారు. ఈ ఘటనకు గల కారణాలు, నిర్లక్ష్యం ఉందేమోనని తెలుసుకునేందుకు జిల్లా యంత్రాంగం అదనపు డిప్యూటీ కమిషనర్ నేతృత్వంలో ఒక విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ అగ్నిప్రమాదానికి అసలు కారణాన్ని కనుగొనడంతోపాటు, ఆసుపత్రి భద్రతా వ్యవస్థలో ఏమైనా లోపాలు ఉన్నాయా? అనే కోణంలో దర్యాప్తు చేయనుంది.
ALSO READ: ఇరాన్ పై అమెరికా ఉక్కుపాదం.. ఆర్థికంగా దెబ్బతీసేందుకు ఎత్తులు