E-Paper
Advertisement

Afghanistan Plane Crash | ‘ఆఫ్ఘనిస్తాన్‌లో కూలిన భారత విమానం’.. క్లారిటీ ఇచ్చిన ఇండియా!

Afghanistan Plane Crash | శనివారం రాత్రి ఉత్తర ఆఫ్ఘనిస్తాన్‌లోని కొండ ప్రాంతంలో ఒక విమానం కూలిపోయింది. అయితే ఇది భారత్ విమానమని ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం ప్రకటించింది. దీనిపై భారత ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది.

Afghanistan Plane Crash | ‘ఆఫ్ఘనిస్తాన్‌లో కూలిన భారత విమానం’.. క్లారిటీ ఇచ్చిన ఇండియా!
Advertisement

Afghanistan Plane Crash | ఉత్తర ఆఫ్ఘనిస్తాన్‌లోని కొండ ప్రాంతంలో శనివారం, జనవరి 20 రాత్రి ఒక విమానం కూలిపోయింది. అయితే ఇది భారత్ విమానమని ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం ప్రకటించింది. దీనిపై భారత ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది.

‘‘ఆఫ్ఘనిస్తాన్‌లో జరిగిన విమాన ప్రమాదం దురదృష్టకరం. అయితే ఆ కూలిన విమానం భారత్ నుంచి రష్యా రాజధాని మాస్కోకు బయలుదేరింది. కానీ అది భారతీయ విమానం కాదు. అది మొరాకోకి చెందిన ఒక చిన్న విమానం. ఈ ఘటన గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది,” అని ట్విట్టర్‌లో భారత పౌర
విమానయాన మంత్రిత్వ శాఖ తెలిపింది.

Advertisement

ఈ విమాన ప్రమాదంపై రష్యా ప్రభుత్వం స్పందించింది. ఈ విమానం ఒక ఎయిర్ ఆంబులెన్స్‌ అని భారత్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ మీదుగా రష్యా వస్తున్న సమయంలో విమానం హిందూ కుష్ పర్వతాలలో కూలిపోయిందని రష్యా అధికారులు తెలిపారు. ఇది ఒక రష్యన్-రిజిస్టర్డ్ విమానం ఆఫ్ఘనిస్తాన్‌ గగన తలంలో ప్రవేశించాక అది రాడార్‌లో కనిపించలేదని.. ఈ విమానంలో ఆరుగురు ప్రయాణికులు కూడా బయలుదేరారని వివరాలు వెల్లడించారు.

అయితే ప్రమాదం జరిగిన ప్రదేశం నుంచి ఎటువంటి సమాచారం అందలేదని తెలిసింది. ప్రయాణికులు బ్రతికే ఉన్నారా? లేదా? అనే దానిపై క్లారిటీ లేదు. ఘటనా స్థలానికి ఆఫ్ఘనిస్తాన్ రెస్క్యూ టీమ్స్ బయలుదేరినట్లు తెలుస్తోంది.

Advertisement

Related News

పెరులో వరుస భూకంపాలు.. ఆరుగురు మృతి, వందలాది మంది నిరాశ్రయులు

అమెరికా స్థావరాలపై ఇరాన్ భీకర దాడులు.. ఇద్దరు అమెరికా సైనికులు మృతి, ట్రంప్‌పై ఖమేని ఘాటు వ్యాఖ్యలు

హార్మూజ్ జలసంధిలో హైటెన్షన్.. సముద్రంలో పేలిన రెండు చమురు ట్యాంకర్లు!

మెక్సికోలో భారీ భూకంపం.. ఒక్కసారిగా ఊగిపోయిన భవనాలు! సునామీ ముప్పు పొంచి ఉందా?

అమెరికా చదువులపై ట్రంప్ ‘వీసా’ దెబ్బ.. భారతీయులకు డబుల్ షాక్!

ఇరాన్‌పై అమెరికా దాడులు.. కుప్పకూలిన చాబహార్ టవర్.. భారత్‌కు కోలుకోలేని దెబ్బ!

అల్జీరియాలో భారీ అగ్నిప్రమాదం.. 11 మంది అనాథలు సజీవదహనం, 19 మందికి తీవ్ర గాయాలు

సముద్రంలో పెను విషాదం.. రోహింగ్యా శరణార్థుల పడవలు బోల్తా.. 500 మందికి పైగా మృతి!

Big Stories

Advertisement
×