E-Paper
Advertisement

Gun Fire in America: సిగరెట్ ప్యాకెట్ కోసం కాల్పులు.. అమెరికాలో బాపట్ల జిల్లా వాసి మృతి..!

Gun Fire in America: సిగరెట్ ప్యాకెట్ కోసం కాల్పులు.. అమెరికాలో బాపట్ల జిల్లా వాసి మృతి..!
Advertisement

Andhra Man Died in America: అమెరికాలో దుండగుడు జరిపిన కాల్పుల్లో ఆంధ్రప్రదేశ్ కు చెందిన వ్యక్తి మృతి చెందాడు. మృతుడు బాపట్ల జిల్లాకు చెందిన దాసరి గోపీకృష్ణ (32) గా గుర్తించారు. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్లపాలెం మండలం యాజలికి చెందిన గోపీకృష్ణ ఉద్యోగం నిమిత్తం 8 నెలల క్రితం అమెరికా వెళ్లాడు. అక్కడ ఆర్కెన్సాస్ లో ఉన్న ఒక సూపర్ మార్కెట్ లో పనిచేస్తున్నాడు. శనివారం (జూన్ 22) మధ్యాహ్నం అతను కౌంటర్లో ఉండగా.. సూపర్ మార్కెట్ లోపలికి వచ్చిన ఓ దుండగుడు నేరుగా వచ్చి తుపాకీతో కాల్పులు జరిపాడు.

ఈ కాల్పుల్లో గోపికి తీవ్రగాయాలవ్వడంతో.. అక్కడే కుప్పకూలిపోయాడు. అనంతరం దుండగుడు షాపులో ఒక సిగరెట్ ప్యాకెట్ తీసుకుని పరారయ్యాడు. ఇదంతా సూపర్ మార్కెట్లో ఉన్న సీసీ కెమెరాలో రికార్డైంది. తీవ్రగాయాలైన గోపిని సిబ్బంది ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం కన్నుమూశాడు. కుటుంబ సభ్యులకు గోపి మరణవార్త సమాచారం అందించగా.. వారంతా కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Advertisement

Also Read: Jagan going to Bangalore: జగన్ బెంగుళూరుకి వెళ్తున్నారా? గాలితో మంతనాలు?

గోపీకృష్ణకు భార్య, కుమారుడు ఉన్నారు. అతని మరణంతో స్వగ్రామమైన యాజలిలో విషాదఛాయలు అలుముకున్నారు. సిగరెట్ ప్యాకెట్ కోసం తమ కొడుకుని పొట్టన పెట్టుకున్నారంటూ గోపి తల్లిదండ్రులు గుండెలవిసేలా రోధిస్తున్నారు. కాగా.. గోపి మృతదేహాన్ని స్వదేశానికి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.

Related News

విఫలమైన సామూహిక సున్తీలు.. 43 మంది బాలురు మృతి, దక్షిణాఫ్రికాలో ఘటన

ట్రంప్‌‌కు ఊహించని షాక్‌.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ వ్యవహారం.. కొత్త ఆదేశాలకు కోర్టు బ్రేక్

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

Big Stories

Advertisement
×