E-Paper
Advertisement

Pakistan: ఆ సమావేశానికి రావాలంటూ.. పాకిస్థాన్‌కు భారత్ ఆహ్వానం

Pakistan: ఆ సమావేశానికి రావాలంటూ.. పాకిస్థాన్‌కు భారత్ ఆహ్వానం

Pakistan: భారత్, పాకిస్థాన్ మధ్య కొంతకాలంగా విభేదాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. పుల్వామా దాడి, ఆర్టికల్ 370 రద్దు వంటి అంశాల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య వివాదం మరింత ముదిరింది. తాజాగా కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎస్‌సీఓ సదస్సులో పాల్గొనాలంటూ భారత్, పాకిస్థాన్‌కు ఆహ్వానం పంపించింది. కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్, పాకిస్థాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టోకు ఆహ్వానం పంపించారు. పొరుగు దేశాలే ప్రధమ ప్రధాన్యం విధానంలో భాగంగా పాక్‌కు ఈ ఆహ్వానం పంపించినట్లు కేంద్ర వర్గాలు వెల్లడించాయి.

గోవా వేదికగా మే 4,5 తేదీల్లో ఈ ఎస్‌సీఓ సమావేశం జరగనుంది. పాక్‌తో పాటు చైనా, రష్యా, ఉజ్బెకిస్థాన్, కిర్గిస్థాన్, కజకిస్థాన్, తజకిస్థాన్ దేశాలకు భారత్ ఆహ్వానం పంపింది. 12 ఏళ్ల క్రితం పాకిస్థాన్ విదేశాంగ మంత్రి హీనా రబ్బానీ ఖార్ భారత్‌లో పర్యటించారు. అప్పటి నుంచి ఎవరూ భారత్‌లో అడుగుపెట్టలేదు. ఒకవేళ పాక్ ఈ ఆహ్వానాన్ని అంగీకరిస్తే.. పాక్ విదేశాంగ మంత్రి భారత్‌కు రావడం 12 ఏళ్ల తర్వాత ఇప్పుడే అవుతుంది.

Tags

Related News

Big Shock To Trump: ట్రంప్‌కు ఊహించని ఝలక్.. షాకిచ్చిన వార్ పవర్స్, ఆపరేషన్ ‘ఎపిక్ ఫ్యూరీ’ క్లోజ్

Kuwait Airport: ఇరాన్ మిస్సైళ్ల దాడులు.. కువైట్‌ ఎయిర్‌పోర్ట్ డ్యామేజ్, విమాన సర్వీసులు రద్దు

మరో బాంబ్‌ పేల్చిన అమెరికా.. భారత్‌పై అదనపు సుంకాలకు ప్రతిపాదన, ఏకంగా 12 శాతం

పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు.. అమెరికా స్థావరాలపై ఇరాన్ వరుస దాడులు, ఖేష్మ్ ద్వీపంపై

ఇరాన్ షాకింగ్ నిర్ణయం.. ఇకపై మాటలు-చర్చల్లేవ్, హోర్మూజ్ జలసంధి మాటేంటి?

ఇరాన్‌లో ఇంటిపోరు మొదలైందా? అధ్యక్షుడు మసూద్‌ నిర్ణయం వెనుక, అసలేం జరుగుతోంది?

రూటు మార్చిన అమెరికా.. ఇరాన్‌పై మెరుపు దాడులు, రాడార్- డ్రోన్ వ్యవస్థలు డ్యామేజ్

హోర్ముజ్ జలసంధిలో హై టెన్షన్.. ఇరాన్ సైనిక క్యాంప్‌పై అమెరికా దాడి, కవ్వింపు చర్యలు డీల్ కోసమా?

Big Stories

×