BigTV English

Pakistan: ఆ సమావేశానికి రావాలంటూ.. పాకిస్థాన్‌కు భారత్ ఆహ్వానం

Pakistan: ఆ సమావేశానికి రావాలంటూ.. పాకిస్థాన్‌కు భారత్ ఆహ్వానం

Pakistan: భారత్, పాకిస్థాన్ మధ్య కొంతకాలంగా విభేదాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. పుల్వామా దాడి, ఆర్టికల్ 370 రద్దు వంటి అంశాల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య వివాదం మరింత ముదిరింది. తాజాగా కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎస్‌సీఓ సదస్సులో పాల్గొనాలంటూ భారత్, పాకిస్థాన్‌కు ఆహ్వానం పంపించింది. కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్, పాకిస్థాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టోకు ఆహ్వానం పంపించారు. పొరుగు దేశాలే ప్రధమ ప్రధాన్యం విధానంలో భాగంగా పాక్‌కు ఈ ఆహ్వానం పంపించినట్లు కేంద్ర వర్గాలు వెల్లడించాయి.


గోవా వేదికగా మే 4,5 తేదీల్లో ఈ ఎస్‌సీఓ సమావేశం జరగనుంది. పాక్‌తో పాటు చైనా, రష్యా, ఉజ్బెకిస్థాన్, కిర్గిస్థాన్, కజకిస్థాన్, తజకిస్థాన్ దేశాలకు భారత్ ఆహ్వానం పంపింది. 12 ఏళ్ల క్రితం పాకిస్థాన్ విదేశాంగ మంత్రి హీనా రబ్బానీ ఖార్ భారత్‌లో పర్యటించారు. అప్పటి నుంచి ఎవరూ భారత్‌లో అడుగుపెట్టలేదు. ఒకవేళ పాక్ ఈ ఆహ్వానాన్ని అంగీకరిస్తే.. పాక్ విదేశాంగ మంత్రి భారత్‌కు రావడం 12 ఏళ్ల తర్వాత ఇప్పుడే అవుతుంది.


Tags

Related News

Donald Trump: ఏడు నెలల్లో ఏడు యుద్ధాలు ఆపాను.. అందులో భారత్- పాక్ ఒకటి.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

Hanuman Statue: హనుమంతుడి విగ్రహంపై ట్రంప్ పార్టీ నేత అనుచిత వ్యాఖ్యలు.. అమెరికా క్రైస్తవ దేశమా?

Afghan Boy: షిద్ధత్ సినిమా సీన్ రిపీట్.. విమానం ల్యాండింగ్ గేర్‌లో దాక్కుని ఢిల్లీకి చేరిన అఫ్ఘాన్ బాలుడు

Ragasa Coming: భయంతో వణికిపోతున్న చైనా.. బుల్లెట్ ట్రైన్ కంటే వేగంగా ముంచుకొస్తున్న ముప్పు

Britain – China: అమెరికా వెళ్లాలంటే లక్ష డాలర్లు.. బ్రిటన్, చైనా కి మాత్రం ఫ్రీ ఫ్రీ ఫ్రీ

Pakistan Military: సొంత ప్రజలపైనే బాంబుల వర్షం కురిపించిన పాక్ జెట్స్.. 30 మందికి పైగా దుర్మరణం

US on H 1B Visa: హెచ్‌-1బీ వీసా రుసుంపై వైట్‌హౌస్‌ క్లారిటీ.. వారికి మాత్రమే, ఇక భయం లేదు

H-1B Visas: హెచ్-1బీ వీసాల ఫీజు పెంపు.. భారత టెక్ కంపెనీల పరిస్థితి ఏమిటి? ఆ సమస్య తప్పదా?

Big Stories

×