Bus Plunges into Ravine in Peru : సౌత్ అమెరికాలోని పెరూలో ఘోర ప్రమాదం జరిగింది. బస్సు లోయలో పడి 25 మంది మృతి చెందగా.. మరో 13 మందికి గాయాలయ్యాయి. బస్సు సుమారు వెయ్యి అడుగుల లోతైన లోయలో పడినట్లు అధికారులు తెలిపారు. అయితే.. ప్రమాద సమయంలో బస్సులో 50 మంది ఉన్నారని అధికారులు తెలిపారు. ఇంకా మృతుల సంఖ్య పెరుగుతుందా అన్నదానిపై క్లారిటీ రాలేదు. బస్సు ప్రయాణికులతో తయాబాంబా నుంచి లిమాకు వెళ్తుండగా.. ఉత్తర పెరువియన్ జిల్లా కుస్కాలో ప్రమాదానికి గురైంది.
సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు, అధికారులు ఘటనా ప్రాంతానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కాగా.. ఈ ప్రమాదం ఆదివారం అర్థరాత్రి సమయంలో జరగగా.. ఆలస్యంగా వెలుగు చూసింది. అర్థరాత్రి కాజామార్కాలోని ఆండియన్ ప్రాంతంలోని రోడ్డు గుంతలుగా ఉండటంతో.. బస్సు లోయలో పడిపోయినట్లు అధికారులు తెలిపారు.
Also Read : కెన్యాలో ఘోర ప్రమాదం.. డ్యామ్ కూలి 42 మంది మృతి
బస్సు లోయలో ఉన్న నదిలో పడగా.. ప్రయాణికుల్లో కొందరు నీటిలో కొట్టుకుపోయినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. క్షతగాత్రులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదంపై సంతాపం తెలుపుతూ.. సెలెండిన్ మున్సిపాలిటీ 2 రోజులు సంతాప దినాలను ప్రకటించింది. గతేడాది సౌత్ అమెరికాలో రోడ్డు ప్రమాదాల్లో 3100 మంది మరణించారు. అలాగే 2023 జనవరిలో పెరూలోనే కొండపై నుంచి బస్సు పడిపోవడంతో 24 మంది మరణించారు.