E-Paper
Advertisement

నేపాల్‌కు కూతవేటు దూరంలో.. చైనా సిచువాన్‌ ప్రావిన్స్‌లో భూకంపం, తీవ్రత 5 కు పైగానే

నేపాల్‌కు కూతవేటు దూరంలో.. చైనా సిచువాన్‌ ప్రావిన్స్‌లో భూకంపం, తీవ్రత 5 కు పైగానే
Advertisement

Earthquake: ప్రపంచవ్యాప్తంగా భూకంపాలు యాక్టివేట్ అవుతున్నాయి. ఎప్పుడు, ఏ ప్రాంతంలో భూకంపం వస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. మూడు రోజుల కిందట నేపాల్‌ జల ప్రళయం కళ్ల ముందు కదులుతూనే ఉంది. తాజాగా నేపాల్‌కు కొద్ది దూరంలో ఉన్న చైనాలోని సిచువాన్ ప్రావిన్స్‌లో భారీ భూకంపం సంభవించింది. ఇది రిక్టర్ స్కేలుపై 5.1గా నమోదు అయ్యింది.

 

చైనాలో సిచువాన్‌ ప్రావిన్స్‌లో భూకంపం

Advertisement

నైరుతి చైనాలోని సిచువాన్ ప్రావిన్స్‌లోని లాంగ్‌చాంగ్ సిటీలో శుక్రవారం మధ్యాహ్నం భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.1గా నమోదు అయ్యింది. ఈ విషయాన్ని చైనా భూకంప నెట్‌వర్క్స్ సెంటర్- CENC వెల్లడించింది. బీజింగ్ కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1.10 గంటలకు సంభవించింది.

 

రిక్టర్ స్కేలుపై  5.1గా నమోదు

Advertisement

భూకంపం యొక్క కేంద్రం ఉత్తర అక్షాంశం- తూర్పు రేఖాంశం మధ్య ఏర్పడింది. ఈ భూకంపం భూమికి 13 కిలోమీటర్ల లోతులో సంభవించినట్టు పేర్కొంది. ఆ ప్రాంతమంతా హిమాలయాలు ఉండడంతో దీని ప్రభావం మిగతా ప్రాంతాలపై పడే అవకాశముందని అక్కడి అధికారులు అంచనా వేస్తున్నారు.

 

నేపాల్-టిబెట్ సరిహద్దుకు దగ్గరగా

ఆగ్నేయ సిచువాన్‌లో నెయిజియాంగ్ పరిపాలనలోవున్న కౌంటీ స్థాయి సిటీ లాంగ్‌చాంగ్. చోంగ్‌కింగ్ మునిసిపాలిటీ సరిహద్దుకు సమీపంలో ఉంది. చెంగ్డూ-చోంగ్‌ కింగ్‌ నగరాలకు దాదాపు మధ్యలో ఉంటుంది. సిచువాన్ ప్రాంతం మిగతా పొరుగు ప్రాంతాలకు ఒక ముఖ్యమైన రవాణా కేంద్రం. సమీప ప్రాంతాల్లో భూప్రకంపనలు సంభవించే అవకాశం ఉంది.

ప్రాణ, ఆస్తి నష్టం గురించి ఇంకా వివరాలు వెల్లడికాలేదు. కాకపోతే నేపాల్-టిబెట్ సరిహద్దుకు దగ్గర ప్రాంతంగా చెబుతున్నారు. అన్నట్లు ఆ ప్రాంతంలో భూకంపాలు రావచ్చని గురువారం అధికారులు వెల్లడించారు. అంతలోనే భూకంపం చోటు చేసుకుంది. దీంతో నేపాల్, టిబెట్, చైనా పర్వత ప్రాంతాల్లో ప్రజలకు అప్పుడే వణుకు మొదలైంది.

ALSO READ: మరో 3 రోజుల్లో నేపాల్‌లో మళ్లీ వరదలు.. మీడియాపై ఆంక్షలు విధించిన చైనా 

Related News

మరో 3 రోజుల్లో నేపాల్‌లో మళ్లీ వరదలు.. మీడియాపై ఆంక్షలు విధించిన చైనా.. టిబెట్ ప్రభుత్వం సీరియస్

శవాల గుట్టలు.. శరీర భాగాలు.. పది అంతస్తుల ఎత్తులో బురద ప్రవాహం.. ఎలా ముంచేసిందంటే?

నేపాల్‌లో విధ్వంసం తర్వాత.. భారత్ సరిహద్దులో చైనా భారీ డ్యామ్‌, ‘వాటర్ బాంబ్’ అని ఎందుకంటున్నారు?

స్వర్గం లాంటి దేశంలో.. పదే పదే విపత్తులు ఎందుకు? నేపాల్‌ వినాశనానికి దారితీస్తున్న అంశాలివే!

నేపాల్‌లో జల ప్రళయం.. మానస సరోవర్ యాత్రకు బ్రేక్, యాత్రకు ఎన్ని మార్గాలున్నాయి?

నేపాల్ జల ప్రళయంలో 160 మంది మృతి.. 1000 మంది మిస్సింగ్, చైనా ఎందుకు సైలెంట్ అయ్యింది?

ప్రపంచవ్యాప్తంగా వీసా ఇంటర్వ్యూలు నిలిపివేత.. ట్రంప్ సర్కార్ కీలక నిర్ణయం

Big Stories

Advertisement
×