E-Paper
Advertisement

Houthi Attacks : 50 నౌకలు టార్గెట్..? హౌతీ భీకర దాడులు..

Houthi Attacks : 50 నౌకలు టార్గెట్..? హౌతీ భీకర దాడులు..

Houthi Attacks : ఒకటీ అరా కాదు.. ఏకంగా 50 వాణిజ్య నౌకలను హౌతీ రెబెల్స్ లక్ష్యంగా చేసుకున్నారు. హద్దులు మీరవద్దంటూ వారం రోజుల క్రితం అమెరికా చేసిన హెచ్చరికలనూ పెడచెవిన పెట్టారు. మంగళవారం రాత్రి భీకర దాడులకు పాల్పడ్డారు. ఎర్ర‌సముద్రంలో ఉన్న ఈ నౌకలపై యాంటీషిప్ మిస్సైళ్లు, సూసైడ్ డ్రోన్ యూఏవీలను ప్రయోగించారని అమెరికా సెంట్రల్ కమాండ్ వెల్లడించింది.

యెమెన్‌లోని రెండు ప్రాంతాల నుంచి ఈ దాడులు జరిగినట్టుగా భావిస్తున్నారు. మోఖా, హొడైడా నుంచి వరుసబెట్టి 21 మిస్సైళ్లు, డ్రోన్లతో హౌతీలు విరుచుకుపడ్డారు. ఎర్రసముద్రంలో హౌతీలు, యూఎస్ టాస్క్ ఫోర్స్ మధ్య భీకర పోరు సాగుతోంది. యూఎస్ నేవీ, రాయల్ నేవీ ఈ దాడులను తిప్పి కొడుతున్నట్టు తెలిసింది.

ఇప్పటివరకు సంయుక్త నావికాదళాలు 18 సూసైడ్ డ్రోన్లను ధ్వంసం చేశాయి. గత నాలుగు నెలలుగా హౌతీలు దాడులకు తెగబడుతుండగా.. ఇదే అతి పెద్ద దాడిగా భద్రతా నిపుణులు భావిస్తున్నారు. యెమెన్‌కు చెందిన హౌతీ ఉగ్రవాద సంస్థ.. గత 7 వారాల్లో జరిపిన 26వ దాడి అని అమెరికా మిలటరీ తెలిపింది. ఇప్పటి వరకు ఆస్తి, ప్రాణనష్టం ఏదీ సంభవించలేదు.

Tags

Related News

Big Shock To Trump: ట్రంప్‌కు ఊహించని ఝలక్.. షాకిచ్చిన వార్ పవర్స్, ఆపరేషన్ ‘ఎపిక్ ఫ్యూరీ’ క్లోజ్

Kuwait Airport: ఇరాన్ మిస్సైళ్ల దాడులు.. కువైట్‌ ఎయిర్‌పోర్ట్ డ్యామేజ్, విమాన సర్వీసులు రద్దు

మరో బాంబ్‌ పేల్చిన అమెరికా.. భారత్‌పై అదనపు సుంకాలకు ప్రతిపాదన, ఏకంగా 12 శాతం

పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు.. అమెరికా స్థావరాలపై ఇరాన్ వరుస దాడులు, ఖేష్మ్ ద్వీపంపై

ఇరాన్ షాకింగ్ నిర్ణయం.. ఇకపై మాటలు-చర్చల్లేవ్, హోర్మూజ్ జలసంధి మాటేంటి?

ఇరాన్‌లో ఇంటిపోరు మొదలైందా? అధ్యక్షుడు మసూద్‌ నిర్ణయం వెనుక, అసలేం జరుగుతోంది?

రూటు మార్చిన అమెరికా.. ఇరాన్‌పై మెరుపు దాడులు, రాడార్- డ్రోన్ వ్యవస్థలు డ్యామేజ్

హోర్ముజ్ జలసంధిలో హై టెన్షన్.. ఇరాన్ సైనిక క్యాంప్‌పై అమెరికా దాడి, కవ్వింపు చర్యలు డీల్ కోసమా?

Big Stories

×