E-Paper
Advertisement

Houthi Attacks : 50 నౌకలు టార్గెట్..? హౌతీ భీకర దాడులు..

Houthi Attacks : 50 నౌకలు టార్గెట్..? హౌతీ భీకర దాడులు..
Advertisement

Houthi Attacks : ఒకటీ అరా కాదు.. ఏకంగా 50 వాణిజ్య నౌకలను హౌతీ రెబెల్స్ లక్ష్యంగా చేసుకున్నారు. హద్దులు మీరవద్దంటూ వారం రోజుల క్రితం అమెరికా చేసిన హెచ్చరికలనూ పెడచెవిన పెట్టారు. మంగళవారం రాత్రి భీకర దాడులకు పాల్పడ్డారు. ఎర్ర‌సముద్రంలో ఉన్న ఈ నౌకలపై యాంటీషిప్ మిస్సైళ్లు, సూసైడ్ డ్రోన్ యూఏవీలను ప్రయోగించారని అమెరికా సెంట్రల్ కమాండ్ వెల్లడించింది.

యెమెన్‌లోని రెండు ప్రాంతాల నుంచి ఈ దాడులు జరిగినట్టుగా భావిస్తున్నారు. మోఖా, హొడైడా నుంచి వరుసబెట్టి 21 మిస్సైళ్లు, డ్రోన్లతో హౌతీలు విరుచుకుపడ్డారు. ఎర్రసముద్రంలో హౌతీలు, యూఎస్ టాస్క్ ఫోర్స్ మధ్య భీకర పోరు సాగుతోంది. యూఎస్ నేవీ, రాయల్ నేవీ ఈ దాడులను తిప్పి కొడుతున్నట్టు తెలిసింది.

Advertisement

ఇప్పటివరకు సంయుక్త నావికాదళాలు 18 సూసైడ్ డ్రోన్లను ధ్వంసం చేశాయి. గత నాలుగు నెలలుగా హౌతీలు దాడులకు తెగబడుతుండగా.. ఇదే అతి పెద్ద దాడిగా భద్రతా నిపుణులు భావిస్తున్నారు. యెమెన్‌కు చెందిన హౌతీ ఉగ్రవాద సంస్థ.. గత 7 వారాల్లో జరిపిన 26వ దాడి అని అమెరికా మిలటరీ తెలిపింది. ఇప్పటి వరకు ఆస్తి, ప్రాణనష్టం ఏదీ సంభవించలేదు.

Tags

Related News

అమెరికాలో ఘోర ప్రమాదం.. హైదరాబాద్‌కు చెందిన ముగ్గురు మృతి!

కార్నివాల్ క్రూయిజ్ షిప్‌లో.. ఓ మహిళ ఒకటే గోకుడు, వీడియో వైరల్

హౌతీలు ప్రకటన.. బాబ్‌ ఎల్‌-మాండెబ్‌ జలసంధి మూసివేత, ప్రపంచ దేశాల్లో గుబులు

పశ్చిమాసియాలో యుద్ధ భేరి.. ఇరాన్‌పై విరుచుకుపడ్డ అమెరికా.. హర్మూజ్ జలసంధిలో తీవ్ర ఉద్రిక్తత!

ఆకస్మిక వరదల్లో కొట్టుకుపోయిన అఫ్గానిస్తాన్‌.. 20 మంది మృతి, 100 మంది గల్లంతు

అయ్యబాబోయ్.. ‘సైకిల్ అంబులెన్స్’ అంట.. నెట్టింట మళ్లీ జోకర్ అయిన పాక్!

పెరులో వరుస భూకంపాలు.. ఆరుగురు మృతి, వందలాది మంది నిరాశ్రయులు

అమెరికా స్థావరాలపై ఇరాన్ భీకర దాడులు.. ఇద్దరు అమెరికా సైనికులు మృతి, ట్రంప్‌పై ఖమేని ఘాటు వ్యాఖ్యలు

Big Stories

Advertisement
×