BigTV English

Houti Rebels | మళ్లీ విరుచుకుపడిన హౌతీలు.. బ్రిటన్ షిప్‌పై మిసైల్ దాడులు!

Houti Rebels | ఎర్ర సముద్రంలో బ్రిటన్ నౌక మార్లిన్ లుఆండాపై యెమెన్ దేశానికి చెందిన హౌతీ విద్రోహులు క్షిపణి దాడి చేశారు. ఈ దాడి శుక్రవారం జనవరి 26 రాత్రి జరిగింది. 23 సిబ్బంది గల ఈ నౌకలో మండే స్వభావం గల 80 వేల టన్నుల ద్రవ్యం కంటెయినర్లు ఉన్నాయి. దీంతో క్షిపణి దాడి జరుగగానే నౌకలో మంటలు చెలరేగాయి. నౌక సిబ్బందిలో మొత్తం 22 మంది భారతీయులు, ఇద్దరు శ్రీలంక పౌరులన్నారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.

Houti Rebels | మళ్లీ విరుచుకుపడిన హౌతీలు.. బ్రిటన్ షిప్‌పై మిసైల్ దాడులు!

Houti Rebels | ఎర్ర సముద్రంలో బ్రిటన్ నౌక మార్లిన్ లుఆండాపై యెమెన్ దేశానికి చెందిన హౌతీ విద్రోహులు క్షిపణి దాడి చేశారు. ఈ దాడి శుక్రవారం జనవరి 26 రాత్రి జరిగింది. 23 సిబ్బంది గల ఈ నౌకలో మండే స్వభావం గల 80 వేల టన్నుల ద్రవ్యం కంటెయినర్లు ఉన్నాయి. దీంతో క్షిపణి దాడి జరుగగానే నౌకలో మంటలు చెలరేగాయి. నౌక సిబ్బందిలో మొత్తం 22 మంది భారతీయులు, ఇద్దరు శ్రీలంక పౌరులన్నారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.


దాడి జరిగిన తరువాత మార్లిన్ లుఆండా నౌక సిబ్బంది సహాయం కోసం రేడియో కాల్ చేయగా.. వెంటనే ఇండియన్ నేవీ యుద్ధ నౌక ఐఎన్ఎస్ విశాఖపట్నం స్పందించింది. నౌకలో రగిలిన మంటలను భారత యుద్ధ నౌక ఐఎన్ఎస్ విశాఖపట్నం సిబ్బంది న్యూక్లియర్ బయోలాజికల్ కెమికల్ డిఫెన్స్ విధానంతో ఆర్పడానికి సహాయం చేసింది.

ఎర్ర్ సముద్రానికి తీరం కలిగిన దేశాలలో బహ్రెయిన్ ఒకటి. బహ్రెయిన్‌లో అమెరికా ఆర్మీ పెద్ద స్థావరం ఉంది. ఆ స్థావరం నుంచి అమెరికన్ అధికారులు ఈ దాడి గురించి ప్రకటన విడుదల చేశారు. ఈ దాడి జనవరి 26 రాత్రి 7 గంటల 45 నిమిషాలకు(యెమెన్ దేశ సమయం)జరిగింది.


యెమెన్ దేశంలోని హౌతీ స్థావరాల నుంచి వచ్చిన ఒక డ్రోన్ మిసైల్ బ్రిటన్ చమురు నౌక మార్లిన్ లుఆండాపై దాడి చేసింది. బ్రిటన్ దే శ ప్రభుత్వం ఈ దాడిపై స్పందిస్తూ.. హౌతీలపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని తెలిపింది.

హౌతీ రెబెల్స్ శుక్రవారం మరో దాడి కూడా చేశారని సమాచారం. హౌతీలను సముద్రంలో దాడుల చేయకుండా కట్టడి చేసేందుకు అమెరికా మోహరించిన యుద్ధ నౌక యుఎస్ఎస్ కార్నీపై కూడా దాడి జరిగింది. అయితే ఈ దాడిలో పెద్దగా నష్టమేమి జరగలేదు. ఈ దాడికి ప్రతిచర్యగా అమెరికా కూడా శనివారం ఉదయం యోమెన్ లోని హౌతీ స్థావరంపై దాడులు చేసింది.

హౌతీల అధికారిక మీడియా అల్ మసిరహ్ కథనం ప్రకారం అమెరికా క్షిపణులు యెమెన్ పోర్టు నగరమైన హొదేదాపై దాడి చేశాయి. కానీ ఈ దాడి ప్రభావం గురించి పూర్తి వివరాలను ఇరు పక్షాలు వెల్లడించలేదు.

అమెరికా యుద్ద నౌకపై హౌతీలు నేరుగా దాడి చేయడం ఇదే తొలిసారి కావడం విశేషం.

Houti Rebels, attack, Britain oil tanker, cargo ship, Martin Luanda, Red sea, Gulf of Eden, INS Visakhapatnam, US War ship,

Tags

Related News

Turkey Earthquake: టర్కీని కుదిపేసిన భూకంపం.. ఎటు చూసినా శిథిలాల దిబ్బలు

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

Big Stories

×