E-Paper
Advertisement

Houti Rebels | మళ్లీ విరుచుకుపడిన హౌతీలు.. బ్రిటన్ షిప్‌పై మిసైల్ దాడులు!

Houti Rebels | ఎర్ర సముద్రంలో బ్రిటన్ నౌక మార్లిన్ లుఆండాపై యెమెన్ దేశానికి చెందిన హౌతీ విద్రోహులు క్షిపణి దాడి చేశారు. ఈ దాడి శుక్రవారం జనవరి 26 రాత్రి జరిగింది. 23 సిబ్బంది గల ఈ నౌకలో మండే స్వభావం గల 80 వేల టన్నుల ద్రవ్యం కంటెయినర్లు ఉన్నాయి. దీంతో క్షిపణి దాడి జరుగగానే నౌకలో మంటలు చెలరేగాయి. నౌక సిబ్బందిలో మొత్తం 22 మంది భారతీయులు, ఇద్దరు శ్రీలంక పౌరులన్నారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.

Houti Rebels | మళ్లీ విరుచుకుపడిన హౌతీలు.. బ్రిటన్ షిప్‌పై మిసైల్ దాడులు!
Advertisement

Houti Rebels | ఎర్ర సముద్రంలో బ్రిటన్ నౌక మార్లిన్ లుఆండాపై యెమెన్ దేశానికి చెందిన హౌతీ విద్రోహులు క్షిపణి దాడి చేశారు. ఈ దాడి శుక్రవారం జనవరి 26 రాత్రి జరిగింది. 23 సిబ్బంది గల ఈ నౌకలో మండే స్వభావం గల 80 వేల టన్నుల ద్రవ్యం కంటెయినర్లు ఉన్నాయి. దీంతో క్షిపణి దాడి జరుగగానే నౌకలో మంటలు చెలరేగాయి. నౌక సిబ్బందిలో మొత్తం 22 మంది భారతీయులు, ఇద్దరు శ్రీలంక పౌరులన్నారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.

దాడి జరిగిన తరువాత మార్లిన్ లుఆండా నౌక సిబ్బంది సహాయం కోసం రేడియో కాల్ చేయగా.. వెంటనే ఇండియన్ నేవీ యుద్ధ నౌక ఐఎన్ఎస్ విశాఖపట్నం స్పందించింది. నౌకలో రగిలిన మంటలను భారత యుద్ధ నౌక ఐఎన్ఎస్ విశాఖపట్నం సిబ్బంది న్యూక్లియర్ బయోలాజికల్ కెమికల్ డిఫెన్స్ విధానంతో ఆర్పడానికి సహాయం చేసింది.

Advertisement

ఎర్ర్ సముద్రానికి తీరం కలిగిన దేశాలలో బహ్రెయిన్ ఒకటి. బహ్రెయిన్‌లో అమెరికా ఆర్మీ పెద్ద స్థావరం ఉంది. ఆ స్థావరం నుంచి అమెరికన్ అధికారులు ఈ దాడి గురించి ప్రకటన విడుదల చేశారు. ఈ దాడి జనవరి 26 రాత్రి 7 గంటల 45 నిమిషాలకు(యెమెన్ దేశ సమయం)జరిగింది.

యెమెన్ దేశంలోని హౌతీ స్థావరాల నుంచి వచ్చిన ఒక డ్రోన్ మిసైల్ బ్రిటన్ చమురు నౌక మార్లిన్ లుఆండాపై దాడి చేసింది. బ్రిటన్ దే శ ప్రభుత్వం ఈ దాడిపై స్పందిస్తూ.. హౌతీలపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని తెలిపింది.

Advertisement

హౌతీ రెబెల్స్ శుక్రవారం మరో దాడి కూడా చేశారని సమాచారం. హౌతీలను సముద్రంలో దాడుల చేయకుండా కట్టడి చేసేందుకు అమెరికా మోహరించిన యుద్ధ నౌక యుఎస్ఎస్ కార్నీపై కూడా దాడి జరిగింది. అయితే ఈ దాడిలో పెద్దగా నష్టమేమి జరగలేదు. ఈ దాడికి ప్రతిచర్యగా అమెరికా కూడా శనివారం ఉదయం యోమెన్ లోని హౌతీ స్థావరంపై దాడులు చేసింది.

హౌతీల అధికారిక మీడియా అల్ మసిరహ్ కథనం ప్రకారం అమెరికా క్షిపణులు యెమెన్ పోర్టు నగరమైన హొదేదాపై దాడి చేశాయి. కానీ ఈ దాడి ప్రభావం గురించి పూర్తి వివరాలను ఇరు పక్షాలు వెల్లడించలేదు.

అమెరికా యుద్ద నౌకపై హౌతీలు నేరుగా దాడి చేయడం ఇదే తొలిసారి కావడం విశేషం.

Houti Rebels, attack, Britain oil tanker, cargo ship, Martin Luanda, Red sea, Gulf of Eden, INS Visakhapatnam, US War ship,

Tags

Related News

కార్నివాల్ క్రూయిజ్ షిప్‌లో.. ఓ మహిళ ఏం చేసిందంటే, వీడియో వైరల్

హౌతీలు ప్రకటన.. బాబ్‌ ఎల్‌-మాండెబ్‌ జలసంధి మూసివేత, ప్రపంచ దేశాల్లో గుబులు

పశ్చిమాసియాలో యుద్ధ భేరి.. ఇరాన్‌పై విరుచుకుపడ్డ అమెరికా.. హర్మూజ్ జలసంధిలో తీవ్ర ఉద్రిక్తత!

ఆకస్మిక వరదల్లో కొట్టుకుపోయిన అఫ్గానిస్తాన్‌.. 20 మంది మృతి, 100 మంది గల్లంతు

అయ్యబాబోయ్.. ‘సైకిల్ అంబులెన్స్’ అంట.. నెట్టింట మళ్లీ జోకర్ అయిన పాక్!

పెరులో వరుస భూకంపాలు.. ఆరుగురు మృతి, వందలాది మంది నిరాశ్రయులు

అమెరికా స్థావరాలపై ఇరాన్ భీకర దాడులు.. ఇద్దరు అమెరికా సైనికులు మృతి, ట్రంప్‌పై ఖమేని ఘాటు వ్యాఖ్యలు

హార్మూజ్ జలసంధిలో హైటెన్షన్.. సముద్రంలో పేలిన రెండు చమురు ట్యాంకర్లు!

Big Stories

Advertisement
×