BigTV English

YS Sharmila : ‘జగన్ కేడీ’.. మాట ఇచ్చి తప్పారు..

YS Sharmila : తన పుట్టింటికి వచ్చి రాజకీయం చేస్తున్నా.. ఎంతటి త్యాగానికైనా.. పోరాటానికైనా సిద్ధం అని ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల అన్నారు. తిరుపతి జిల్లా పర్యటనలో భాగంగా ఆమె కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వైఎస్‌ఆర్‌, జగనన్న పాలనకు ఆకాశం, పాతాళానికి ఉన్నంత తేడా ఉందన్నారు. హంద్రీనీవా ప్రాజెక్టును వైఎస్‌ఆర్‌ 90శాతం పూర్తి చేశారని పేర్కొన్నారు. మిగిలిన 10శాతం పూర్తి చేయడానికి జగనన్నకు సాధ్యం కాలేదన్నారు.

YS Sharmila : ‘జగన్ కేడీ’.. మాట ఇచ్చి తప్పారు..

YS Sharmila : తన పుట్టింటికి వచ్చి రాజకీయం చేస్తున్నా.. ఎంతటి త్యాగానికైనా.. పోరాటానికైనా సిద్ధం అని ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల అన్నారు. తిరుపతి జిల్లా పర్యటనలో భాగంగా ఆమె కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వైఎస్‌ఆర్‌, జగనన్న పాలనకు ఆకాశం, పాతాళానికి ఉన్నంత తేడా ఉందన్నారు. హంద్రీనీవా ప్రాజెక్టును వైఎస్‌ఆర్‌ 90శాతం పూర్తి చేశారని పేర్కొన్నారు. మిగిలిన 10శాతం పూర్తి చేయడానికి జగనన్నకు సాధ్యం కాలేదన్నారు.


గాలేరు-నగరి ప్రాజెక్టులో మిగిలిన 50శాతం పనులు కూడా పూర్తి చేయలేదని వైసీపీ పాలనను షర్మిల విమర్శించారు. రాష్ట్రాన్ని అభివృద్ది చేయలేని జగన్‌.. రాజశేఖర్‌రెడ్డి వారసుడు ఎలా అవుతారని ప్రశ్నించారు. ప్రాజెక్టులు పూర్తి చేస్తామని చెప్పి మాట తప్పిన జగన్‌ ప్రజలకు ఏం జవాబు చెబుతారని ప్రశ్నించారు.

వైసీపీని భుజాన వేసుకొని 3,200కి.మీ పాదయాత్ర చేసి పార్టీని నిలబెట్టానని షర్మిల పేర్కొన్నారు. కృతజ్ఞత లేకుండా వ్యక్తిగత జీవితంపై దాడి చేస్తున్నారని దుయ్యబట్టారు. పులి కడుపున పులే పుడుతుంది.. ఎన్ని దాడులకు పాల్పడినా భయపడే ప్రసక్తే లేదన్నారు. బీజేపీపై కూడా షర్మిల విమర్శలు గుప్పించారు. రామమందిరం కట్టిన మోదీ తిరుపతిలో ఇచ్చిన మాట తప్పారన్నారు. ఏపీలో మోదీ కేడీగా నిలిచిపోయారని ధ్వజమెత్తారు. బీజేపీకి మద్దతు పలుకుతున్న జగన్‌ కూడా కేడీనేనని వ్యాఖ్యానించారు.


Related News

Anam Fires On YS Sharmila: ఆలయాలకు బదులుగా టాయిలెట్స్.. వైఎస్ షర్మిల వ్యాఖ్యలపై మంత్రి ఆనం ఆగ్రహం

CM Chandrababu: ఏపీని 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్దిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే స్వర్ణాంధ్ర లక్ష్యం: సీఎం చంద్రబాబు

AP Rain Alert: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. రేపు ఈ జిల్లాల్లో వర్షాలు.. మత్స్యకారులకు అలర్ట్

AP Government: రాష్ట్రానికి ప్రపంచ ప్రఖ్యాత కంపెనీ.. పెట్టుబడుల కోసం ప్రభుత్వం మరో ముందడుగు

AP Govt: పండుగ పూట గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం.. పెండింగ్ బిల్లులు విడుదల

Housing Permission For Rupee: ఇల్లు కట్టుకునే వారికి ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. రూపాయికే నిర్మాణ అనుమతులు

Tirumala: తిరుమలలో భూతకోల నృత్య ప్రదర్శనపై వివాదం..

Tirupati: 220 కేవీ విద్యుత్ టవర్ ఎక్కి వేలాడుతూ వ్యక్తి హంగామా

Big Stories

×