E-Paper
Advertisement

YS Sharmila : ‘జగన్ కేడీ’.. మాట ఇచ్చి తప్పారు..

YS Sharmila : తన పుట్టింటికి వచ్చి రాజకీయం చేస్తున్నా.. ఎంతటి త్యాగానికైనా.. పోరాటానికైనా సిద్ధం అని ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల అన్నారు. తిరుపతి జిల్లా పర్యటనలో భాగంగా ఆమె కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వైఎస్‌ఆర్‌, జగనన్న పాలనకు ఆకాశం, పాతాళానికి ఉన్నంత తేడా ఉందన్నారు. హంద్రీనీవా ప్రాజెక్టును వైఎస్‌ఆర్‌ 90శాతం పూర్తి చేశారని పేర్కొన్నారు. మిగిలిన 10శాతం పూర్తి చేయడానికి జగనన్నకు సాధ్యం కాలేదన్నారు.

YS Sharmila : ‘జగన్ కేడీ’.. మాట ఇచ్చి తప్పారు..

YS Sharmila : తన పుట్టింటికి వచ్చి రాజకీయం చేస్తున్నా.. ఎంతటి త్యాగానికైనా.. పోరాటానికైనా సిద్ధం అని ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల అన్నారు. తిరుపతి జిల్లా పర్యటనలో భాగంగా ఆమె కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వైఎస్‌ఆర్‌, జగనన్న పాలనకు ఆకాశం, పాతాళానికి ఉన్నంత తేడా ఉందన్నారు. హంద్రీనీవా ప్రాజెక్టును వైఎస్‌ఆర్‌ 90శాతం పూర్తి చేశారని పేర్కొన్నారు. మిగిలిన 10శాతం పూర్తి చేయడానికి జగనన్నకు సాధ్యం కాలేదన్నారు.

గాలేరు-నగరి ప్రాజెక్టులో మిగిలిన 50శాతం పనులు కూడా పూర్తి చేయలేదని వైసీపీ పాలనను షర్మిల విమర్శించారు. రాష్ట్రాన్ని అభివృద్ది చేయలేని జగన్‌.. రాజశేఖర్‌రెడ్డి వారసుడు ఎలా అవుతారని ప్రశ్నించారు. ప్రాజెక్టులు పూర్తి చేస్తామని చెప్పి మాట తప్పిన జగన్‌ ప్రజలకు ఏం జవాబు చెబుతారని ప్రశ్నించారు.

వైసీపీని భుజాన వేసుకొని 3,200కి.మీ పాదయాత్ర చేసి పార్టీని నిలబెట్టానని షర్మిల పేర్కొన్నారు. కృతజ్ఞత లేకుండా వ్యక్తిగత జీవితంపై దాడి చేస్తున్నారని దుయ్యబట్టారు. పులి కడుపున పులే పుడుతుంది.. ఎన్ని దాడులకు పాల్పడినా భయపడే ప్రసక్తే లేదన్నారు. బీజేపీపై కూడా షర్మిల విమర్శలు గుప్పించారు. రామమందిరం కట్టిన మోదీ తిరుపతిలో ఇచ్చిన మాట తప్పారన్నారు. ఏపీలో మోదీ కేడీగా నిలిచిపోయారని ధ్వజమెత్తారు. బీజేపీకి మద్దతు పలుకుతున్న జగన్‌ కూడా కేడీనేనని వ్యాఖ్యానించారు.

Related News

Amaravati: చంద్రబాబు కేబినెట్ భేటీ.. మధ్యలో వెళ్లిపోయిన పవన్ కళ్యాణ్, ఏం జరిగింది?

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

Big Stories

×