E-Paper
Advertisement

Muizzu: భారత్‌పై మరోసారి కీలక వ్యాఖ్యలు చేసిన మాల్దీవుల అధ్యక్షుడు

Muizzu: భారత్‌పై మరోసారి కీలక వ్యాఖ్యలు చేసిన మాల్దీవుల అధ్యక్షుడు

Maldives President Muizzu: మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జు తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ పట్ల సానుకూలతను వ్యక్తం చేశారు. మాల్దీవుల సన్నిహిత మిత్ర దేశాల్లో భారత్ ఒకటని పేర్కొన్నారు. అంతేకాదు.. ముఖ్యమైన భాగస్వామి అంటూ ఆయన వ్యాఖ్యానించారు. తమ దేశం అవసరంలో ఉన్నప్పుడల్లా సాయంలో భారత్ ముందుంటుందని ప్రశంసించారు. అధ్యక్ష కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ఈ విధంగా స్పందించారు.

మాల్దీవుల్లోని 28 ద్వీపాలకు నీటి సరఫరా, మురుగునీటి పారుదల ఏర్పాట్లు చేశారు. ఈ సౌకర్యాల కల్పన విషయంలో భారత్ సహకరించింది. ఇందుకోసం ఎగ్జిమ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రాయితీతో కూడిన రుణాన్ని అందించింది. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముయిజ్జు మాట్లాడుతూ.. ‘ఈ ప్రాజెక్టులు ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల్లో కీలక మైలురాయి. భారత్ తో ఉన్న చారిత్రక సన్నిహిత సంబంధాలను మరింతగా బలోపేతం చేసేందుకు కట్టుబడి ఉన్నాం. మాల్దీవుల పట్ల చూపుతున్న ఉదారతకు ప్రధాని మోదీ, భారత ప్రభుత్వం, ప్రజలకు కృతజ్ఞతలు’ అంటూ ఆయన పేర్కొన్నారు.

Also Read: చిక్కుల్లో భారత్.. వార్ తప్పదా? మోదీ ప్లానేంటి?

ఇదిలా ఉంటే.. గతంలోనూ రుణ విముక్తి కోసం ముయిజ్జు విజ్ఞప్తి చేసిన విషయం విధితమే. గతేడాది చివరి నాటికి భారత్ కు మాల్దీవులు సుమారుగా 400.9 మిలియన్ డాలర్లు చెల్లించాల్సి ఉంది. దానిని చెల్లించడంలో ఉపశమనం కలిగించాలంటూ కొద్ది నెలల క్రితం ద్వీప దేశం ప్రాధేయపడగా, అందుకు ఇండియా ఓకే చెప్పింది. కాగా, నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసిన కార్యక్రమానికి కూడా ముయిజ్జు హాజరయ్యారు.

Tags

Related News

Big Shock To Trump: ట్రంప్‌కు ఊహించని ఝలక్.. షాకిచ్చిన వార్ పవర్స్, ఆపరేషన్ ‘ఎపిక్ ఫ్యూరీ’ క్లోజ్

Kuwait Airport: ఇరాన్ మిస్సైళ్ల దాడులు.. కువైట్‌ ఎయిర్‌పోర్ట్ డ్యామేజ్, విమాన సర్వీసులు రద్దు

మరో బాంబ్‌ పేల్చిన అమెరికా.. భారత్‌పై అదనపు సుంకాలకు ప్రతిపాదన, ఏకంగా 12 శాతం

పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు.. అమెరికా స్థావరాలపై ఇరాన్ వరుస దాడులు, ఖేష్మ్ ద్వీపంపై

ఇరాన్ షాకింగ్ నిర్ణయం.. ఇకపై మాటలు-చర్చల్లేవ్, హోర్మూజ్ జలసంధి మాటేంటి?

ఇరాన్‌లో ఇంటిపోరు మొదలైందా? అధ్యక్షుడు మసూద్‌ నిర్ణయం వెనుక, అసలేం జరుగుతోంది?

రూటు మార్చిన అమెరికా.. ఇరాన్‌పై మెరుపు దాడులు, రాడార్- డ్రోన్ వ్యవస్థలు డ్యామేజ్

హోర్ముజ్ జలసంధిలో హై టెన్షన్.. ఇరాన్ సైనిక క్యాంప్‌పై అమెరికా దాడి, కవ్వింపు చర్యలు డీల్ కోసమా?

Big Stories

×