E-Paper
Advertisement

Ponguleti: చింతమడకలో ఇళ్లు కూల్చేసిన కేసీఆర్.. మేం నిర్మాణాలు పూర్తి చేస్తాం: మంత్రి పొంగులేటి

Ponguleti: చింతమడకలో ఇళ్లు కూల్చేసిన కేసీఆర్.. మేం నిర్మాణాలు పూర్తి చేస్తాం: మంత్రి పొంగులేటి
Advertisement

Double Bed Room: రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఆయన స్వగ్రామం చింతమడకలో ఐదేళ్ల క్రితం డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తామని హామీ ఇచ్చి వారి ఇళ్లు కూల్చేశాడని, తీరా చూస్తే వారందరికీ డబుల్ బెడ్రూం ఇళ్లు ఇవ్వలేదని మంత్రి తెలిపారు. సొంత ఊరోళ్లకే పంగనామాలు పెట్టి నిలువ నీడ లేకుండా చేశారని పేర్కొన్నారు. ఉన్న ఇల్లు పీకి పందిరి వేసినట్టుగా కేసీఆర్ పనితనం సాగిందని విమర్శించారు. కేసీఆర్ స్వగ్రామం అని చింతమడకను తాము నిర్లక్ష్యం చేయబోమని, భేషజాలకు పోబోమని స్పష్టం చేశారు.

‘చింతమడకలో ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూం ఇల్లు నిర్మిస్తామని 2019 జులై 22వ తేదీన కేసీఆర్ ఆర్భాటంగా ప్రకటన చేశారు. ఆయన మాటలు నమ్మి ప్రజలు తమ ఇళ్లు, గుడిసెలను అక్కడి నిరుపేదలు ప్రభుత్వానికి అప్పగించారు. డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం వాటిని కూల్చేశారు. లబ్దిదారులను గుర్తించి 1909 ఇళ్లను అధికారులు మంజూరు చేశారు. కానీ, 1215 ఇళ్లను నిర్మించడానికే కాంట్రాక్టర్లు ఒప్పందం చేసుకున్నారు. 694 ఇళ్లకు అగ్రిమెంటే జరగలేదు, నిర్మాణ పనులు ప్రారంభం కాలేదు. గతేడాది డిసెంబర్ నాటికి నాలుగేళ్ల కాలంలో 1103 ఇళ్లు మాత్రమే పూర్తి చేశారు. దీంతో ఉన్న ఇళ్లు, గుడిసె కూడా కోల్పోయినవారు నిలువ నీడ లేకుండా మారిపోయారు. కొందరు పొలాల వద్ద గుడిసెలు వేసుకుంటే మరికొందరు వలసలు పోయారు’ అని పేర్కొన్నారు. ప్రజల అవసరాలను, ఆశలను బీఆర్ఎస్ నేతలు రాజకీయ అవసరాలకు వాడుకున్నారని, ఇందుకు కేసీఆర్ స్వగ్రామమే నిదర్శనం అని మండిపడ్డారు.

Advertisement

Also Read: Madhuri Challenge : “దమ్ముంటే డీఎన్ఏ టెస్ట్ చేయించు”.. దువ్వాడ వాణికి మాధురి సవాల్

ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయడమే ఇందిరమ్మ రాజ్యమని, ముఖ్యంగా పేదవాడికి సొంత ఇల్లు ఒక కల అని, ఇందిరమ్మ రాజ్యంలో పేదోళ్లకు పూర్తి న్యాయం జరుగుతుందని మంత్రి పొంగులేటి వివరించారు. ప్రతి వ్యక్తికి మేలు చేయడమే కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం, లక్ష్యం అని తెలిపారు. బీఆర్ఎస్ నాయకులు ఫామ్‌హౌజ్‌లు కట్టుకున్నారని, పేదలకు మాత్రం ఇంటి సౌకర్యాన్ని విస్మరించారని చెప్పారు. కానీ, తాము వారందరికీ కూడా నివాస వసతిని కల్పిస్తున్నామని, ఇది ప్రజా ప్రభుత్వమని, తక్షణమే చింతమడకలో అధికారుల పర్యటించి ఇళ్ల నిర్మాణానికి అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. త్వరగా అక్కడ ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదేశించారు.

Related News

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

Big Stories

Advertisement
×