E-Paper
Advertisement

Citizenship Amendment Act : సీఏఏపై అమెరికా రియాక్షన్.. భారత్ అభ్యంతరం..

Citizenship Amendment Act :  సీఏఏపై అమెరికా రియాక్షన్.. భారత్ అభ్యంతరం..
Advertisement

Citizenship Amendment Act latest news

India Reacts Strongly To US Remarks To CAA(International news in telugu): భారత్ లో ఇటీవల పౌరసత్వ సవరణ చట్టం .. సీఏఏ అమల్లోకి వచ్చింది. ఈ చట్టంపై అగ్రరాజ్య అమెరికా స్పందించింది. ఈ చట్టం అమలవుతున్న విధానాన్ని సూక్ష్మంగా పరిశీలిస్తున్నామని యూఎస్ విదేశాంగ శాఖ పేర్కొంది. అదే సమయంలో సీఏఏపై ఆ దేశ విదేశాంగ శాఖ ప్రతినిధి మథ్యూ మిల్లర్ ఆందోళన వ్యక్తమంటూ వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యంలో మతాలన్నింటికీ స్వేచ్ఛ ఉంటుందని పేర్కొన్నారు.

Advertisement

సీఏఏ విషయంలో అమెరికా ప్రకటనపై భారత్ అభ్యంతరం తెలిపింది. ఇది తమ దేశ అంతర్గత వ్యవహారమని తేల్చి చెప్పింది. ఈ విషయంపై భారత్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ప్రతినిధి రణ్ దీర్ జైశ్వాల్ కీలక ప్రకటన చేశారు.

పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్ఝానిస్థాన్ దేశాల్లో హింసకు గురైన వారికి ఈ చట్టం ద్వారా భారత పౌరసత్వం కల్పిస్తున్నామని తెలిపారు. ఆయా దేశాల నుంచి భారత్ కు వలస వచ్చిన హిందూ, సిక్కు, బౌద్ధ, జైన, క్రైస్తవ, పార్శీ మతాలకు చెందిన వారికి పౌరసత్వంతోపాటు భద్రత కల్పించడానికి సీఏఏ తీసుకొచ్చామని స్పష్టం చేశారు. సీఏఏ ఏ ఒక్క పౌరుడి హక్కులకు భంగం కలిగించదన్నారు.

Advertisement

Also Read : అణు యుద్ధానికి సిద్ధమంటున్న రష్యా.. సార్వభౌమాధికారానికి, స్వాతంత్య్రానికి ముప్పు తప్పదా ? 

సీఏఏ ఉద్దేశం పౌరసత్వం తీసేయడం కాదని రణ్ దీర్ జైస్వాల్ వివరణ ఇచ్చారు. అందరూ ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని సూచించారు. ఏ దేశంలోనూ పౌరసత్వం లేని వారికి రక్షణ కల్పిస్తుందన్నారు. మానవ హక్కులను కాపాడటానికే సీఏఏ ఉపయోగపడుతుందన్నారు.

Tags

Related News

విఫలమైన సామూహిక సున్తీలు.. 43 మంది బాలురు మృతి, దక్షిణాఫ్రికాలో ఘటన

ట్రంప్‌‌కు ఊహించని షాక్‌.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ వ్యవహారం.. కొత్త ఆదేశాలకు కోర్టు బ్రేక్

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

Big Stories

Advertisement
×