E-Paper
Advertisement

India vs China: చైనా వక్రబుద్ధి.. భారతీయురాలిపై వింత వేధింపులు

India vs China: చైనా వక్రబుద్ధి.. భారతీయురాలిపై వింత వేధింపులు
Advertisement

India vs China: డ్రాగన్ కంట్రీ చైనా మరోసారి తనవక్ర బుద్దిని ప్రదర్శించింది. భారత మహిళ ‘పెమా థాంగ్‌డోక్‌’తో వ్యవహరించిన తీరు వివాదస్పదంగా మారింది. చైనాలోని షాంఘై పుడాంగ్ ఎయిర్ పోర్టు అధికారులు.. పెమా థాంగ్‌డోక్ పాస్‌పోర్టను గుర్తిం చేందుకు నిరాకరించారు. ఎంత చెప్పినా వినకుండా వింతడవాదం చేశా రు. దాంతో అలసిపోయిన పెమా థాంగ్‌డోక్ భారత విదేశాంగ శాఖకు తెలియజేసింది. ఈ అంశంపై స్పందించిన భారత ఎంబసీ వెంటనే స్పందించింది. అక్కడి అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించింది.

చైనా అధికారులు, ఎయిర్ పోర్టు సిబ్బంది తనను వేధించారని చెబుతోంది పెమా థాంగ్‌డోక్. నిబంధనలతో కూడిన వీసా ఉండగానే తన పాస్‌పోర్టు స్వాధీనం చేసుకున్నారని చెబుతోంది. అంతేకాదు జపాన్ వెళ్లే విమానం ఎక్కనివ్వలేదని చెప్పింది. ఎయిర్ పోర్టులో కనీసం తాను ఆహారం కొనేందుకు కూడా అంగీకరించలేదని వాపోయింది. ఇక భారత మహిళకు వేధింపులపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది.

Advertisement

ఘటనపై తీవ్రంగా స్పందించిన భారత్.. చైనాకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. అరుణాచల్ ప్రదేశ్ భారత్‌లో అంతర్భాగమని క్లారిటీ ఇచ్చింది. అరుణాచల్ ప్రదేశ్ ప్రజలు భారత్ పాస్‌పోర్టుతో స్వేచ్ఛగా ప్రయాణించే హక్కు ఉందని స్పష్టం చేసింది.

Also Read: మైనింగ్ కోసమే హిడ్మా ఎన్ కౌంటర్? బయటపడ్డ షాకింగ్ వీడియో

Advertisement

ఇక అటు తనకు అండగా నిలిచినవారికి, భారత విదేశాంగశాఖకు.. పెమా థాంగ్‌డోక్ కృతజ్ఞతలు తెలిపారు. మనమంతా ఒకేదేశం అంటూ పిలుపునిచ్చారు. తన ఇబ్బందులను కూడా సోషల్ మీడియాలో ట్రోల్ చేసేవారికి రిప్లై ఇచ్చేంత సమయం లేదన్నారు పెమా థాంగ్‌డోక్. అంతేకాదు భారత అధికారులు ఎయిర్ పోర్టుకు వచ్చి ఆహారం అందించారని చెప్పారు. చైనా అధికారులతో మాట్లాడి సమస్యపై చర్చించి.. ఆదేశం నుండి బయటకు రావాడానికి సహాయం అందించారని తెలిపారు.

Related News

హౌతీలు ప్రకటన.. బాబ్‌ ఎల్‌-మాండెబ్‌ జలసంధి మూసివేత, ప్రపంచ దేశాల్లో గుబులు

పశ్చిమాసియాలో యుద్ధ భేరి.. ఇరాన్‌పై విరుచుకుపడ్డ అమెరికా.. హర్మూజ్ జలసంధిలో తీవ్ర ఉద్రిక్తత!

ఆకస్మిక వరదల్లో కొట్టుకుపోయిన అఫ్గానిస్తాన్‌.. 20 మంది మృతి, 100 మంది గల్లంతు

అయ్యబాబోయ్.. ‘సైకిల్ అంబులెన్స్’ అంట.. నెట్టింట మళ్లీ జోకర్ అయిన పాక్!

పెరులో వరుస భూకంపాలు.. ఆరుగురు మృతి, వందలాది మంది నిరాశ్రయులు

అమెరికా స్థావరాలపై ఇరాన్ భీకర దాడులు.. ఇద్దరు అమెరికా సైనికులు మృతి, ట్రంప్‌పై ఖమేని ఘాటు వ్యాఖ్యలు

హార్మూజ్ జలసంధిలో హైటెన్షన్.. సముద్రంలో పేలిన రెండు చమురు ట్యాంకర్లు!

మెక్సికోలో భారీ భూకంపం.. ఒక్కసారిగా ఊగిపోయిన భవనాలు! సునామీ ముప్పు పొంచి ఉందా?

Big Stories

Advertisement
×