E-Paper
Advertisement

ఒమన్‌లో భారత్ నౌకపై దాడి.. ఆపై మునిగిన హాజీ అలీ, ఆగ్రహం వ్యక్తం చేసిన కేంద్రం

ఒమన్‌లో భారత్ నౌకపై దాడి.. ఆపై మునిగిన హాజీ అలీ,  ఆగ్రహం వ్యక్తం చేసిన కేంద్రం
Advertisement

Strait of Hormuz: ఒమన్ తీరం సమీపంలో డ్రోన్ దాడిలో భారత్ సరుకు రవాణా నౌకపై డ్రోన్లతో దాడి జరిగింది. ఆ తర్వాత ఆ నౌక సముద్రంలో మునిగిపోయింది. ఈ విషయం తెలియగానే ఈ దాడిని కేంద్రప్రభుత్వం ఖండించింది. వాణిజ్య నౌకలపై ఈ విధంగా దాడి కరెక్ట్ కాదని వ్యాఖ్యానించింది. అసలేం జరిగింది?

ఒమన్‌లో భారత్ నౌకపై డ్రోన్లతో దాడి.. మునిగిన హాజీ అలీ

Advertisement

సోమాలియా నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని షార్జాకు సరుకుతో వెళ్తోంది భారత్ నౌక. బుధవారం తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు డ్రోన్లతో దాడి చేశారు. ఈ దాడితో నౌకలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ తర్వాత అది సముద్రంలో మునిగిపోయింది. ఘటన తర్వాత స్పందించిన ఒమన్ తీరం అధికారులు, నౌకలోని 14 మంది సిబ్బందిని రక్షించారు. వారిని సమీపంలోని దిబ్బా పోర్టుకు తరలించారు.

ఈ ఘటనను తీవ్రంగా ఖండించింది భారత విదేశాంగ శాఖ. వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకోవడం, సిబ్బంది ప్రాణాలను ప్రమాదంలో పడేయడం వంటి చర్యలను ఖండిస్తున్నట్లు తెలిపింది. స్వేచ్ఛా నౌకా వాణిజ్యానికి ఆటంకం కలిగించవద్దని పేర్కొంది. ఆ నౌకలోని సిబ్బంది అంతా క్షేమంగా ఉన్నారు. వారిని భారత్‌కు రప్పించేందుకు ఒమన్ అధికారులతో సమన్వయం చేస్తున్నామని షిప్పింగ్ శాఖ అధికారులు తెలిపారు.

Advertisement

సిబ్బంది సేఫ్.. ఆగ్రహం వ్యక్తం చేసిన కేంద్రం

హోర్ముజ్ జలసంధి వద్ద ఇరాన్-అమెరికా ఘర్షణకు సంబంధించి ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఘటన సముద్ర భద్రతపై మరింత ఆందోళనలను పెంచింది. మునిగిపోయిన నౌక గుజరాత్‌లోని ద్వారకా జిల్లా సలయా పోర్టులో రిజిస్టర్ అయ్యింది. నౌకపై దాడి ఎవరు చేశారనేది వెంటనే ఇంకా తెలియాల్సివుంది. వారం రోజుల వ్యవధిలో గుజరాత్‌కు చెందిన హాజీ అలీ మునిగిపోవడం ఇది రెండో సంఘటన.

అంతకుముందు సలయాకు చెందిన అల్ ఫైజ్ నూర్ సులేమానీ-1 నౌక హోర్ముజ్ జలసంధిలో మునిగిపోయినట్లు సమాచారం.ఈ రెండు సంఘటనలు గుజరాత్ సముద్ర రంగంలో ఓడల నిర్వాహకులు, వ్యాపారులలో ఆందోళనను రేకెత్తించాయి. చాలామంది వ్యాపారులు సరుకు రవాణా కోసం గల్ఫ్ మార్గాలపై ఆధారపడి ఉన్నారు.

ALSO READ: ఫ్రాన్స్ అధ్యక్షుడి చెంప దెబ్బ వ్యవహారం.. అసలు గుట్టు బయటకు, ఆ నటి మాటేంటి?

Related News

పెరులో వరుస భూకంపాలు.. ఆరుగురు మృతి, వందలాది మంది నిరాశ్రయులు

అమెరికా స్థావరాలపై ఇరాన్ భీకర దాడులు.. ఇద్దరు అమెరికా సైనికులు మృతి, ట్రంప్‌పై ఖమేని ఘాటు వ్యాఖ్యలు

హార్మూజ్ జలసంధిలో హైటెన్షన్.. సముద్రంలో పేలిన రెండు చమురు ట్యాంకర్లు!

మెక్సికోలో భారీ భూకంపం.. ఒక్కసారిగా ఊగిపోయిన భవనాలు! సునామీ ముప్పు పొంచి ఉందా?

అమెరికా చదువులపై ట్రంప్ ‘వీసా’ దెబ్బ.. భారతీయులకు డబుల్ షాక్!

ఇరాన్‌పై అమెరికా దాడులు.. కుప్పకూలిన చాబహార్ టవర్.. భారత్‌కు కోలుకోలేని దెబ్బ!

అల్జీరియాలో భారీ అగ్నిప్రమాదం.. 11 మంది అనాథలు సజీవదహనం, 19 మందికి తీవ్ర గాయాలు

సముద్రంలో పెను విషాదం.. రోహింగ్యా శరణార్థుల పడవలు బోల్తా.. 500 మందికి పైగా మృతి!

Big Stories

Advertisement
×