E-Paper
Advertisement

Bangladesh: బంగ్లాదేశ్ లో ఇండియా వీసా సెంటర్లు బంద్.. ఎప్పటివరకంటే?..

Bangladesh: బంగ్లాదేశ్ లో ఇండియా వీసా సెంటర్లు బంద్.. ఎప్పటివరకంటే?..
Advertisement

Bangladesh news today live(Today’s international news): బంగ్లాదేశ్ లోని ఇండియాన్ వీసా అప్లికేషన్ సెంటర్లు నిరవధికంగా మూసివేస్తున్నట్లు బంగ్లాదేశ్ ఇండియన్ వీసా అధికారులు గురువారం తెలిపారు. ఇండియన్ వీసా అప్లికేషన్ పోర్టల్ లో దీనికి సంబంధి ఓ ప్రకటన జారీ చేశారు.

”అన్ని ఇండియన్ వీసా అప్లికేషన్ వీసా సెంటర్లు నిరవధికంగా మూసివేయడం జరిగింది. కార్యకలాపాల పునురుద్ధరణ తేదీలను ఎస్ ఎంఎస్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. ఆఫీసుల మళ్లీ తెరిచిన తరువాత భారత పౌరులు తమ పాస్ పోర్టు మరుసటి రోజు వచ్చి తీసుకోగలరు,” అని ఇండియన్ వీసా సెంటర్ బంగ్లాదేశ్ అధికారులు ప్రకటనలో పేర్కొన్నారు. బంగ్లాదేశ్ లో నిరసనలు హింసాత్మక మారడంతో ఇప్పటివరకు 469 మంది చనిపోయారు. ప్రభుత్వ కార్యాలయాలు, ఆఫీసులు ధ్వంసమయ్యాయి. ప్రధాన మంత్రి షేక్ హసీనా చేత దేశ సైన్యం బలవంతంగా రాజీనామా చేయించి దేశం నుంచి బయటికి పంపింది. దీంతో ప్రస్తుతం బంగ్లాదేశ్ లో రాజకీయ సంక్షోభం ఏర్పడింది.

Advertisement

షేక్ హసీనా భారత దేశంతో స్నేహ సంబంధాలు కొనసాగించేవారు. ప్రస్తుతం ఆమె ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాబోతున్న రాజకీయ పార్టీలు, సైన్య ప్రభుతం ఇండియా పట్ల స్నేహ పూర్వక సంబంధాలు కొనసాగించడం అనుమానమే. పైగా బంగ్లాదేశ్ లో ప్రస్తుతం హిందువులు, భారతీయుల నివాసాలు, ఆస్తులపై దాడులు జరుగుతున్నాయి.

ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ లోని ఇండియా హైకమిషన్ సిబ్బంది లో చాలా మంది తిరిగి స్వదేశం చేరుకున్నారు. బంగ్లాదేశ్ లో మొత్తం 19000 మంది భారతీయులు నివసిస్తున్నట్లు ఇటీవలే విదేశాంగ మంత్రి జై శంకర్ తెలిపారు. వీరిలో 10000 మంది విద్యార్థులని.. ఇప్పటికే చాలామందిని సురక్షితంగా భారత దేశానికి తిరిగి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టినట్లు ఆయన వెల్లడించారు.

Advertisement

బంగ్లాదేశ్ లో ప్రస్తుతం ఆర్మీ చీఫ్ జెనెరల్ వాకర్ ఉజ్ జమాన్ మిలిటరీ శాసకుడిగా ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నారు. ఆపద్ధర్మ ప్రధాన మంత్రిగా నోబెల్ విజేత మహహ్మద్ యూనుస్ బాధ్యతలు చేపట్టనున్నారు. షేక్ హసీనా బంగ్లాదేశ్ వదిలి ప్రస్తుతం ఇండియాలో తల దాచుకోగా.. చాలా సంవత్సరాలుగా జైలులో ఉన్న ప్రతిపక్ష పార్టీ నాయకురాలు మాజీ ప్రధాన మంత్రి ఖాలిదా జియా విడుదలయ్యారు. ఆమె ప్రస్తుతం అనారోగ్యం కారణంగా చికిత్స పొందుతున్నారు.

Also Read: ‘బంగ్లాదేశ్ అల్లర్లలో ఆర్మీ హస్తం’.. అంతర్జాతీయ మీడియా కథనం!

Related News

విఫలమైన సామూహిక సున్తీలు.. 43 మంది బాలురు మృతి, దక్షిణాఫ్రికాలో ఘటన

ట్రంప్‌‌కు ఊహించని షాక్‌.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ వ్యవహారం.. కొత్త ఆదేశాలకు కోర్టు బ్రేక్

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

Big Stories

Advertisement
×