E-Paper
Advertisement

Iron Sting Bomb : ఇజ్రాయెల్ కొత్త అస్త్రం.. ఐరన్ స్టింగ్..

Iron Sting Bomb : ఇజ్రాయెల్ కొత్త అస్త్రం.. ఐరన్ స్టింగ్..
Advertisement
Iron Sting Bomb

Iron Sting Bomb : ఇజ్రాయెల్ అమ్ములపొదిలో మరో పదునైన అస్త్రం చేరింది. కచితత్వానికి ఐరన్ డోమ్ వ్యవస్థ పర్యాయపదంగా నిలుస్తుంది. ఐరన్ స్టింగ్ కూడా అంతే. హమాస్ టెర్రర్ గ్రూప్ లక్ష్యాలను గురిచూసి అత్యంత కచ్చితత్వంతో ధ్వంసం చేయగలదీ 120 ఎంఎం మోర్టార్ బాంబ్.

తాజాగా హమాస్‌పై పోరు సాగిస్తున్న ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్)లోని మగ్లాన్ యూనిట్ ఐరన్ స్టింగ్ మోర్టార్ బాంబులను వినియోగిస్తోంది. ఎంతగా జనసమ్మర్దం, రద్దీ ప్రాంతాల్లో ఉన్న ఉగ్రవాద స్థావరాన్ని అయినా సరే.. నేర్పుగా, సూటిగా ధ్వంసం చేయగల సామర్థ్యం ఉందీ మోర్టార్ బాంబ్‌కు.

Advertisement

ప్రిసైజ్ లేజర్, జీపీఎస్ గైడెన్స్ సాంకేతికత సాయంతో ఇది సాధ్యమవుతుందని తయారీ సంస్థ ఎల్బిట్ వెల్లడించింది. జనావాసాలు, అర్బన్ ప్రాంతాల్లో సామాన్య ప్రజానీకానికి పెద్దగా నష్టం వాటిల్లకుండా.. శత్రులక్ష్యాలను మాత్రమే ఛేదించడం దీంతో సులువు కాగలదు. అంతే కాదు.. శత్రువుల రాకెట్ లాంచర్‌ను సైతం తునాతునకలు చేయగలదు.

భవిష్యత్తు భూతల యుద్ధాల్లో ఐరన్ స్టింగ్‌దే కీలక పాత్ర కానుంది. 2021లో విస్తృత పరీక్షల అనంతరమే ఇజ్రాయెల్ తన అమ్ములపొదిలో చేర్చింది.
మగ్లాన్ యూనిట్ ఇప్పటివరకు గాజాలో వంద మంది మిలిటెంట్లను ఏరిపారేసింది. యుద్ధం ఆరంభమైన తర్వాత నాలుగో రోజు గాజాపై తొలిసారిగా దీనిని వినియోగించారు.

Advertisement

ఇప్పటి వరకు భూమి నుంచి 12 మోర్టార్లను ప్రయోగించారు. వీటిలో సగం గాజాపై, సగం లెబనాన్‌పై గురిపెట్టారు. వీటికి అదనంగా యుద్ధం ఆరంభమైన తర్వాత 50 రెగ్యులర్ మోర్టార్ బాంబుల ప్రయోగం జరిగింది.

Related News

పెరులో వరుస భూకంపాలు.. ఆరుగురు మృతి, వందలాది మంది నిరాశ్రయులు

అమెరికా స్థావరాలపై ఇరాన్ భీకర దాడులు.. ఇద్దరు అమెరికా సైనికులు మృతి, ట్రంప్‌పై ఖమేని ఘాటు వ్యాఖ్యలు

హార్మూజ్ జలసంధిలో హైటెన్షన్.. సముద్రంలో పేలిన రెండు చమురు ట్యాంకర్లు!

మెక్సికోలో భారీ భూకంపం.. ఒక్కసారిగా ఊగిపోయిన భవనాలు! సునామీ ముప్పు పొంచి ఉందా?

అమెరికా చదువులపై ట్రంప్ ‘వీసా’ దెబ్బ.. భారతీయులకు డబుల్ షాక్!

ఇరాన్‌పై అమెరికా దాడులు.. కుప్పకూలిన చాబహార్ టవర్.. భారత్‌కు కోలుకోలేని దెబ్బ!

అల్జీరియాలో భారీ అగ్నిప్రమాదం.. 11 మంది అనాథలు సజీవదహనం, 19 మందికి తీవ్ర గాయాలు

సముద్రంలో పెను విషాదం.. రోహింగ్యా శరణార్థుల పడవలు బోల్తా.. 500 మందికి పైగా మృతి!

Big Stories

Advertisement
×