E-Paper
Advertisement

Maldives: ఇక నుంచి ఈ దేశం పోవడం కష్టమే..?

Maldives: ఇక నుంచి ఈ దేశం పోవడం కష్టమే..?
Advertisement

to ban israeli passport holders: గాజాపై ఇజ్రాయెల్ చేస్తున్న దాడులను ప్రపంచ దేశాలు నిరసిస్తున్నాయి. మాల్దీవుల్లోనూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో స్థానికంగా ప్రజాగ్రహాన్ని చల్లార్చేందుకు ఆ దేశం కీలక చర్యలకు నిర్ణయం తీసుకుంది. ఇజ్రాయెల్ పాస్ పోర్ట్ ఉన్నవారికి తమ దేశంలో ప్రవేశాన్ని నిషేధించాలని సిద్ధమైంది. ఆ దేశ హోంమంత్రి అలీ ఇహుసన్ ఈ విషయాన్ని వెల్లడించినట్లు ఓ వార్తా సంస్థ తెలిపింది. మరోవిషయం ఏమంటే.. గాజాలోని పాలస్తీనియన్లకు సాయం చేసేందుకు నిధుల సేకరణ కార్యక్రమాలు చేపట్టేందుకు ముందుకొచ్చినట్లు కూడా పేర్కొన్నది.

‘ఇజ్రాయెల్ పాస్ పోర్ట్ పై మాల్దీవుల్లోకి ప్రవేశాన్ని వీలైనంత త్వరగా నిషేధించేందుకు అవసరమైన చట్టపరమైనటువంటి సవరణలు చేయాలని దేశ మంత్రివర్గం నిర్ణయించింది. ఈ ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఓ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది’ అంటూ హోం మంత్రి చెప్పారు.

Advertisement

Also Read: వేలంలో లేఖలు.. అందులో ఆమె వ్యక్తిగత విషయాలు కూడా..

ఇదిలా ఉంటే.. ఇజ్రాయెల్ నుంచి మాల్దీవులకు ప్రతి ఏటా దాదాపుగా 15 వేల మందికి పైగా పర్యాటకులు సందర్శిస్తుంటారు. గతేడాది అక్టోబర్ లో 7న హమాస్ దాడులకు ప్రతీకారంగా గాజాపై ఇజ్రాయెల్ విరుచుకుపడుతున్న విషయం విధితమే. టెలి అవీవ్ దాడుల్లో ఇప్పటివరకు 36 వేల మందికిపైగా మృతిచెందారు. ఈ క్రమంలో ప్రపంచ దేశాలన్నీ కూడా దాడులను ఆపాలని ఇజ్రాయెల్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

Tags

Related News

హౌతీలు ప్రకటన.. బాబ్‌ ఎల్‌-మాండెబ్‌ జలసంధి మూసివేత, ప్రపంచ దేశాల్లో గుబులు

పశ్చిమాసియాలో యుద్ధ భేరి.. ఇరాన్‌పై విరుచుకుపడ్డ అమెరికా.. హర్మూజ్ జలసంధిలో తీవ్ర ఉద్రిక్తత!

ఆకస్మిక వరదల్లో కొట్టుకుపోయిన అఫ్గానిస్తాన్‌.. 20 మంది మృతి, 100 మంది గల్లంతు

అయ్యబాబోయ్.. ‘సైకిల్ అంబులెన్స్’ అంట.. నెట్టింట మళ్లీ జోకర్ అయిన పాక్!

పెరులో వరుస భూకంపాలు.. ఆరుగురు మృతి, వందలాది మంది నిరాశ్రయులు

అమెరికా స్థావరాలపై ఇరాన్ భీకర దాడులు.. ఇద్దరు అమెరికా సైనికులు మృతి, ట్రంప్‌పై ఖమేని ఘాటు వ్యాఖ్యలు

హార్మూజ్ జలసంధిలో హైటెన్షన్.. సముద్రంలో పేలిన రెండు చమురు ట్యాంకర్లు!

మెక్సికోలో భారీ భూకంపం.. ఒక్కసారిగా ఊగిపోయిన భవనాలు! సునామీ ముప్పు పొంచి ఉందా?

Big Stories

Advertisement
×