E-Paper
Advertisement

Maldives Elections Results 2024: మాల్దీవుల ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు.. ఎవరు గెలిచారంటే..?

Maldives Elections Results 2024: మాల్దీవుల ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు.. ఎవరు గెలిచారంటే..?
Advertisement

Maldives Parliament Elections Results 2024: మాల్దీవుల పార్లమెంటు ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జుకు చెందిన పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ భారీ విజయాన్ని సాధించింది. మాల్దీవ్స్ పార్లమెంటులో మొత్తం 93 సీట్లు ఉండగా.. ఆదివారం అర్థరాత్రి వరకు 86 స్థానాలకు ఫలితాలు విడుదలయ్యాయి. అందులో 66 స్థానాలను పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ పార్టీయే గెలుచుకుంది. ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైనదాని కంటే ఆ పార్టీ ఎక్కువ సీట్లను కైవసం చేసుకుంది. మరో ఏడు నియోజకవర్గాల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.

మాల్దీవులలో ఉన్న 93 పార్లమెంటు స్థానాల్లో ఆదివారం పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. పోలింగ్ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపును ప్రారంభించారు. అయితే, చైనాకు అనుకూలంగా వ్యవహరిస్తున్న ముయిజ్జుకు ఈ ఎన్నికలు అగ్నిపరీక్షలా మారగా, చైనా వైపు ముయిజ్జు మొగ్గుచూపడాన్ని ప్రజలు సమర్థిస్తున్నట్లు తాజా ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే, ఈ ఎన్నికల్లో పీఎన్సీ, మాల్దీవియన్ డెమొక్రటిక్ పార్టీతో సహా ఆరు పార్టీలకు చెందిన 368 మంది అభ్యర్థులు పోటీ చేశారు.

Advertisement

Also Read: మాల్దీవ్స్ పార్లమెంటులో డిష్యం డిష్యుం.. ఎంపీల మధ్య సీరియస్ ఫైట్!

అదేవిధంగా ఈ ఎన్నికల్లో మొత్తం 41 మంది మహిళలు పోటీ చేయగా కేవలం ముగ్గురు మాత్రం విజయం సాధించారని, మెజార్టీకి అవసరమైన సీట్లను ముయిజ్జు పార్టీ అయిన పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ కైవసం చేసుకుందని, మే మొదటి వారంలో కొత్త పార్లమెంటు కొలువుదీరే అవకాశముందని అక్కడి మీడియా వెల్లడించింది.

Tags

Related News

పెరులో వరుస భూకంపాలు.. ఆరుగురు మృతి, వందలాది మంది నిరాశ్రయులు

అమెరికా స్థావరాలపై ఇరాన్ భీకర దాడులు.. ఇద్దరు అమెరికా సైనికులు మృతి, ట్రంప్‌పై ఖమేని ఘాటు వ్యాఖ్యలు

హార్మూజ్ జలసంధిలో హైటెన్షన్.. సముద్రంలో పేలిన రెండు చమురు ట్యాంకర్లు!

మెక్సికోలో భారీ భూకంపం.. ఒక్కసారిగా ఊగిపోయిన భవనాలు! సునామీ ముప్పు పొంచి ఉందా?

అమెరికా చదువులపై ట్రంప్ ‘వీసా’ దెబ్బ.. భారతీయులకు డబుల్ షాక్!

ఇరాన్‌పై అమెరికా దాడులు.. కుప్పకూలిన చాబహార్ టవర్.. భారత్‌కు కోలుకోలేని దెబ్బ!

అల్జీరియాలో భారీ అగ్నిప్రమాదం.. 11 మంది అనాథలు సజీవదహనం, 19 మందికి తీవ్ర గాయాలు

సముద్రంలో పెను విషాదం.. రోహింగ్యా శరణార్థుల పడవలు బోల్తా.. 500 మందికి పైగా మృతి!

Big Stories

Advertisement
×