E-Paper
Advertisement

Nigeria explosion: నైజీరియాలో ఘోర రోడ్డు ప్రమాదం, మంటల్లో 48 మంది మృతి.. ఎలా జరిగింది?

Nigeria explosion: నైజీరియాలో ఘోర రోడ్డు ప్రమాదం, మంటల్లో 48 మంది మృతి.. ఎలా జరిగింది?

Nigeria explosion: నైజీరియాలో ఘోర రోడ్డు ప్రమాదం  చోటు చేసుకుంది. ఈ ఘటనలో 48 మంది సజీవ దహనమయ్యారు. మరో 50 వరకు పశువులు మృతి చెందాయి. ఈ విషయాన్ని ఆ దేశ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది.
ఈ ఏడాదిలో అక్కడ జరిగిన ఘటనల్లో ఇదే అతిపెద్దది.

నైజీరియాలో నార్త్- మధ్య నైజర్ రాష్ట్రంలోని ఆగాయి ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఓ ఆయిల్ ట్యాంకర్ ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీ కొట్టింది. ఈ ఘటనలో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఈ మంటలు చుట్టుపక్కన వాహనా లకు అట్టుకున్నాయి. ట్రక్కులో ఉన్న 50 పశువులు సజీవ దహనమయ్యాయి. ఈ ప్రమాదంలో 48 మంది మృతి చెందారు.

ALSO READ: నిన్న చైనా.. ఇప్పుడు వియత్నాం.. యాగి తుపాను బీభత్సంతో 14 మంది మృత్యువాత

ఆయిల్ ట్రక్కులో ఉన్న వ్యక్తులతోపాటు చుట్టుపక్కన వాహనాలకు సంబందించిన వ్యక్తులు కూడా ఈ ఘటనలో ఉన్నట్లు ఆ దేశ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు వేగంగా జరుగుతున్నాయి. మొదట్లో 30 మంది సజీవ దహనమయ్యారు. మరో 18 మంది మృతదేహాలు లభ్యమయ్యాయి.

మృతులకు సమీపంలోని ఓ ప్రాంతంలో సామూహిక అంత్యక్రియలు నిర్వహించినట్టు పేర్కొంది. నైజీరియాలో సరైన రైల్వే వ్యవస్థ లేదు. ముఖ్యంగా కార్గో రవాణాకు కేవలం వాహనాలు మాత్రమే వినియోగిస్తున్నారు. ఆఫ్రికాలో అత్యధిక జనాబా కలిగిన నైజీరియాలో ఆ తరహా ప్రమాదాలు సాధారణంగా చెబుతున్నారు.

దీనికితోడు రోడ్లు సరిగా లేకపోవడంతో ప్రతీ ఏడాది వందల సంఖ్యలో మనుషులు మరణించిన సందర్భాలు కోకొల్లలు. నైజీరియాలోని ఫెడరల్ రోడ్ సేఫ్టీ అధికారుల నివేదిక ప్రకారం.. 2020లో 1530 ట్యాంకర్ల ప్రమాదాలు జరిగాయి. మొత్తం 535 మంది మరణించారు.  మరో 1142మంది గాయపడ్డారు.

ఈ ఘటనపై నైజర్ ప్రాంత గవర్నర్ మహమ్మద్ బాగో నోరు విప్పారు. వాహనదారులు జాగ్రత్త పాటించాలని తరుచు చెబుతున్నామని వెల్లడించారు. అనుకోకుండా ప్రమాదాలు జరుగుతున్నట్లు తెలిపారు. ప్రజలు రోడ్డు ట్రాఫిక్ నిబంధనలకు కట్టుబడి ఉండాలని మరోసారి కోరుతున్నారు.

Related News

Big Shock To Trump: ట్రంప్‌కు ఊహించని ఝలక్.. షాకిచ్చిన వార్ పవర్స్, ఆపరేషన్ ‘ఎపిక్ ఫ్యూరీ’ క్లోజ్

Kuwait Airport: ఇరాన్ మిస్సైళ్ల దాడులు.. కువైట్‌ ఎయిర్‌పోర్ట్ డ్యామేజ్, విమాన సర్వీసులు రద్దు

మరో బాంబ్‌ పేల్చిన అమెరికా.. భారత్‌పై అదనపు సుంకాలకు ప్రతిపాదన, ఏకంగా 12 శాతం

పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు.. అమెరికా స్థావరాలపై ఇరాన్ వరుస దాడులు, ఖేష్మ్ ద్వీపంపై

ఇరాన్ షాకింగ్ నిర్ణయం.. ఇకపై మాటలు-చర్చల్లేవ్, హోర్మూజ్ జలసంధి మాటేంటి?

ఇరాన్‌లో ఇంటిపోరు మొదలైందా? అధ్యక్షుడు మసూద్‌ నిర్ణయం వెనుక, అసలేం జరుగుతోంది?

రూటు మార్చిన అమెరికా.. ఇరాన్‌పై మెరుపు దాడులు, రాడార్- డ్రోన్ వ్యవస్థలు డ్యామేజ్

హోర్ముజ్ జలసంధిలో హై టెన్షన్.. ఇరాన్ సైనిక క్యాంప్‌పై అమెరికా దాడి, కవ్వింపు చర్యలు డీల్ కోసమా?

Big Stories

×