E-Paper
Advertisement

chip making : ‘చిప్’ రంగంలోకి ఓపెన్ ఏఐ?

chip making : కృత్రిమ మేధ(ఏఐ) అప్లికేషన్ల ప్రాధాన్యం పెరుగుతున్న క్రమంలో సెమీకండక్టర్ చిప్ లకు విపరీతమైన కొరత ఏర్పడనుంది. రానున్న 3-5 ఏళ్ల వరకు చిప్‌లకు డిమాండ్ విపరీతంగా ఉంటుందని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. కొరత భయంతో చిప్ తయారీ రంగంలోకి ఓపెన్ ఏఐ సంస్థ కాలు మోపనున్నట్టు సెమీకండక్టర్ పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.

chip making : ‘చిప్’ రంగంలోకి ఓపెన్ ఏఐ?
Advertisement

chip making : కృత్రిమ మేధ(ఏఐ) అప్లికేషన్ల ప్రాధాన్యం పెరుగుతున్న క్రమంలో సెమీకండక్టర్ చిప్ లకు విపరీతమైన కొరత ఏర్పడనుంది. రానున్న 3-5 ఏళ్ల వరకు చిప్‌లకు డిమాండ్ విపరీతంగా ఉంటుందని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. కొరత భయంతో చిప్ తయారీ రంగంలోకి ఓపెన్ ఏఐ సంస్థ కాలు మోపనున్నట్టు సెమీకండక్టర్ పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.

తైవాన్ సెమీకండక్టర్ మాన్యుఫాక్చరింగ్ కంపెనీ(TSMC)తో కలిసి ఏఐ చిప్ ఫ్యాబ్రికేషన్ ప్లాంట్ ఆరంభించే యోచనలో ఉన్నట్టు సమాచారం. ఓపెన్ ఏఐ సంస్థ సీఈవో శామ్ ఆల్ట్‌మన్ ఈ మేరకు టీఎస్ఎంసీతో సంప్రదింపులు జరుపుతున్నట్టు ఆ వర్గాలు తెలిపాయి. చిప్ తయారీ ప్లాంట్ కోసం గ్లోబల్ ఇన్వెస్టర్ల సాయంతో శామ్ భారీ మొత్తంలో నిధులు సమీకరించే పనిలో నిమగ్నమయ్యారు.

Advertisement

మరోవైపు అబుధాబి సంపన్నుల్లో ఒకరైన షేక్ తహనూన్ బిన్ జాయేడ్ అల్-నహ్యాన్‌తోనూ శామ్ మాట్లాడుతున్నట్టు తెలుస్తోంది. గల్ఫ్ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయేద్ అల్-నహ్యాన్‌కు తహనూన్ స్వయానా సోదరుడు. అలాగే 800 బిలియన్ డాలర్ల విలువ ఉన్న అబుధాబి ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ, ప్రభుత్వానికే చెందిన మరో పెట్టుబడి సంస్థ ఏడీక్యూ నుంచి నిధుల సమీకరించేందుకు శామ్ తీవ్రంగా యత్నిస్తున్నారు.

టీఎస్ఎంసీ చిప్‌లను యాపిల్ లాప్‌టాప్‌లు, ఫోన్లలో వినియోగిస్తున్నారు. ఇక సీపీయూ చిప్‌లను తయారు చేసే రెండు ప్రధాన కంపెనీలు ఏఎండీ, ఇంటెల్.. డిమాండ్ తగ్గట్టుగా చిప్‌లను సరఫరా చేయడంలో సతమతమవుతున్నాయి.

Tags

Related News

విఫలమైన సామూహిక సున్తీలు.. 43 మంది బాలురు మృతి, దక్షిణాఫ్రికాలో ఘటన

ట్రంప్‌‌కు ఊహించని షాక్‌.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ వ్యవహారం.. కొత్త ఆదేశాలకు కోర్టు బ్రేక్

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

Big Stories

Advertisement
×