E-Paper
Advertisement

Pakistan: ముజాహిదీన్‌లను సృష్టించి తప్పుచేశాం.. వారే ఉగ్రవాదులయ్యారు: పాక్ మంత్రి

Pakistan: ముజాహిదీన్‌లను సృష్టించి తప్పుచేశాం.. వారే ఉగ్రవాదులయ్యారు: పాక్ మంత్రి

Pakistan: పాకిస్థాన్ హోంమంత్రి రానా సనావుల్లా కీలక వ్యాఖ్యలు చేశారు. ముజాహిదీన్‌లను సృష్టించి పాక్ తప్పుచేసిందని అభిప్రాయపడ్డారు. పార్లమెంటులో ‘‘మనం ముజాహిదీన్‌లను సృష్టించాం. వారే ఇప్పుడు ఉగ్రవాదులయ్యారు’’ అని పేర్కొన్నారు.

ఉగ్రదాడులతో పాకిస్థాన్ సతమతమవుతోందని అన్నారు. ఈ దాడులతో పాక్ పడుతున్న కష్టాలను ప్రపంచం గుర్తించడం లేదని తెలిపారు. ఉగ్రదాడులతో పాకిస్థాన్‌కు ఇప్పటి వరకు 12,600 కోట్ల డాలర్ల ఆర్థిక నష్టం వాటిల్లిందని తెలిపారు.

ఇక పెషావర్‌లో ఇటీవల జరిగిన ఆత్మాహుతి దాడిలో ఇప్పటి వరకు 101 మంది ప్రాణాలు కోల్పోయారు. అందులో 97 మంది పోలీసులే ఉన్నారు. ఈ ఘటనపై పారదర్శకంగా దర్యాప్తు జరపాలని డిమాండ్ చేస్తూ పోలీసులు బుధవారం పెషావర్‌లో నిరసన తెలిపారు.

Tags

Related News

Big Shock To Trump: ట్రంప్‌కు ఊహించని ఝలక్.. షాకిచ్చిన వార్ పవర్స్, ఆపరేషన్ ‘ఎపిక్ ఫ్యూరీ’ క్లోజ్

Kuwait Airport: ఇరాన్ మిస్సైళ్ల దాడులు.. కువైట్‌ ఎయిర్‌పోర్ట్ డ్యామేజ్, విమాన సర్వీసులు రద్దు

మరో బాంబ్‌ పేల్చిన అమెరికా.. భారత్‌పై అదనపు సుంకాలకు ప్రతిపాదన, ఏకంగా 12 శాతం

పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు.. అమెరికా స్థావరాలపై ఇరాన్ వరుస దాడులు, ఖేష్మ్ ద్వీపంపై

ఇరాన్ షాకింగ్ నిర్ణయం.. ఇకపై మాటలు-చర్చల్లేవ్, హోర్మూజ్ జలసంధి మాటేంటి?

ఇరాన్‌లో ఇంటిపోరు మొదలైందా? అధ్యక్షుడు మసూద్‌ నిర్ణయం వెనుక, అసలేం జరుగుతోంది?

రూటు మార్చిన అమెరికా.. ఇరాన్‌పై మెరుపు దాడులు, రాడార్- డ్రోన్ వ్యవస్థలు డ్యామేజ్

హోర్ముజ్ జలసంధిలో హై టెన్షన్.. ఇరాన్ సైనిక క్యాంప్‌పై అమెరికా దాడి, కవ్వింపు చర్యలు డీల్ కోసమా?

Big Stories

×