E-Paper
Advertisement

Pakistan: బస్సు ఆపి కాల్పులు చేసిన ఉగ్రవాదులు.. 23 మంది మృతి

Pakistan: బస్సు ఆపి కాల్పులు చేసిన ఉగ్రవాదులు.. 23 మంది మృతి
Advertisement

Gunmen kill 23 bus passengers in Pakistan: పాకిస్థాన్‌లో దారుణం చోటుచేసుకుంది. కొంతమంది ఉగ్రవాదులు రెచ్చిపోయి ఏకంగా రోడ్లపై ప్రయాణిస్తున్న వాహనాలను అడ్డగించి దాడులకు పాల్పడుతున్నారు. పంజాబ్‌ను బలూచిస్థాన్ కలిపే జాతీయ రాహదారిపై ఉగ్రవాదులు బస్సులు, ట్రక్కులు, వ్యాన్‌లను నిలిపివేస్తూ..అందరినీ తనిఖీ చేస్తూ కాల్పులు జరిపారు. సోమవారం జరిగిన ఈ ఘటనలో 23 మంది మృతి చెందినట్లు అంతర్జాతీయ మీడియా తెలిపింది.

ముసాఖెల్ జిల్లాలో రరాషమ్‌లోని జాతీయ రహదారిపై జరిగిన ఈ దాడిలో 23 మంది మృతి చెందగా..మరికొంతమందికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. దీంతోపాటు పలు వాహనాలకు నిప్పుపెట్టారు. మొత్తం 10 వాహనాలకు నిప్పు పెట్టినట్లు సమాచారం. మృతుల్లో 20 మంది పంజాబీలు, ముగ్గురు బలూచీలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. అయితే పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌కు చెందిన ప్రయాణికులూ లక్ష్యంగా దాడులు జరిగినట్లు తెలుస్తోంది.

Advertisement

ఈ ఘటనపై బలూచిస్థాన్ సీఎం సర్పరాజ్ బుగ్టీ స్పందించారు. ఈ దాడి హేయమైన చర్య అని సీఎం తీవ్రంగా ఖండించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. వెంటనే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Also Read: ఉక్రెయిన్ పై రష్యా దాడులు..నలుగురి మృతి

Advertisement

అంతర్జాతీయ మీడియా కథనం ప్రకారం.. ఓ ఆటోమేటిక్ గన్‌తో ఉగ్రవాది బస్సును ఆపి కాల్పులు జరిపాడని పేర్కొంది. పక్కా ప్రణాళికతో మాటు వేసి ఉగ్రవాది ప్రయాణికులే లక్ష్యంగా దాడికి పాల్పడ్డాడు. బస్సులో ఉన్న ప్రయాణికులను కిందకు దించి మరి గన్ తో కాల్పులు జరిపాడు. కాగా, ఈ ఘటనపై అధికారికంగా ఎలాంటి ప్రకటన విడుదల కాలేదు.

Related News

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

నేపాల్ ఖాకీలకు విచిత్ర సవాల్.. వరదల్లో కొట్టుకెళ్లిన మనుషులతో పాటు.. బ్యాంక్ లాకర్ల కోసం వేట!

బాంబులు, డ్రోన్ల మోత మధ్య జరిగిన పెళ్లి.. యుద్ధ సమయంలో పెరుగుతున్న వివాహాల సంఖ్య

Big Stories

Advertisement
×