E-Paper
Advertisement

Pakistan terrorists target attacks: పాక్ లో ఉగ్రవాదుల ఎటాక్..73 కు పెరిగిన మృతుల సంఖ్య

Pakistan terrorists target attacks: పాక్ లో ఉగ్రవాదుల ఎటాక్..73 కు పెరిగిన మృతుల సంఖ్య
Advertisement

Pakistan terrorists target attacks vehicles..rail..police stations 73 dead: పాకిస్తాన్ దేశంలో టెర్రరిస్టులు మరోసారి రెచ్చిపోయారు. పంజాబ్ ప్రావిన్స్ కు చెందిన కార్మికులను లక్ష్యంగా జరిపిన దాడులలో 73 మంది తమ ప్రాణాలు కోల్పోయారు. ఇదే క్రమంలో బెలూచిస్తాన్ పరిధిలో జాతీయ రహదారులు, రైల్వే ట్రాక్ లు, పోలీసు స్టేషన్లను టెర్రరిస్టులు ఎక్కడికక్కడ ధ్వంసం చేశారు. పలు ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారని పాక్ అధికారులు తెలిపారు. చనిపోయిన వారిలో పాకిస్తాన్ భద్రతా దళ సిబ్బంది కూడా పధ్నాలుగు మంది ఉన్నారని తెలిపింది. అయితే ఉగ్రవాదులు అత్యంత హేయంగా రోడ్డు మీద వెళుతున్న వాహనాలను ఆపి వారి ఐడీ కార్డులు చెక్ చేసి వెంటనే తుపాకీతో కాల్పులు జరిపి చంపేశారు. అప్పటికీ వాహనదారులను చంపినా కోపం చల్లారక వారి వాహనాలను దగ్ధం చేశారు. కేవలం మూసా ఖైల్ అనే ప్రాంతంలోనే దాదాపు 40 వాహనాలను విధ్వంసం చేశారు ఉగ్రవాదులు.

ఉపాధి కోల్పోతున్నారనే..
పాక్ లోని పంజాబ్ ప్రాంతానికి చెందిన వలస కార్మికుల వలన అక్కడి స్థానిక ప్రజలు ఉపాధిని కోల్పోతున్నారని అందుకే ఈ దాడులకు పాల్పడినట్లు సమాచారం. దీనిపై పలు పాక్ మీడియా చానళ్లు వార్తా కథనాలు ఇచ్చారు. ఈ దాడులకు పాల్పడింది తామేనని బీఎల్ఏ సంస్థ ప్రకటించింది. కాగా పక్కా ప్లాన్ ప్రకారమే ఈ దాడులకు నిందితులు పాల్పడ్డారని పాక్ హోం శాఖ మంత్రి మెహిసిన్ నఖ్వీ అన్నారు. కాగా పాక్ అధ్యక్షుడు అసిఫ్ ఆలీ జర్దారీ మాట్లాడుతూ ఈ దాడి అత్యంత అనాగరికమైన చర్యగా అభివర్ణించారు. ఈ ఘటనపై తక్షణ విచారణకు ఆదేశించామని తెలిపారు. టెర్రరిస్టులను ఉపేక్షించబోమని..అమాయకులైన పౌరుల జోలికి వస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని తెలిపారు.

Advertisement

Related News

అమెరికా స్థావరాలపై ఇరాన్ భీకర దాడులు.. ఇద్దరు అమెరికా సైనికులు మృతి, ట్రంప్‌పై ఖమేని ఘాటు వ్యాఖ్యలు

హార్మూజ్ జలసంధిలో హైటెన్షన్.. సముద్రంలో పేలిన రెండు చమురు ట్యాంకర్లు!

మెక్సికోలో భారీ భూకంపం.. ఒక్కసారిగా ఊగిపోయిన భవనాలు! సునామీ ముప్పు పొంచి ఉందా?

అమెరికా చదువులపై ట్రంప్ ‘వీసా’ దెబ్బ.. భారతీయులకు డబుల్ షాక్!

ఇరాన్‌పై అమెరికా దాడులు.. కుప్పకూలిన చాబహార్ టవర్.. భారత్‌కు కోలుకోలేని దెబ్బ!

అల్జీరియాలో భారీ అగ్నిప్రమాదం.. 11 మంది అనాథలు సజీవదహనం, 19 మందికి తీవ్ర గాయాలు

సముద్రంలో పెను విషాదం.. రోహింగ్యా శరణార్థుల పడవలు బోల్తా.. 500 మందికి పైగా మృతి!

బీచ్‌లో గుండె గుభేల్.. నడినెత్తి మీద నుంచి దూసుకెళ్లిన యుద్ధ విమానాలు.. గాల్లోకి ఎగిరిన టెంట్లు!

Big Stories

Advertisement
×