E-Paper
Advertisement

Pakistan terrorists target attacks: పాక్ లో ఉగ్రవాదుల ఎటాక్..73 కు పెరిగిన మృతుల సంఖ్య

Pakistan terrorists target attacks: పాక్ లో ఉగ్రవాదుల ఎటాక్..73 కు పెరిగిన మృతుల సంఖ్య
Advertisement

Pakistan terrorists target attacks vehicles..rail..police stations 73 dead: పాకిస్తాన్ దేశంలో టెర్రరిస్టులు మరోసారి రెచ్చిపోయారు. పంజాబ్ ప్రావిన్స్ కు చెందిన కార్మికులను లక్ష్యంగా జరిపిన దాడులలో 73 మంది తమ ప్రాణాలు కోల్పోయారు. ఇదే క్రమంలో బెలూచిస్తాన్ పరిధిలో జాతీయ రహదారులు, రైల్వే ట్రాక్ లు, పోలీసు స్టేషన్లను టెర్రరిస్టులు ఎక్కడికక్కడ ధ్వంసం చేశారు. పలు ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారని పాక్ అధికారులు తెలిపారు. చనిపోయిన వారిలో పాకిస్తాన్ భద్రతా దళ సిబ్బంది కూడా పధ్నాలుగు మంది ఉన్నారని తెలిపింది. అయితే ఉగ్రవాదులు అత్యంత హేయంగా రోడ్డు మీద వెళుతున్న వాహనాలను ఆపి వారి ఐడీ కార్డులు చెక్ చేసి వెంటనే తుపాకీతో కాల్పులు జరిపి చంపేశారు. అప్పటికీ వాహనదారులను చంపినా కోపం చల్లారక వారి వాహనాలను దగ్ధం చేశారు. కేవలం మూసా ఖైల్ అనే ప్రాంతంలోనే దాదాపు 40 వాహనాలను విధ్వంసం చేశారు ఉగ్రవాదులు.

ఉపాధి కోల్పోతున్నారనే..
పాక్ లోని పంజాబ్ ప్రాంతానికి చెందిన వలస కార్మికుల వలన అక్కడి స్థానిక ప్రజలు ఉపాధిని కోల్పోతున్నారని అందుకే ఈ దాడులకు పాల్పడినట్లు సమాచారం. దీనిపై పలు పాక్ మీడియా చానళ్లు వార్తా కథనాలు ఇచ్చారు. ఈ దాడులకు పాల్పడింది తామేనని బీఎల్ఏ సంస్థ ప్రకటించింది. కాగా పక్కా ప్లాన్ ప్రకారమే ఈ దాడులకు నిందితులు పాల్పడ్డారని పాక్ హోం శాఖ మంత్రి మెహిసిన్ నఖ్వీ అన్నారు. కాగా పాక్ అధ్యక్షుడు అసిఫ్ ఆలీ జర్దారీ మాట్లాడుతూ ఈ దాడి అత్యంత అనాగరికమైన చర్యగా అభివర్ణించారు. ఈ ఘటనపై తక్షణ విచారణకు ఆదేశించామని తెలిపారు. టెర్రరిస్టులను ఉపేక్షించబోమని..అమాయకులైన పౌరుల జోలికి వస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని తెలిపారు.

Advertisement

Related News

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

నేపాల్ ఖాకీలకు విచిత్ర సవాల్.. వరదల్లో కొట్టుకెళ్లిన మనుషులతో పాటు.. బ్యాంక్ లాకర్ల కోసం వేట!

బాంబులు, డ్రోన్ల మోత మధ్య జరిగిన పెళ్లి.. యుద్ధ సమయంలో పెరుగుతున్న వివాహాల సంఖ్య

Big Stories

Advertisement
×