E-Paper
Advertisement

Plastic Pollution : కడలి కడుపులో ప్లాస్టిక్.. మన వాటా ఎక్కువే

Plastic Pollution : కడలి కడుపులో ప్లాస్టిక్.. మన వాటా ఎక్కువే
Advertisement
Plastic Pollution

Plastic Pollution : ఏటా ఉత్పత్తయ్యే ప్లాస్టిక్ వ్యర్థాలు దాదాపు 430 మిలియన్ టన్నులు. మనం స్వల్పకాలం వాడి పడేసే వ్యర్థాలే ఈ మొత్తంలో 60 శాతం మేర ఉంటాయి.
వీటిలో అధిక భాగం సముద్రాల్లోకి చేరుతోంది. కాలిఫోర్నియా-హవాయి మధ్య పసిఫిక్ సముద్రంలో చేరిన ప్లాస్టిక్ వ్యర్థాలు.. ఫ్రాన్స్ విస్తీర్ణానికి మూడురెట్లు ఉంటుందట.

సుదీర్ఘ తీర ప్రాంతం, తక్కువ భౌగోళిక విస్తీర్ణం, అత్యధిక వర్షపాతం, ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ అరకొరగా ఉన్న దేశాల నుంచే అధిక మొత్తంలో ప్లాస్టిక్ వ్యర్థాలు కడలిలో కలుస్తున్నాయని ఓ సర్వే తెలిపింది. ఉదాహరణకు మలేసియాతో పోలిస్తే చైనా నుంచి ఉత్పత్తయ్యే ప్లాస్టిక్ వ్యర్థాలు పది రెట్లు ఉంటాయి.

Advertisement

కానీ కడలిలో చేరుతున్న ప్లాస్టిక్ వేస్ట్‌లో మలేసియా వాటా 9% అయితే.. చైనాది 0.6 శాతమే. ఇలా అత్యధిక మొత్తంలో ప్లాస్టిక్ వ్యర్థాలను సముద్రాల్లోకి చేరుస్తున్న టాప్ టెన్ దేశాల్లో ఫిలిప్పీన్స్ అగ్రభాగాన ఉంది. ఏటా 3.56 లక్షల మెట్రిక్ టన్నుల వ్యర్థాలు ఫిలిప్పీన్స్ నుంచి సముద్రగర్భానికి చేరుతున్నాయి.

మన దేశం రెండో స్థానంలో ఉంది. మొత్తం 1.26 లక్షల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలను సముద్రాల్లోకి మనం చేరుస్తున్నాం. 73 వేల టన్నులతో మలేసియా, 70 వేల టన్నులతో చైనా 3, 4 స్థానాల్లో నిలిచాయి.

Advertisement

ఇండొనేసియా నుంచి 56 వేల టన్నులు, మయన్మార్ 40 వేలు, బ్రెజిల్ 37 వేలు, వియత్నాం 28 వేలు, బంగ్లాదేశ్ 24 వేలు, థాయ్‌లాండ్ నుంచి 22 వేల టన్నుల వ్యర్థాలు సముద్రంలోకి కలుస్తున్నాయి. మిగిలిన ప్రపంచ దేశాలన్నీ కలిపి 1.76 లక్షల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలను కడలిలోకి చేరుస్తున్నాయి.

Related News

పెరులో వరుస భూకంపాలు.. ఆరుగురు మృతి, వందలాది మంది నిరాశ్రయులు

అమెరికా స్థావరాలపై ఇరాన్ భీకర దాడులు.. ఇద్దరు అమెరికా సైనికులు మృతి, ట్రంప్‌పై ఖమేని ఘాటు వ్యాఖ్యలు

హార్మూజ్ జలసంధిలో హైటెన్షన్.. సముద్రంలో పేలిన రెండు చమురు ట్యాంకర్లు!

మెక్సికోలో భారీ భూకంపం.. ఒక్కసారిగా ఊగిపోయిన భవనాలు! సునామీ ముప్పు పొంచి ఉందా?

అమెరికా చదువులపై ట్రంప్ ‘వీసా’ దెబ్బ.. భారతీయులకు డబుల్ షాక్!

ఇరాన్‌పై అమెరికా దాడులు.. కుప్పకూలిన చాబహార్ టవర్.. భారత్‌కు కోలుకోలేని దెబ్బ!

అల్జీరియాలో భారీ అగ్నిప్రమాదం.. 11 మంది అనాథలు సజీవదహనం, 19 మందికి తీవ్ర గాయాలు

సముద్రంలో పెను విషాదం.. రోహింగ్యా శరణార్థుల పడవలు బోల్తా.. 500 మందికి పైగా మృతి!

Big Stories

Advertisement
×