E-Paper
Advertisement

PM Modi: ఎన్డీఏ హ్యాట్రిక్.. ప్రధాని మోదీకి దేశాధినేతల శుభాకాంక్షలు

PM Modi: ఎన్డీఏ హ్యాట్రిక్.. ప్రధాని మోదీకి  దేశాధినేతల శుభాకాంక్షలు
Advertisement

World Leaders Wishes to PM Modi: లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించి మూడో సారి మోదీ ప్రధాని పీఠం ఎక్కేందుకు సిద్ధమైన సందర్భంగా మోదీకి వివిధ దేశాల అధినేతలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఎక్స్ వేదికగా మోదీకి శుభాకాంక్షలు తెలిపారు.

భారత్, ఇటలీ మధ్య స్నేహ బంధాన్ని బలోపేతం చేయడానికి, రెండు దేశాల ప్రజల శ్రేయస్సు కోసం పరస్పర సహకారం దిశగా కలిసి పనిచేయాలని మెలోనీ పేర్కొన్నారు. పొరుగు దేశాలైన నేపాల్, శ్రీలంక, భూటాన్‌తో పాటు పలువురు దేశాల అధినేతలు మోదీకి శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

కలిసి పనిచేద్దాం..
మోదీ నాయకత్వంలో సాధించిన ప్రగతి, శ్రేయస్సుపై భారత ప్రజలు నమ్మకాన్ని చూపించారని శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్కమ సింఘె ఎక్స్ వేదికగా తెలిపారు. భారత్‌తో భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేసుకునేందుకు శ్రీలంక ఎదురు చూస్తోందని ట్వీట్ చేశారు. అంతే కాకుండా సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించినందుకు ప్రధాని మోదీకి మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ మెయిజ్జు అభినందనలు తెలిపారు. భారత్ మాల్దీవుల మధ్య స్నేహ బంధాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఎదరుచేస్తున్నా.. అని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.

Advertisement

పురోగతి సాధిస్తూనే ఉండాలి

నేపాల్ పీఎం కమల్ దహల్ ప్రచండ మోదీకి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ఎక్స్ వేదికగా మోదీకి శుభాకాంక్షలు తెలిపారు. నేపాల్‌ పీఎంతో పాటు భూటాన్ ప్రధాని షెరింగ్ టోబ్‌గే కూడా మోదీకి శుభాకాంక్షలు తెలియజేశారు. చారిత్రాత్మకంగా మూడో సారి విజయం సాధించినందుకు అభినందనలు తెలిపారు. మారిషస్ ప్రధాని ప్రవింద కుమార్ కూడా మోదీకి అభినందనలు తెలిపారు. మోదీ నేతృత్వంలో భారత్ విశేష పురోగతి సాధిస్తూనే ఉంటుందని అన్నారు.

Tags

Related News

విఫలమైన సామూహిక సున్తీలు.. 43 మంది బాలురు మృతి, దక్షిణాఫ్రికాలో ఘటన

ట్రంప్‌‌కు ఊహించని షాక్‌.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ వ్యవహారం.. కొత్త ఆదేశాలకు కోర్టు బ్రేక్

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

Big Stories

Advertisement
×