E-Paper
Advertisement

PM Modi: ఎన్డీఏ హ్యాట్రిక్.. ప్రధాని మోదీకి దేశాధినేతల శుభాకాంక్షలు

PM Modi: ఎన్డీఏ హ్యాట్రిక్.. ప్రధాని మోదీకి  దేశాధినేతల శుభాకాంక్షలు
Advertisement

World Leaders Wishes to PM Modi: లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించి మూడో సారి మోదీ ప్రధాని పీఠం ఎక్కేందుకు సిద్ధమైన సందర్భంగా మోదీకి వివిధ దేశాల అధినేతలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఎక్స్ వేదికగా మోదీకి శుభాకాంక్షలు తెలిపారు.

భారత్, ఇటలీ మధ్య స్నేహ బంధాన్ని బలోపేతం చేయడానికి, రెండు దేశాల ప్రజల శ్రేయస్సు కోసం పరస్పర సహకారం దిశగా కలిసి పనిచేయాలని మెలోనీ పేర్కొన్నారు. పొరుగు దేశాలైన నేపాల్, శ్రీలంక, భూటాన్‌తో పాటు పలువురు దేశాల అధినేతలు మోదీకి శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

కలిసి పనిచేద్దాం..
మోదీ నాయకత్వంలో సాధించిన ప్రగతి, శ్రేయస్సుపై భారత ప్రజలు నమ్మకాన్ని చూపించారని శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్కమ సింఘె ఎక్స్ వేదికగా తెలిపారు. భారత్‌తో భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేసుకునేందుకు శ్రీలంక ఎదురు చూస్తోందని ట్వీట్ చేశారు. అంతే కాకుండా సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించినందుకు ప్రధాని మోదీకి మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ మెయిజ్జు అభినందనలు తెలిపారు. భారత్ మాల్దీవుల మధ్య స్నేహ బంధాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఎదరుచేస్తున్నా.. అని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.

Advertisement

పురోగతి సాధిస్తూనే ఉండాలి

నేపాల్ పీఎం కమల్ దహల్ ప్రచండ మోదీకి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ఎక్స్ వేదికగా మోదీకి శుభాకాంక్షలు తెలిపారు. నేపాల్‌ పీఎంతో పాటు భూటాన్ ప్రధాని షెరింగ్ టోబ్‌గే కూడా మోదీకి శుభాకాంక్షలు తెలియజేశారు. చారిత్రాత్మకంగా మూడో సారి విజయం సాధించినందుకు అభినందనలు తెలిపారు. మారిషస్ ప్రధాని ప్రవింద కుమార్ కూడా మోదీకి అభినందనలు తెలిపారు. మోదీ నేతృత్వంలో భారత్ విశేష పురోగతి సాధిస్తూనే ఉంటుందని అన్నారు.

Tags

Related News

అయ్యబాబోయ్.. ‘సైకిల్ అంబులెన్స్’ అంట.. నెట్టింట మళ్లీ జోకర్ అయిన పాక్!

పెరులో వరుస భూకంపాలు.. ఆరుగురు మృతి, వందలాది మంది నిరాశ్రయులు

అమెరికా స్థావరాలపై ఇరాన్ భీకర దాడులు.. ఇద్దరు అమెరికా సైనికులు మృతి, ట్రంప్‌పై ఖమేని ఘాటు వ్యాఖ్యలు

హార్మూజ్ జలసంధిలో హైటెన్షన్.. సముద్రంలో పేలిన రెండు చమురు ట్యాంకర్లు!

మెక్సికోలో భారీ భూకంపం.. ఒక్కసారిగా ఊగిపోయిన భవనాలు! సునామీ ముప్పు పొంచి ఉందా?

అమెరికా చదువులపై ట్రంప్ ‘వీసా’ దెబ్బ.. భారతీయులకు డబుల్ షాక్!

ఇరాన్‌పై అమెరికా దాడులు.. కుప్పకూలిన చాబహార్ టవర్.. భారత్‌కు కోలుకోలేని దెబ్బ!

అల్జీరియాలో భారీ అగ్నిప్రమాదం.. 11 మంది అనాథలు సజీవదహనం, 19 మందికి తీవ్ర గాయాలు

Big Stories

Advertisement
×