E-Paper
Advertisement

Uttarkashi: ఉత్తరకాశీలో ఘోర విషాదం.. హిమాలయాల్లో ట్రెక్కింగ్ వెళ్లిన బృందంలో నలుగురు మృతి

Uttarkashi: ఉత్తరకాశీలో ఘోర విషాదం.. హిమాలయాల్లో ట్రెక్కింగ్ వెళ్లిన బృందంలో నలుగురు మృతి
Advertisement

Uttarkashi: ఉత్తరకాశీలో ఘోర విషాదం చోటుచేసుకుంది. హిమాలయాల్లో ట్రెక్కింగ్ వెళ్లిన బృందంలో నలుగురు మృతి చెందారు. ఉత్తరాఖండ్‌లోని ఎగువ హిమాలయ పర్వతాల్లో సహస్త్రతల్ వద్దకు 22మందితో కూడిన బృందం ట్రెక్కింగ్‌కు వెళ్లింది. వీరిలో నలుగురు మృతి చెందగా.. ఇంకా 18 మంది హిమాలయాల్లో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో 5మందిని ఉత్తరాఖండ్ విపత్తు నిర్వహణ బృందాలు కాపాడాయి. మిగతా వారిని కూడా రక్షించేందుకు ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టింది.

ప్రతికూల వాతావరణమే కారణమా?

Advertisement

ట్రెక్కింగ్ బృందం గత నెల 29న 22మందితో కలిసి హిమాలయన్ వ్యై ట్రెక్కింగ్ ఏజెన్సీ వద్దకు వెళ్లారు. అయితే హిమాలయాల్లో సుమారు 4,400 మీటర్ల ఎత్తులో సహస్త్రతల్ సరస్సు ఉంది. ఇక్కడకు వెళ్లిన బృందం.. తిరుగు ప్రయాణంలో దారి తప్పారు. ఒక్కసారిగా ప్రతికూల వాతావరణం ఏర్పడడంతో ఈ ప్రమాదం జరిగినట్లు విపత్తు శాఖ తెలిపింది. అయితే ఇందులో 18 మంది కర్ణాటకకు చెందిన ట్రెక్కర్లు ఉండగా.. ఒక్కరు మహారాష్ట్రకు చెందిన వ్యక్తి ఉన్నారు. వీరందరినీ ముగ్గురు అక్కడే ఉన్న స్థానిక గైడ్లు తీసుకెళ్లినట్లు సమాచారం. వీరంతా ఎంతసేపటికి బేస్ క్యాంపునకు చేరుకోకపోవడంతో ట్రెక్కింగ్ ఏజెన్సీ అప్రమత్తమై చర్యలు చేపట్టింది.

Also Read: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కి బిగ్ షాక్.. మధ్యంతర బెయిల్ పిటిషన్ కొట్టివేత

Advertisement

ముమ్మరంగా గాలింపు చర్యలు

రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందడంతో హెలికాప్టర్ సహాయంతో ఎస్డీఆర్ఎఫ్ గాలిస్తున్నట్లు ఉత్తరకాశీ కలెక్టర్ తెలిపారు. ఇదే కాకుండా సహాయక చర్యల కోసం ఇండియన్ నేవీకి సమాచారం ఇచ్చినట్లు చెప్పారు. దారి తప్పిన వారి ఆచూకీ కోసం ముమ్మరంగా గాలింపు చేపడుతున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. అలాగే జాడ తప్పిన ట్రెక్కింగ్ బృందం ఎక్కడ ఉందో తెలుసుకునేందుకు ఏరియల్ రిస్క్యూ ఆపరేషన్ చేపట్టినట్లు వివరించారు. హెలిప్యాడ్, మట్లీ, హర్సిల్ వంటి సహాయక చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. ఇప్పటికే ఆ ప్రాంతానికి రక్షణ సిబ్బందితోపాటు వైద్య బృందం పంపించినట్లు తెలిపారు. అంతకుముందు ఉత్తరకాశీ, భట్వాడీ ఆస్పత్రులను అప్రమత్తం చేయడంతోపాటు తక్షణ వైద్యం కోసం అంబులెన్స్‌తో పాటు హెలికాప్టర్‌లను పంపినట్లు వివరించారు.

Tags

Related News

సోనియా గాంధీ ఆత్మకథ పుస్తకం విడుదలకు డేట్ ఫిక్స్..!

సీఎం యోగి కాన్వాయ్ సమీపంలో పేలుడు, ఉలిక్కిపడిన అధికారులు, మధుర వెళ్లే దారిలో ఘటన

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్ జాబ్స్.. కనీస వేతనం రూ.50,000.. పూర్తి వివరాలివిగో

ISRO: ఇస్రో ‘నాటీ బాయ్’ ప్రయోగం సక్సెస్.. చైనా-పాక్‌లపై నిఘా నేత్రం, ప్రతీ 10 నిమిషాలకు చుక్కలే

రైల్వే జాబ్స్.. RRB NTPCలో మొత్తం 5,165 ఖాళీలు.. డిగ్రీ ఉంటే చాలు

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

Big Stories

Advertisement
×