E-Paper
Advertisement

Uttarkashi: ఉత్తరకాశీలో ఘోర విషాదం.. హిమాలయాల్లో ట్రెక్కింగ్ వెళ్లిన బృందంలో నలుగురు మృతి

Uttarkashi: ఉత్తరకాశీలో ఘోర విషాదం.. హిమాలయాల్లో ట్రెక్కింగ్ వెళ్లిన బృందంలో నలుగురు మృతి

Uttarkashi: ఉత్తరకాశీలో ఘోర విషాదం చోటుచేసుకుంది. హిమాలయాల్లో ట్రెక్కింగ్ వెళ్లిన బృందంలో నలుగురు మృతి చెందారు. ఉత్తరాఖండ్‌లోని ఎగువ హిమాలయ పర్వతాల్లో సహస్త్రతల్ వద్దకు 22మందితో కూడిన బృందం ట్రెక్కింగ్‌కు వెళ్లింది. వీరిలో నలుగురు మృతి చెందగా.. ఇంకా 18 మంది హిమాలయాల్లో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో 5మందిని ఉత్తరాఖండ్ విపత్తు నిర్వహణ బృందాలు కాపాడాయి. మిగతా వారిని కూడా రక్షించేందుకు ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టింది.

ప్రతికూల వాతావరణమే కారణమా?

ట్రెక్కింగ్ బృందం గత నెల 29న 22మందితో కలిసి హిమాలయన్ వ్యై ట్రెక్కింగ్ ఏజెన్సీ వద్దకు వెళ్లారు. అయితే హిమాలయాల్లో సుమారు 4,400 మీటర్ల ఎత్తులో సహస్త్రతల్ సరస్సు ఉంది. ఇక్కడకు వెళ్లిన బృందం.. తిరుగు ప్రయాణంలో దారి తప్పారు. ఒక్కసారిగా ప్రతికూల వాతావరణం ఏర్పడడంతో ఈ ప్రమాదం జరిగినట్లు విపత్తు శాఖ తెలిపింది. అయితే ఇందులో 18 మంది కర్ణాటకకు చెందిన ట్రెక్కర్లు ఉండగా.. ఒక్కరు మహారాష్ట్రకు చెందిన వ్యక్తి ఉన్నారు. వీరందరినీ ముగ్గురు అక్కడే ఉన్న స్థానిక గైడ్లు తీసుకెళ్లినట్లు సమాచారం. వీరంతా ఎంతసేపటికి బేస్ క్యాంపునకు చేరుకోకపోవడంతో ట్రెక్కింగ్ ఏజెన్సీ అప్రమత్తమై చర్యలు చేపట్టింది.

Also Read: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కి బిగ్ షాక్.. మధ్యంతర బెయిల్ పిటిషన్ కొట్టివేత

ముమ్మరంగా గాలింపు చర్యలు

రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందడంతో హెలికాప్టర్ సహాయంతో ఎస్డీఆర్ఎఫ్ గాలిస్తున్నట్లు ఉత్తరకాశీ కలెక్టర్ తెలిపారు. ఇదే కాకుండా సహాయక చర్యల కోసం ఇండియన్ నేవీకి సమాచారం ఇచ్చినట్లు చెప్పారు. దారి తప్పిన వారి ఆచూకీ కోసం ముమ్మరంగా గాలింపు చేపడుతున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. అలాగే జాడ తప్పిన ట్రెక్కింగ్ బృందం ఎక్కడ ఉందో తెలుసుకునేందుకు ఏరియల్ రిస్క్యూ ఆపరేషన్ చేపట్టినట్లు వివరించారు. హెలిప్యాడ్, మట్లీ, హర్సిల్ వంటి సహాయక చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. ఇప్పటికే ఆ ప్రాంతానికి రక్షణ సిబ్బందితోపాటు వైద్య బృందం పంపించినట్లు తెలిపారు. అంతకుముందు ఉత్తరకాశీ, భట్వాడీ ఆస్పత్రులను అప్రమత్తం చేయడంతోపాటు తక్షణ వైద్యం కోసం అంబులెన్స్‌తో పాటు హెలికాప్టర్‌లను పంపినట్లు వివరించారు.

Tags

Related News

తమిళనాడులో బైపోల్ సందడి, టీవీకే తరపున రాఘవ లారెన్స్‌, తిరుచ్చి నుంచి రేసులో చాలామంది నేతలు

Bengal Politics: టీఎంసీలో సంక్షోభం.. బీజేపీతో టచ్‌లో 20 మంది ఎంపీలు, కమిటీలన్నీ రద్దు

చల్లని కబురు వచ్చేసింది.. కేరళలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ, వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశం

రేపు ఆ ప్రాంతాల్లో మోదీ పర్యటన.. ఏకంగా రూ.21 వేల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం.. పూర్తి వివరాలివే!

బెంగాల్‌లో దారుణమైన బీజేపీ పాలన.. అనాగరికం, రాక్షసం-ఎంపీ అభిషేక్ బెనర్జీ

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

Big Stories

×