E-Paper
Advertisement

Japan: జపాన్‌లో మోదీ షో.. జీ7లో మనదే హవా..

Japan: జపాన్‌లో మోదీ షో.. జీ7లో మనదే హవా..
pm modi japan

Japan: ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ. జపాన్‌ ప్రధాని ఫుమియో కిషిదా ఆహ్వానం మేరకు జీ7 సదస్సుకు ప్రత్యేక అతిధిగా హాజరైన మోదీతో.. జెలెన్‌ స్కీ సమావేశమయ్యారు. 2022 ఫిబ్రవరి 24 నుంచి ఉక్రెయిన్‌పై రష్యా పూర్తిస్థాయి దురాక్రమణ మొదలైన నేపథ్యంలో మోదీ, జెలెన్‌స్కీ తొలిసారి భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.

మరో వైపు జీ7 సదస్సులో మరికొన్ని ఆసక్తి సన్నివేశాలు చోటుచేసుకున్నాయి. ప్రధాని మోదీపై తన ఆప్యాయతను ప్రదర్శించారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌. మోదీ, బైడెన్‌ ఇద్దరూ ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. జీ7 సదస్సు సందర్భంగా బైడెన్‌ రాకను గమనించిన మోదీ.. కుర్చీలోంచి లేచి మరీ ఆలింగనం చేసుకున్నారు. అనంతరం జో బైడెన్‌తో ప్రధాని మోదీ ప్రత్యేకంగా సమావేశమైనట్లు తెలుస్తోంది. మరో వైపు ఇదే వేదికగా బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌ను సైతం ప్రధాని మోదీని ఆలింగనం చేసుకుని పలకరించారు.

వివిధ దేశాధ్యక్షులు ప్రధాని మోదీని ఆలింగనం చేసుకుని పలకరించడంతో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో, జర్మన్‌ ఛాన్సలర్‌ ఒలాఫ్ స్కోల్జ్ తో కూడా ప్రధాని మోదీ భేటీ అయ్యారు. జీ7 సదస్సు కోసం ఒకరోజు ముందుగానే జపాన్‌కు చేరుకున్న ప్రధాని మోదీ.. ఆ దేశ ప్రధాని కిషిదాతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు.

Related News

Big Shock To Trump: ట్రంప్‌కు ఊహించని ఝలక్.. షాకిచ్చిన వార్ పవర్స్, ఆపరేషన్ ‘ఎపిక్ ఫ్యూరీ’ క్లోజ్

Kuwait Airport: ఇరాన్ మిస్సైళ్ల దాడులు.. కువైట్‌ ఎయిర్‌పోర్ట్ డ్యామేజ్, విమాన సర్వీసులు రద్దు

మరో బాంబ్‌ పేల్చిన అమెరికా.. భారత్‌పై అదనపు సుంకాలకు ప్రతిపాదన, ఏకంగా 12 శాతం

పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు.. అమెరికా స్థావరాలపై ఇరాన్ వరుస దాడులు, ఖేష్మ్ ద్వీపంపై

ఇరాన్ షాకింగ్ నిర్ణయం.. ఇకపై మాటలు-చర్చల్లేవ్, హోర్మూజ్ జలసంధి మాటేంటి?

ఇరాన్‌లో ఇంటిపోరు మొదలైందా? అధ్యక్షుడు మసూద్‌ నిర్ణయం వెనుక, అసలేం జరుగుతోంది?

రూటు మార్చిన అమెరికా.. ఇరాన్‌పై మెరుపు దాడులు, రాడార్- డ్రోన్ వ్యవస్థలు డ్యామేజ్

హోర్ముజ్ జలసంధిలో హై టెన్షన్.. ఇరాన్ సైనిక క్యాంప్‌పై అమెరికా దాడి, కవ్వింపు చర్యలు డీల్ కోసమా?

Big Stories

×