BigTV English

PM Modi’s Ukraine and Poland Visit: ఉద్రిక్తతల మధ్య మోదీ ఉక్రెయిన్ పర్యటన

PM Modi’s Ukraine and Poland Visit: ఉద్రిక్తతల మధ్య మోదీ ఉక్రెయిన్ పర్యటన

PM Modi’s Ukraine and Poland Visit Modi ahead of two-nations tour: మూడో సారి ప్రధాని పదవిని చేపట్టాక మోదీ విదేశీ పర్యటనలపై దృష్టి సారించారు. విదేశాలతో భారత దౌత్య సంబంధాలను పునరుద్ధరించే ప్రక్రియలో భాగంగా నరేంద్ర మోదీ ఉక్రెయిన్, పోలెండ్ దేశాల పర్యటనకు బయలుదేరారు. తొలుత పోలెండ్ దేశాన్ని సందర్శించి ఆ తర్వాత ఉక్రెయిన్ వెళ్లనున్నారు మోదీ. ఉక్రెయిన్ దేశాధ్యక్షుడు జెలెన్ స్కీ ఆహ్వానం మేరకు ఆ దేశాన్ని సందర్శిస్తున్నట్లు ప్రదాని మోదీ తన సోషల్ మీడియా ఎక్స్ ద్వారా పోస్ట్ పెట్టారు. కేవలం భారత్ ఉక్రెయిన్, పోలెండ్ ల మధ్య వాణిజ్యపరమైన దౌత్య సంబంధాలను బలంగా చేసేందుకు ఈ విదేశీ పర్యటన చేపట్టినట్లు మోదీ తెలిపారు. పోలెండ్ తో భారత వాణిజ్య, దౌత్స సంబంధాలను డెభ్బై ఏళ్లు పూర్తవుతున్నాయని పోలెండ్ తో భారత సంబంధాలు ఈ పర్యటనతో బలోపేతం అవుతాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు మోదీ. ఆ దేశ అధ్యక్షుడు అండ్రేజ్ దుడా, ప్రధాని డొనాల్డ్ టస్క్ లతో కీలక భేటీ కానున్నామని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా పోలెండ్ లో భారత సంతతి ప్రజలను కూడా కలవనున్నామని చెప్పారు. అలాగే ఉక్రెయిన్ దేశానికి తొలిసారి ప్రధాని హోదాలో అడుగుపెడుతున్నామని మోదీ తెలిపారు. ప్రస్తుతం ఉక్రెయని్, రష్యా దేశాల మధ్య గత కొంతకాలంగా ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయని..త్వరలోనే ఉక్రెయిన్ లో శాంతి నెలకొనాలని అన్నారు. అక్కడి పౌరులంతా స్వేచ్ఛాయుత వాతావరణంలో జీవించాలని రుకుంటున్నారని..త్వరలోనే అన్ని సమస్యలు తొలగిపోతాయని మోదీ అన్నారు.


ట్రైన్ ఫోర్స్ వన్ లో ప్రయాణం

ఈ నెల 23న ట్రైన్ ఫోర్స్ వన్ లో ప్రధాని మోదీ ఉక్రెయిన్ కు వెళ్లనున్నారు. చాలా మంది ప్రపంచ దేశాధినేతలంతా ఇందులోనే ప్రయాణించారు. ఈ రెండు దేశాల పర్యటన సంతృప్తికరమైన వాతావరణంలో చర్చలు జరగాలని కోరుకుంటున్నానని మోదీ అన్నారు. భారత్ కు అటు రష్యా, ఇటు ఉక్రెయిన్ రెండూ కావసనిన దేశాలే..ఇరు దేశాలు భారత్ కు మిత్ర దేశాలే. ప్రస్తుతం ఈ రెండు దేశాల మధ్య ఉత్కంఠకర వాతావరణం నెలకొంది. ఈ రెండు దేశాల శతృత్వంతో మూడో ప్రపంచ యుద్ధం వచ్చే అవకాశం ఉందని ప్రపంచ మేధావులు అంచనాలు వేస్తున్నారు. అదే జరిగితే ప్రపంచ వినాశనం తప్పదు. ఇప్పటికే జరిగిన రెండు ప్రపంచ యుద్ధాలతో చాలా వరకూ చిన్నదేశాలకు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఇప్పుదు మరో సారి మూడో ప్రపంచ యుద్ధాన్ని కోరుకోవడం లేదు ఏ ఒక్కరూ..ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల మధ్య మోదీ ఉక్రెయిన్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.


Related News

Donald Trump: ఏడు నెలల్లో ఏడు యుద్ధాలు ఆపాను.. అందులో భారత్- పాక్ ఒకటి.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

Hanuman Statue: హనుమంతుడి విగ్రహంపై ట్రంప్ పార్టీ నేత అనుచిత వ్యాఖ్యలు.. అమెరికా క్రైస్తవ దేశమా?

Afghan Boy: షిద్ధత్ సినిమా సీన్ రిపీట్.. విమానం ల్యాండింగ్ గేర్‌లో దాక్కుని ఢిల్లీకి చేరిన అఫ్ఘాన్ బాలుడు

Ragasa Coming: భయంతో వణికిపోతున్న చైనా.. బుల్లెట్ ట్రైన్ కంటే వేగంగా ముంచుకొస్తున్న ముప్పు

Britain – China: అమెరికా వెళ్లాలంటే లక్ష డాలర్లు.. బ్రిటన్, చైనా కి మాత్రం ఫ్రీ ఫ్రీ ఫ్రీ

Pakistan Military: సొంత ప్రజలపైనే బాంబుల వర్షం కురిపించిన పాక్ జెట్స్.. 30 మందికి పైగా దుర్మరణం

US on H 1B Visa: హెచ్‌-1బీ వీసా రుసుంపై వైట్‌హౌస్‌ క్లారిటీ.. వారికి మాత్రమే, ఇక భయం లేదు

H-1B Visas: హెచ్-1బీ వీసాల ఫీజు పెంపు.. భారత టెక్ కంపెనీల పరిస్థితి ఏమిటి? ఆ సమస్య తప్పదా?

Big Stories

×