E-Paper
Advertisement

Bangladesh: బంగ్లాదేశ్‌లో హోటల్‌కు నిప్పు.. 24 మంది సజీవ దహనం

Bangladesh: బంగ్లాదేశ్‌లో హోటల్‌కు నిప్పు.. 24 మంది సజీవ దహనం
Advertisement

Bangladesh: బంగ్లాదేశ్‌లో అల్లర్లు కొనసాగుతున్నాయి. విద్యార్థి సంఘాల ఆందోళనలతో దేశం అట్టుడికిపోతోంది. తాజాగా జషోర్ జిల్లాలోని అవామీ లీగ్ ప్రధాన కార్యదర్శి షాహిన్ చక్లాదర్‌కు చెందిన జబీర్ ఇంటర్‌నేషనల్ హోటల్‌కు ఆందోళన కారులునిప్పంటించారు. ఈ ఘటనలో 24 మంది సజీవ దహనం అయ్యారు. అందులో ఒకరు ఇండోనేషియా పౌరుడు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

దీంతో బంగ్లాదేశ్‌లో మృతుల సంఖ్య భారీగా పెరిగింది. 21 రోజులుగా కొనసాగుతున్న ఆందోళనల కారణంగా వందలాది మంది మృతి చెందారు. ఇప్పటి వరకు మరణాల సంఖ్య 440 కి చేరింది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు సైన్యం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. షేక్ హసీనా రాజీనామా చేసి దేశం విడిచి వెళ్లిన తర్వాత కొన్ని గంటల్లోనే 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇదిలా ఉంటే హోటల్‌కు నిప్పు పెట్టిన ఆందోళన కారులు అగ్నిమాపక సిబ్బంది రాకుండా కూడా అడ్డుకున్నారు.

Advertisement

Also Read: బంగ్లాదేశ్ పార్లమెంట్ రద్దు.. కొత్త ప్రభుత్వానికి మద్దతివ్వని విద్యార్థి ఉద్యమం

హింసాత్మక సంఘటనలు చోటు చేసుకుంటున్నా కూడా దేశంలో పరిస్థితి అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. హసీనాకు వ్యతిరేకంగా నిరసనల కారణంగా కొన్ని రోజులుగా మూసివేసిన పాఠశాలలను తిరిగి తెరిచినట్లు సమాచారం. దుకాణాలు, కార్యాలయాలు కూడా తెరుచుకున్నాయి. దీంతో పరిస్థితి కాస్త అదుపులోకి వచ్చినట్లు తెలుస్తోంది.

Related News

విఫలమైన సామూహిక సున్తీలు.. 43 మంది బాలురు మృతి, దక్షిణాఫ్రికాలో ఘటన

ట్రంప్‌‌కు ఊహించని షాక్‌.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ వ్యవహారం.. కొత్త ఆదేశాలకు కోర్టు బ్రేక్

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

Big Stories

Advertisement
×