E-Paper
Advertisement

Bangladesh: బంగ్లాదేశ్‌లో హోటల్‌కు నిప్పు.. 24 మంది సజీవ దహనం

Bangladesh: బంగ్లాదేశ్‌లో హోటల్‌కు నిప్పు.. 24 మంది సజీవ దహనం

Bangladesh: బంగ్లాదేశ్‌లో అల్లర్లు కొనసాగుతున్నాయి. విద్యార్థి సంఘాల ఆందోళనలతో దేశం అట్టుడికిపోతోంది. తాజాగా జషోర్ జిల్లాలోని అవామీ లీగ్ ప్రధాన కార్యదర్శి షాహిన్ చక్లాదర్‌కు చెందిన జబీర్ ఇంటర్‌నేషనల్ హోటల్‌కు ఆందోళన కారులునిప్పంటించారు. ఈ ఘటనలో 24 మంది సజీవ దహనం అయ్యారు. అందులో ఒకరు ఇండోనేషియా పౌరుడు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

దీంతో బంగ్లాదేశ్‌లో మృతుల సంఖ్య భారీగా పెరిగింది. 21 రోజులుగా కొనసాగుతున్న ఆందోళనల కారణంగా వందలాది మంది మృతి చెందారు. ఇప్పటి వరకు మరణాల సంఖ్య 440 కి చేరింది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు సైన్యం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. షేక్ హసీనా రాజీనామా చేసి దేశం విడిచి వెళ్లిన తర్వాత కొన్ని గంటల్లోనే 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇదిలా ఉంటే హోటల్‌కు నిప్పు పెట్టిన ఆందోళన కారులు అగ్నిమాపక సిబ్బంది రాకుండా కూడా అడ్డుకున్నారు.

Also Read: బంగ్లాదేశ్ పార్లమెంట్ రద్దు.. కొత్త ప్రభుత్వానికి మద్దతివ్వని విద్యార్థి ఉద్యమం

హింసాత్మక సంఘటనలు చోటు చేసుకుంటున్నా కూడా దేశంలో పరిస్థితి అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. హసీనాకు వ్యతిరేకంగా నిరసనల కారణంగా కొన్ని రోజులుగా మూసివేసిన పాఠశాలలను తిరిగి తెరిచినట్లు సమాచారం. దుకాణాలు, కార్యాలయాలు కూడా తెరుచుకున్నాయి. దీంతో పరిస్థితి కాస్త అదుపులోకి వచ్చినట్లు తెలుస్తోంది.

Related News

Kuwait Airport: ఇరాన్ మిస్సైళ్ల దాడులు.. కువైట్‌ ఎయిర్‌పోర్ట్ డ్యామేజ్, విమాన సర్వీసులు రద్దు

మరో బాంబ్‌ పేల్చిన అమెరికా.. భారత్‌పై అదనపు సుంకాలకు ప్రతిపాదన, ఏకంగా 12 శాతం

పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు.. అమెరికా స్థావరాలపై ఇరాన్ వరుస దాడులు, ఖేష్మ్ ద్వీపంపై

ఇరాన్ షాకింగ్ నిర్ణయం.. ఇకపై మాటలు-చర్చల్లేవ్, హోర్మూజ్ జలసంధి మాటేంటి?

ఇరాన్‌లో ఇంటిపోరు మొదలైందా? అధ్యక్షుడు మసూద్‌ నిర్ణయం వెనుక, అసలేం జరుగుతోంది?

రూటు మార్చిన అమెరికా.. ఇరాన్‌పై మెరుపు దాడులు, రాడార్- డ్రోన్ వ్యవస్థలు డ్యామేజ్

హోర్ముజ్ జలసంధిలో హై టెన్షన్.. ఇరాన్ సైనిక క్యాంప్‌పై అమెరికా దాడి, కవ్వింపు చర్యలు డీల్ కోసమా?

పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు.. ఇరాన్‌పై అమెరికా దాడులు.. క్షిపణి ప్రయోగ కేంద్రాలు

Big Stories

×