BigTV English
Advertisement

Reykjavik : 14 గంటల్లో 800 ప్రకంపనలు.. ఎమర్జెన్సీ ప్రకటించిన ద్వీపదేశం

Reykjavik : 14 గంటల్లో 800 ప్రకంపనలు.. ఎమర్జెన్సీ ప్రకటించిన ద్వీపదేశం

Reykjavik : ఐరోపాకు చెందిన ద్వీపదేశమైన ఐస్ లాండ్.. వరుస భూ ప్రకంపనలతో వణికిపోతోంది. సుమారు 14 గంటల వ్యవధిలో 800 ప్రకంపనలు సంభవించాయి. రాజధాని రెక్జావిక్ ప్రాంతంలో ప్రకంపనలు రాగా.. ఐస్ లాండ్ అత్యవసర పరిస్థిని ప్రకటించింది. శుక్రవారం సాయంత్రం రెక్జావిక్ కు 40 కిలోమీటర్ల దూరంలో 2 బలమైన ప్రకంపనలు సంభవించాయి. వీటి తీవ్రత రిక్టర్ స్కేల్ పై 5.2గా నమోదైంది. ఆ ద్వీపంలో సంభవించే ప్రకంపనల్లో ఇదే అత్యధికమైన తీవ్రతను కలిగి ఉంది.


ప్రకంపనల కారణంగా రెక్జానెస్ సమీప ప్రాంతాల్లో రహదారులు ధ్వంసం కావడంతో రాకపోకలను నిలిపివేశారు. అక్టోబర్ చివరి నుంచి రెక్జానెస్ ప్రాంతంలో 24వేల ప్రకంపనలు సంభవించగా.. శుక్రవారం తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకూ సుమారు 800 ప్రకంపనలు నమోదయ్యాయి. తీవ్రమైన భూకంపాల కారణంగా ప్రజల రక్షణార్థం ఎమర్జెన్సీని ప్రకటించినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రకంపనల తీవ్రత మరింత ఎక్కువగా ఉండవచ్చని, అగ్నిపర్వతాల విస్ఫోటాలకు దారితీయొచ్చని హెచ్చరించారు. ప్రకంపనలు వచ్చిన ప్రాంతానికి మూడు కిలోమీటర్ల దూరంలో గ్రిండావిక్ అనే జనావాస ప్రాంతం ఉంది. ఇక్కడ 4 వేల మంది నివసిస్తుండగా.. వారిని పునారావాసాలకు తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.


Tags

Related News

Nvidia: ఎన్విడియా పై చైనా నిషేధం.. భారత్ స్టార్టప్ లకు ఇలా కలిసొస్తోంది..

New York First Lady: న్యూయార్క్ ఫస్ట్ లేడీ రామా దువ్వాజి ఎంత ఫేమస్సో తెలుసా?

America News: అమెరికాలో ఎన్నికలు.. అధికార పార్టీకి ఝలక్, వర్జీనియా లెఫ్టినెంట్‌ గవర్నర్‌‌గా హైదరాబాద్ మహిళ

NYC Mayor Election-2025: న్యూయార్క్‌ మేయర్ ఎన్నికలు..ట్రంప్‌కు ఝలక్, భారతీయడికే పీఠం

H1B Visa VS EB5 Visa: పర్మినెంట్‌‌గా అమెరికాలోనే.. ఈ వీసాపై ఇండియన్స్ కన్నేశారా?

Plane Crash: ఘోర ప్రమాదం.. కుప్పకూలిన మరో విమానం.. స్పాట్‌లో 14 మంది

Philippines: ఫిలిప్పీన్స్‌లో తుఫాను బీభత్సం.. 40 మందికి పైగా మృతి..

Adarsh Behera: సూడాన్ లో భారతీయుడు కిడ్నాప్, ఇంతకీ ఎవరీ ఆదర్శ్ బెహరా?

Big Stories

×