E-Paper
Advertisement

Nuclear Weapons: పాకిస్థాన్ కంటే భారత్ వద్ద అణ్వాయుధాలు ఎక్కువ: SIPRI నివేదిక

Nuclear Weapons: పాకిస్థాన్ కంటే భారత్ వద్ద అణ్వాయుధాలు ఎక్కువ: SIPRI నివేదిక

Stockholm International Peace Research Institute Report: ప్రస్తుతం పాకిస్థాన్ కంటే భారతదేశం వద్ద అణ్వాయుధాలు ఎక్కువగా ఉన్నట్లు స్వీడిష్ థింక్-ట్యాంక్ స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్(SIPRI) నివేదిక పేర్కొంది. జనవరి 2024 ప్రకారం భారత్ వద్ద 172 నిల్వ అణ్వాయుధాల వార్‌హెడ్‌లు ఉన్నాయని SIPRI తెలిపింది.

ఇక డ్రాగన్ దేశం మాత్రం తన అణ్వాయుధాల సంఖ్య పెంచుకుంటూ పోతోందని SIPRI నివేదిక స్పష్టం చేసింది. జనవరి 2023లో 410 వార్‌హెడ్‌లు ఉండగా ప్రస్తుతం దాని సంఖ్య 500కు చేరిందని తెలిపింది.

గత రెండేళ్ళలో ప్రపంచం రెండు యుద్ధాలకు సాక్ష్యంగా ఉండటంతో, స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (SIPRI) చేసిన విశ్లేషణలో భారతదేశం, పాకిస్తాన్, చైనాతో సహా తొమ్మిది అణ్వాయుధ దేశాలు తమ అణ్వాయుధాలను ఆధునీకరించడాన్ని కొనసాగించాయి.

నివేదికలో పేర్కొన్న ఇతర దేశాలు యునైటెడ్ స్టేట్స్, రష్యా, యునైటెడ్ కింగ్‌డమ్, ఫ్రాన్స్, ఉత్తర కొరియా,ఇజ్రాయెల్.

మొత్తం అణ్వాయుధాలలో 90 శాతం రష్యా, యుఎస్ వద్దే ఉన్నాయని SIPRI తెలిపింది. అనేక దేశాలు 2023లో కొత్త అణ్వాయుధ వ్యవస్థలను మోహరించినట్లు నివేదిక పేర్కొంది.

జనవరి 2024 ప్రకారం భారతదేశంలో 172 “నిల్వ” అణు వార్‌హెడ్‌లు ఉన్నాయని, పాకిస్తాన్ కంటే రెండు ఎక్కువ అని SIPRI నివేదిక పేర్కొంది. 2023లో భారతదేశం తన అణ్వాయుధాలను స్వల్పంగా విస్తరించిందని నివేదిక పేర్కొంది. రెండు దేశాలు 2023లో కొత్త రకాల అణు డెలివరీ వ్యవస్థలను అభివృద్ధి చేయడం కొనసాగించాయని తెలిపింది.

Also Read: నార్త్ కొరియా పర్యటనకు పుతిన్.. 24ఏళ్ల తర్వాత..

బాలిస్టిక్ క్షిపణులపై బహుళ వార్‌హెడ్‌లను మోహరించడానికి రష్యా, యుఎస్ అడుగుజాడల్లో భారతదేశం, పాకిస్తాన్, ఉత్తర కొరియాలు నడుస్తున్నాయని స్వీడిష్ థింక్-ట్యాంక్ పేర్కొంది. తొమ్మిది అణ్వాయుధ దేశాలు గత సంవత్సరంలో అణు సామర్థ్యాలకు మొత్తం 91 బిలియన్ డాలర్లు కేటాయించాయని ఐసీఏఎన్ నివేదిక వెల్లడించింది.

Tags

Related News

Big Shock To Trump: ట్రంప్‌కు ఊహించని ఝలక్.. షాకిచ్చిన వార్ పవర్స్, ఆపరేషన్ ‘ఎపిక్ ఫ్యూరీ’ క్లోజ్

Kuwait Airport: ఇరాన్ మిస్సైళ్ల దాడులు.. కువైట్‌ ఎయిర్‌పోర్ట్ డ్యామేజ్, విమాన సర్వీసులు రద్దు

మరో బాంబ్‌ పేల్చిన అమెరికా.. భారత్‌పై అదనపు సుంకాలకు ప్రతిపాదన, ఏకంగా 12 శాతం

పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు.. అమెరికా స్థావరాలపై ఇరాన్ వరుస దాడులు, ఖేష్మ్ ద్వీపంపై

ఇరాన్ షాకింగ్ నిర్ణయం.. ఇకపై మాటలు-చర్చల్లేవ్, హోర్మూజ్ జలసంధి మాటేంటి?

ఇరాన్‌లో ఇంటిపోరు మొదలైందా? అధ్యక్షుడు మసూద్‌ నిర్ణయం వెనుక, అసలేం జరుగుతోంది?

రూటు మార్చిన అమెరికా.. ఇరాన్‌పై మెరుపు దాడులు, రాడార్- డ్రోన్ వ్యవస్థలు డ్యామేజ్

హోర్ముజ్ జలసంధిలో హై టెన్షన్.. ఇరాన్ సైనిక క్యాంప్‌పై అమెరికా దాడి, కవ్వింపు చర్యలు డీల్ కోసమా?

Big Stories

×