E-Paper
Advertisement

Nuclear Weapons: పాకిస్థాన్ కంటే భారత్ వద్ద అణ్వాయుధాలు ఎక్కువ: SIPRI నివేదిక

Nuclear Weapons: పాకిస్థాన్ కంటే భారత్ వద్ద అణ్వాయుధాలు ఎక్కువ: SIPRI నివేదిక
Advertisement

Stockholm International Peace Research Institute Report: ప్రస్తుతం పాకిస్థాన్ కంటే భారతదేశం వద్ద అణ్వాయుధాలు ఎక్కువగా ఉన్నట్లు స్వీడిష్ థింక్-ట్యాంక్ స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్(SIPRI) నివేదిక పేర్కొంది. జనవరి 2024 ప్రకారం భారత్ వద్ద 172 నిల్వ అణ్వాయుధాల వార్‌హెడ్‌లు ఉన్నాయని SIPRI తెలిపింది.

ఇక డ్రాగన్ దేశం మాత్రం తన అణ్వాయుధాల సంఖ్య పెంచుకుంటూ పోతోందని SIPRI నివేదిక స్పష్టం చేసింది. జనవరి 2023లో 410 వార్‌హెడ్‌లు ఉండగా ప్రస్తుతం దాని సంఖ్య 500కు చేరిందని తెలిపింది.

Advertisement

గత రెండేళ్ళలో ప్రపంచం రెండు యుద్ధాలకు సాక్ష్యంగా ఉండటంతో, స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (SIPRI) చేసిన విశ్లేషణలో భారతదేశం, పాకిస్తాన్, చైనాతో సహా తొమ్మిది అణ్వాయుధ దేశాలు తమ అణ్వాయుధాలను ఆధునీకరించడాన్ని కొనసాగించాయి.

నివేదికలో పేర్కొన్న ఇతర దేశాలు యునైటెడ్ స్టేట్స్, రష్యా, యునైటెడ్ కింగ్‌డమ్, ఫ్రాన్స్, ఉత్తర కొరియా,ఇజ్రాయెల్.

Advertisement

మొత్తం అణ్వాయుధాలలో 90 శాతం రష్యా, యుఎస్ వద్దే ఉన్నాయని SIPRI తెలిపింది. అనేక దేశాలు 2023లో కొత్త అణ్వాయుధ వ్యవస్థలను మోహరించినట్లు నివేదిక పేర్కొంది.

జనవరి 2024 ప్రకారం భారతదేశంలో 172 “నిల్వ” అణు వార్‌హెడ్‌లు ఉన్నాయని, పాకిస్తాన్ కంటే రెండు ఎక్కువ అని SIPRI నివేదిక పేర్కొంది. 2023లో భారతదేశం తన అణ్వాయుధాలను స్వల్పంగా విస్తరించిందని నివేదిక పేర్కొంది. రెండు దేశాలు 2023లో కొత్త రకాల అణు డెలివరీ వ్యవస్థలను అభివృద్ధి చేయడం కొనసాగించాయని తెలిపింది.

Also Read: నార్త్ కొరియా పర్యటనకు పుతిన్.. 24ఏళ్ల తర్వాత..

బాలిస్టిక్ క్షిపణులపై బహుళ వార్‌హెడ్‌లను మోహరించడానికి రష్యా, యుఎస్ అడుగుజాడల్లో భారతదేశం, పాకిస్తాన్, ఉత్తర కొరియాలు నడుస్తున్నాయని స్వీడిష్ థింక్-ట్యాంక్ పేర్కొంది. తొమ్మిది అణ్వాయుధ దేశాలు గత సంవత్సరంలో అణు సామర్థ్యాలకు మొత్తం 91 బిలియన్ డాలర్లు కేటాయించాయని ఐసీఏఎన్ నివేదిక వెల్లడించింది.

Tags

Related News

కార్నివాల్ క్రూయిజ్ షిప్‌లో.. ఓ మహిళ ఒకటే గోకుడు, వీడియో వైరల్

హౌతీలు ప్రకటన.. బాబ్‌ ఎల్‌-మాండెబ్‌ జలసంధి మూసివేత, ప్రపంచ దేశాల్లో గుబులు

పశ్చిమాసియాలో యుద్ధ భేరి.. ఇరాన్‌పై విరుచుకుపడ్డ అమెరికా.. హర్మూజ్ జలసంధిలో తీవ్ర ఉద్రిక్తత!

ఆకస్మిక వరదల్లో కొట్టుకుపోయిన అఫ్గానిస్తాన్‌.. 20 మంది మృతి, 100 మంది గల్లంతు

అయ్యబాబోయ్.. ‘సైకిల్ అంబులెన్స్’ అంట.. నెట్టింట మళ్లీ జోకర్ అయిన పాక్!

పెరులో వరుస భూకంపాలు.. ఆరుగురు మృతి, వందలాది మంది నిరాశ్రయులు

అమెరికా స్థావరాలపై ఇరాన్ భీకర దాడులు.. ఇద్దరు అమెరికా సైనికులు మృతి, ట్రంప్‌పై ఖమేని ఘాటు వ్యాఖ్యలు

హార్మూజ్ జలసంధిలో హైటెన్షన్.. సముద్రంలో పేలిన రెండు చమురు ట్యాంకర్లు!

Big Stories

Advertisement
×