E-Paper
Advertisement

Elections: టెన్షన్ టెన్షన్… మరికొద్ది సేపట్లోనే ఆ ఎన్నికల ఫలితాలు..

Elections: టెన్షన్ టెన్షన్… మరికొద్ది సేపట్లోనే ఆ ఎన్నికల ఫలితాలు..
Advertisement

Sri Lanka Presidential Elections: ప్రస్తుతం అంతా శ్రీలంకవైపు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. శనివారం అక్కడ తదుపరి అధ్యక్ష ఎన్నికల పోలింగ్ జరిగింది. అయితే, ఆ పోలింగ్ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపును కూడా ప్రారంభించారు. ఈ లెక్కింపు మరికొద్ది గంటల్లోనే పూర్తయ్యే అవకాశమున్నట్లు తెలుస్తోంది. దీంతో శ్రీలంక నూతన అధ్యక్షుడు ఎవరనేది ఈ ఫలితాలతో తేలిపోనున్నది.

కాగా, పోలైన ఓట్లలో మొదటగా పోస్టల్ ఓట్లను లెక్కించారు. ఆ తరువాత సాధారణ ఓట్లను లెక్కిస్తున్నారు. దాదాపు ఓట్ల లెక్కింపు ముగిసినట్లుగా తెలుస్తోంది. ఇంకొన్ని గంటల్లో విజయం ఎవరిదనేది తేలిపోనున్నది.

Advertisement

Also Read: పేజర్లు, వాకీటాకీలు, రాకెట్ లాంచింగ్ సైట్స్.. అసలు సినిమా ముందుందా ?

శనివారం రోజు మొత్తం 22 ఎలక్ట్రోరల్ జిల్లాల్లో ఎన్నికల పోలింగ్ నిర్వహించారు. ఈ పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరిగింది. పోలింగ్ అనంతరం ఆ దేశ ఎన్నికల కమిషన్ చైర్మన్ మాట్లాడుతూ అత్యంత ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగాయని ప్రకటించారు.

Advertisement

ఇదిలా ఉంటే.. శ్రీలంకలో రెండేళ్ల క్రితం తీవ్ర ఆర్థిక సంక్షోభం ఎదురైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సారి శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో త్రిముఖ పోటీ నెలకొన్నది. సమగి జన బలవేగయ పార్టీ నుంచి సజీత్ ప్రేమదాస, నేషనల్ పీపుల్స్ పవర్ పార్టీకి చెందిన అనుర కుమార దిసనాయకేతోపాటు ప్రస్తుత అధ్యక్షుడు విక్రమ్ సింఘే.. ఈ ముగ్గురూ పోటీలో ఉన్నారు. త్రిముఖ పోరు నెలకొనడంతో ఈసారి ఎన్నికలు ఆసక్తిగా మారాయి. మరికొద్ది గంటల్లోనే శ్రీలంక అధ్యక్షుడు ఎవరనేది తేలిపోనున్నది.

Also Read: 200 ఏనుగులను వధించేందుకు ప్రభుత్వం అనుమతి.. ప్రజల ఆకలి తీర్చేందుకేనా?!

Tags

Related News

అమెరికా స్థావరాలపై ఇరాన్ భీకర దాడులు.. ఇద్దరు అమెరికా సైనికులు మృతి, ట్రంప్‌పై ఖమేని ఘాటు వ్యాఖ్యలు

హార్మూజ్ జలసంధిలో హైటెన్షన్.. సముద్రంలో పేలిన రెండు చమురు ట్యాంకర్లు!

మెక్సికోలో భారీ భూకంపం.. ఒక్కసారిగా ఊగిపోయిన భవనాలు! సునామీ ముప్పు పొంచి ఉందా?

అమెరికా చదువులపై ట్రంప్ ‘వీసా’ దెబ్బ.. భారతీయులకు డబుల్ షాక్!

ఇరాన్‌పై అమెరికా దాడులు.. కుప్పకూలిన చాబహార్ టవర్.. భారత్‌కు కోలుకోలేని దెబ్బ!

అల్జీరియాలో భారీ అగ్నిప్రమాదం.. 11 మంది అనాథలు సజీవదహనం, 19 మందికి తీవ్ర గాయాలు

సముద్రంలో పెను విషాదం.. రోహింగ్యా శరణార్థుల పడవలు బోల్తా.. 500 మందికి పైగా మృతి!

బీచ్‌లో గుండె గుభేల్.. నడినెత్తి మీద నుంచి దూసుకెళ్లిన యుద్ధ విమానాలు.. గాల్లోకి ఎగిరిన టెంట్లు!

Big Stories

Advertisement
×