E-Paper
Advertisement

Suicide Bomb Attack: సోమాలియాలో ఆత్మాహుతి దాడి.. 32 మంది మృతి

Suicide Bomb Attack: సోమాలియాలో ఆత్మాహుతి దాడి.. 32 మంది మృతి

Suicide Bomb Attack in Mogadishu:ఈస్ట్ ఆసియా దేశమైన సోమాలియా రాజధాని మొగదిషులో జరిగిన ఆత్మాహుతి దాడిలో 32 మంది మరణించారు. నిత్యం రద్దీగా ఉండే లీడో బీచ్ వద్ద అల్ – షబాబ్ అనే సూసైడ్ బాంబర్ ఆత్మాహుతి దాడి చేశాడు. మరికొందరు ముష్కరుల కాల్పుల్లో మరణించారు. ఈ ఘటనలో మరో 63 మందికి తీవ్రగాయాలైనట్లు సమాచారం. వారందరినీ చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా.. కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ దాడికి పాల్పడిన వారిలో నలుగురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు కాల్పులు జరిపి చంపారు. ఒకరిని పట్టుకుని జైలుకు తరలించారు. కాగా.. ఈ దాడికి కారణం తామేనని అల్ ఖైదా అనుబంధ సంస్థ ప్రకటించింది. 17సంవత్సరాలుగా అంతర్జాతీయ మద్దతుతో ఉన్న ఫెడరల్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉగ్రవాదులు తిరుగుబాటు చేస్తున్నారు.

ఆత్మాహుతి దాడితో బీచ్ వద్ద మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. అందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. పేలుడు జరిగిన వెంటనే ముష్కరులపై భద్రతా బలగాలు కాల్పులు జరపడంతో అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాలేదని ప్రత్యక్ష సాక్షి అబ్ధుల్ లతీఫ్ అలీ మీడియాకు తెలిపాడు. సమీపంలోని హోటల్ నుంచి ఈ ఘటనను చూసిన తాను.. చాలామంది తీవ్రగాయాలతో కొట్టుమిట్టాడారని, ఆ ప్రాంతమంతా భయానకంగా మారిందన్నాడు. కాగా.. గత నెలలో రాజధానిలోని ఓ కేఫ్‌లో జరిగిన కారు బాంబు పేలుడు ఘటనలో ఐదుగురు చనిపోయారు.

Related News

Kuwait Airport: ఇరాన్ మిస్సైళ్ల దాడులు.. కువైట్‌ ఎయిర్‌పోర్ట్ డ్యామేజ్, విమాన సర్వీసులు రద్దు

మరో బాంబ్‌ పేల్చిన అమెరికా.. భారత్‌పై అదనపు సుంకాలకు ప్రతిపాదన, ఏకంగా 12 శాతం

పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు.. అమెరికా స్థావరాలపై ఇరాన్ వరుస దాడులు, ఖేష్మ్ ద్వీపంపై

ఇరాన్ షాకింగ్ నిర్ణయం.. ఇకపై మాటలు-చర్చల్లేవ్, హోర్మూజ్ జలసంధి మాటేంటి?

ఇరాన్‌లో ఇంటిపోరు మొదలైందా? అధ్యక్షుడు మసూద్‌ నిర్ణయం వెనుక, అసలేం జరుగుతోంది?

రూటు మార్చిన అమెరికా.. ఇరాన్‌పై మెరుపు దాడులు, రాడార్- డ్రోన్ వ్యవస్థలు డ్యామేజ్

హోర్ముజ్ జలసంధిలో హై టెన్షన్.. ఇరాన్ సైనిక క్యాంప్‌పై అమెరికా దాడి, కవ్వింపు చర్యలు డీల్ కోసమా?

పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు.. ఇరాన్‌పై అమెరికా దాడులు.. క్షిపణి ప్రయోగ కేంద్రాలు

Big Stories

×