E-Paper
Advertisement

IBM: 3900 మంది ఉద్యోగులకు ఐబీఎం గుడ్‌బై

IBM: 3900 మంది ఉద్యోగులకు ఐబీఎం గుడ్‌బై
Advertisement

IBM: ఐటీ రంగంలో ఆర్థిక మాంద్యం ప్రకంపనలు సృష్టిస్తోంది. ప్రతి రోజూ వేలాది మంది ఉద్యోగులు రోడ్డున పడుతున్నారు. దిగ్గజ కంపెనీలు సైతం మాంద్యం దెబ్బకు తట్టుకోలేక పోతున్నాయి. ఇప్పటికే పలు మల్టీ నేషనల్ కంపెనీలు ఉద్యోగులను తొలగించగా.. మరికొన్ని కంపెనీలు కూడా ఉద్యోగులకు ఉద్వాసన పలకడానికి రెడీగా ఉన్నాయి. తాజాగా టెక్ దిగ్గజం ఐబీఎం కూడా ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటించింది.

మొత్తం ఉద్యోగుల్లో 1.5 శాతం మందిని అంటే 3900 మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపనున్నట్లు వెల్లడించింది. లక్ష్యాలు తగ్గడంతో పాటు కొన్ని అసెట్ డివెస్ట్‌మెంట్ల కారణంగా ఉద్యోగులను తొలగిస్తున్నట్లు పేర్కొంది. తొలగింపులు అన్ని విభాగాల్లో ఉంటాయని తెలిపింది. అలాగే క్లయింట్ ఫేసింగ్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ విభాగాల్లో నియామకాలు కొనసాగిస్తామని వెల్లడించింది.

Advertisement

ఇప్పటికే మాంద్యం దెబ్బకు ఖర్చులను తగ్గించుకోవడంలో భాగంగా దిగ్గజ కంపెనీలు ఉద్యోగులను తొలగించాయి. టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్, ఫేస్‌బుక్, అమెజాన్, ట్విట్టర్ వంటి కంపెనీలు ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి.

Tags

Related News

విఫలమైన సామూహిక సున్తీలు.. 43 మంది బాలురు మృతి, దక్షిణాఫ్రికాలో ఘటన

ట్రంప్‌‌కు ఊహించని షాక్‌.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ వ్యవహారం.. కొత్త ఆదేశాలకు కోర్టు బ్రేక్

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

Big Stories

Advertisement
×