E-Paper
Advertisement

IBM: 3900 మంది ఉద్యోగులకు ఐబీఎం గుడ్‌బై

IBM: 3900 మంది ఉద్యోగులకు ఐబీఎం గుడ్‌బై
Advertisement

IBM: ఐటీ రంగంలో ఆర్థిక మాంద్యం ప్రకంపనలు సృష్టిస్తోంది. ప్రతి రోజూ వేలాది మంది ఉద్యోగులు రోడ్డున పడుతున్నారు. దిగ్గజ కంపెనీలు సైతం మాంద్యం దెబ్బకు తట్టుకోలేక పోతున్నాయి. ఇప్పటికే పలు మల్టీ నేషనల్ కంపెనీలు ఉద్యోగులను తొలగించగా.. మరికొన్ని కంపెనీలు కూడా ఉద్యోగులకు ఉద్వాసన పలకడానికి రెడీగా ఉన్నాయి. తాజాగా టెక్ దిగ్గజం ఐబీఎం కూడా ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటించింది.

మొత్తం ఉద్యోగుల్లో 1.5 శాతం మందిని అంటే 3900 మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపనున్నట్లు వెల్లడించింది. లక్ష్యాలు తగ్గడంతో పాటు కొన్ని అసెట్ డివెస్ట్‌మెంట్ల కారణంగా ఉద్యోగులను తొలగిస్తున్నట్లు పేర్కొంది. తొలగింపులు అన్ని విభాగాల్లో ఉంటాయని తెలిపింది. అలాగే క్లయింట్ ఫేసింగ్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ విభాగాల్లో నియామకాలు కొనసాగిస్తామని వెల్లడించింది.

Advertisement

ఇప్పటికే మాంద్యం దెబ్బకు ఖర్చులను తగ్గించుకోవడంలో భాగంగా దిగ్గజ కంపెనీలు ఉద్యోగులను తొలగించాయి. టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్, ఫేస్‌బుక్, అమెజాన్, ట్విట్టర్ వంటి కంపెనీలు ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి.

Tags

Related News

పెరులో వరుస భూకంపాలు.. ఆరుగురు మృతి, వందలాది మంది నిరాశ్రయులు

అమెరికా స్థావరాలపై ఇరాన్ భీకర దాడులు.. ఇద్దరు అమెరికా సైనికులు మృతి, ట్రంప్‌పై ఖమేని ఘాటు వ్యాఖ్యలు

హార్మూజ్ జలసంధిలో హైటెన్షన్.. సముద్రంలో పేలిన రెండు చమురు ట్యాంకర్లు!

మెక్సికోలో భారీ భూకంపం.. ఒక్కసారిగా ఊగిపోయిన భవనాలు! సునామీ ముప్పు పొంచి ఉందా?

అమెరికా చదువులపై ట్రంప్ ‘వీసా’ దెబ్బ.. భారతీయులకు డబుల్ షాక్!

ఇరాన్‌పై అమెరికా దాడులు.. కుప్పకూలిన చాబహార్ టవర్.. భారత్‌కు కోలుకోలేని దెబ్బ!

అల్జీరియాలో భారీ అగ్నిప్రమాదం.. 11 మంది అనాథలు సజీవదహనం, 19 మందికి తీవ్ర గాయాలు

సముద్రంలో పెను విషాదం.. రోహింగ్యా శరణార్థుల పడవలు బోల్తా.. 500 మందికి పైగా మృతి!

Big Stories

Advertisement
×