E-Paper
Advertisement

Telugu student dies in US: అమెరికాలో తెలుగు స్టూడెంట్ మృతి, మింగేసిన జలపాతం..

Telugu student dies in US: అమెరికాలో తెలుగు స్టూడెంట్ మృతి, మింగేసిన జలపాతం..
Advertisement

Telugu student dies in US(World news today): అమెరికాలో తెలుగు విద్యార్థి ప్రమాదవశాత్తూ మృతి చెందాడు. ఎంఎస్ చదువుతున్న అవినాశ్ అనే విద్యార్థి సెలవు కావడంతో ఫ్యామిలీ సభ్యులతో జలపాతానికి వెళ్లాడు. ప్రమాదశాత్తూ నీటిలోపడి ప్రాణాలు కోల్పోయాడు.

అమెరికా మృతి చెందిన విద్యార్థి పేరు గద్దె సాయి సూర్య అవినాశ్. వయస్సు 26 ఏళ్లు. సొంతూరు ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం. అమెరికాలో ఉంటున్న అవినాశ్, తోబుట్టువు అక్క దగ్గరే ఉండి ఎం.ఎస్ చదువుతున్నాడు.

Advertisement

ఆదివారం సెలవు కావడంతో అక్క ఫ్యామిలీతో కలిసి న్యూయార్క్‌ సమీపంలోని అల్బానీ ప్రాంతంలో ఉన్న బార్బర్‌విల్లీ జలపాతానికి వెళ్లాడు. పొరపాటున కాలు జారి జలపాతంలో పడిపోయాడు అవినాశ్. అతడ్ని రక్షించేందుకు మరొకరు అందులోకి దూకాడు. ఈ క్రమంలో ఒకరు మృతి చెందగా మరొకర్ని రెస్క్యూ టీమ్ కాపాడింది.

ALSO READ: నెపోలియన్ గన్స్ వేలం..అత్యధిక ధరకు విక్రయం

Advertisement

అవినాశ్ మృతదేహాన్ని సొంతూరుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కొడుకు మరణించిన విషయం తెలియగానే తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఉన్నత చదువుల కోసం వెళ్లి తిరిగిరాని లోకాలకు వెళ్తాడని తాము ఊహించలేదంటూ బోరున విలపించారు. అవినాశ్ గతేడాది జనవరిలో యూఎస్ వెళ్లాడు. నెల కిందట ఇద్దరు తెలుగు విద్యార్థులు వేర్వేరు ప్రాంతాల్లో జలపాతం వద్దకు వెళ్లి మరణించిన విషయం తెల్సిందే.

Tags

Related News

విఫలమైన సామూహిక సున్తీలు.. 43 మంది బాలురు మృతి, దక్షిణాఫ్రికాలో ఘటన

ట్రంప్‌‌కు ఊహించని షాక్‌.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ వ్యవహారం.. కొత్త ఆదేశాలకు కోర్టు బ్రేక్

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

Big Stories

Advertisement
×