Indian Sailors: ఒమన్ తీరంలో దారుణం చోటు చేసుకుంది. భారతీయ సిబ్బందితో ప్రయాణిస్తున్న సెటెబె వాణిజ్య అనే నౌక పై అమెరికా బలగాలు దాడి చేసాయి. దీంతో నౌకలో ప్రయాణిస్తున్న ముగ్గురు భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోయారు. అమెరికా దాడిలో జరిగిన ఈ సంఘటన పై కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ తీవ్ర విచారం వ్యక్తం చేసారు.
నౌకలో 24 మంది సిబ్బంది..
ఒమన్ తీరంలోని గల్ఫ్ ఆఫ్ ఒమన్ ప్రాంతం అయిన స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ సమీపంలో ఈ సంఘటన జరిగింది. ఎంటీ సెట్టెబెల్లో అనే ఓ నౌక చమురుతో ప్రయాణిస్తుంది. దీనిని అమెరికా కమాండ్ మిలిటరీ, అమెరికా సెంట్రల్ కమాండ్ క్షిపణుతో కలిసి దాడి చేసింది. దాడి సమయంలో మోత్తం నౌకలో 28 మంది సిబ్బంది ఉన్నారని అధికారులు తెలిపారు. వీరిలో 24 మంది భారతీయులు, ఇద్దరు విదేశియులు ఉన్నారు. అమెరికా దాడి చేసిన సమయంలో ముగ్గురు భారతీయ నావికులు మరణిచినట్టు కేంద్ర షిప్పింగ్ మంత్రి సర్బానంద సోనోవాల్ మరియు ఫార్వర్డ్ సీమెన్స్ యూనియన్ ఆఫ్ ఇండియా’ సంస్థ తెలిపింది.
Also Read: తెలంగాణ ఆధ్యాత్మిక వైభవానికి సరికొత్త కాంతులు.. ఆలయాల అభివృద్ధికి సర్కార్ వేసిన ప్లాన్ ఇదే..!
అమెరికా ఇరాన్ దేశాల మద్య జరుగుతున్న ఉద్రిక్తతల సందర్బంగా ఇరాన్ చమురును రవాణా చేస్తున్న ఈ నౌక తమ ఆదేశాలను పాటించలేదని, అందుకే మేము ఈ నిర్ణయం తీసుకుని దాడి చేసామని అమెరికా సైన్యం తెలిపింది. ఈ దాడి మేమే చేశామని అమెరికా ప్రకటించింది.
ఒమన్ తీరంలో నౌకపై అమెరికా దాడి.. AI VIDEO
ఒమన్ తీరంలో భారతీయ సిబ్బందితో ప్రయాణిస్తున్న 'సెటెబె' వాణిజ్య నౌకపై అమెరికా జరిపిన దాడిలో ముగ్గురు భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ ధృవీకరించారు.… https://t.co/GtXO79NoH5 pic.twitter.com/jq0GJ2PMzc
— BIG TV Breaking News (@bigtvtelugu) June 11, 2026
Also read: ఫ్రీజర్లో ఐస్ పేరుకుపోతోందా? కంప్రెసర్ పేలిపోతుంది జాగ్రత్త !