Trump Tariffs: ఏదో విధంగా తమ దేశ ఖనాజాను నింపుకునే ప్రయత్నం చేస్తున్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. తాజాగా వెట్టి చాకిరీ పేరుతో భారత్ సహా 60 దేశాల నుంచి వచ్చే దిగుమతులపై కొత్త సుంకాలను విధిస్తున్నట్లు ప్రకటన చేశారు. కొత్త టారిఫ్లు 10 శాతం నుంచి 12.5 శాతం వరకు ఉండనున్నాయి. దాని ప్రభావం భారత్ పై ఎంతమేరా చూపనుంది.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కొత్త నిర్ణయం తీసుకున్నారు. వెట్టి చాకిరీతో తయారు చేసిన వస్తువుల దిగుమతులపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయా హక్కులు ఉల్లంఘన కింద భారత్తోపాటు 60 దేశాల నుంచి వచ్చే దిగుమతులపై 10 శాతం నుంచి 12.5 శాతం వరకు కొత్త సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు.
గతంలో విధించిన 10 శాతం గ్లోబల్ టారిఫ్ల గడువు శుక్రవారంతో ముగియనుంది. దీంతో ట్రేడ్ యాక్ట్ 1974 లోని సెక్షన్- 301 ప్రకారం కొత్త సుంకాలను అమల్లోకి తెచ్చారు. తొలుత భారత్పై 12.5 శాతం టారిఫ్ విధించాలని ప్రతిపాదన వచ్చింది. వెట్టి చాకిరీ నిరోధక చట్టాలను భారత్ వేగంగా అమలు చేయడంతో పన్ను 10 శాతానికి తగ్గించారు.
ట్రంప్ విధించిన కొత్త పన్నుల పరిధిలోకి భారత్, చైనా, యూరోపియన్ యూనియన్ సహా పలు దేశాలు వచ్చాయి. చట్టబద్ధంగా వెట్టిచాకిరీ నిరోధక చట్టాలను కఠినంగా అమలు చేస్తున్న- అమెరికాతో వాణిజ్య ఒప్పందాలు చేసుకున్న కెనడా, బ్రిటన్, ఈయూ, భారత్ వంటి దేశాలకు 10 శాతం సుంకం విధిస్తున్నట్లు యూఎస్ అధికారులు తెలిపారు.
అదే సమయంలో వెట్టిచారికి నిరోధించే చట్టాలను కఠినంగా అమలు చేయలేని యూరోపియన్ యూనియన్, జపాన్, దక్షిణ కొరియా, తైవాన్, స్విట్జర్లాండ్ నుండి వచ్చే కొన్ని ఉత్పత్తులపై 10 నుంచి 12.5 శాతం వరకు సుంకం విధించబడుతుంది. ప్రత్యేక సుంకాలు ఎదుర్కొంటున్న ఉక్కు, అల్యూమినియం వంటి రంగాలకు మినహాయింపు లభించినట్లయ్యింది.
అర్జెంటీనా, బంగ్లాదేశ్, బ్రిటన్, కంబోడియా, కెనడా, ఈక్వెడార్, ఎల్ సాల్వడార్, గ్వాటెమాలా, హోండురాస్, ఇండియా, ఇండోనేషియా, జోర్డాన్, మలేషియా, మెక్సికో, పాకిస్తాన్, శ్రీలంక, ట్రినిడాడ్, టొబాగో నుంచి అమెరికాకు దిగుమతి అయ్యే వస్తువులపై 10 శాతం సుంకం విధించబడుతుంది. చమురు, గ్యాస్, ఎరువులు, కొన్ని ఆహార పదార్థాలు, ఉక్కు, అల్యూమినియం, రాగి, ఆటోమొబైల్స్, యుఎస్-మెక్సికో-కెనడా ఒప్పందం కింద ఉత్పత్తులకు కొత్త సుంకాల నుండి మినహాయింపు ఉంది.