White House: అమెరికాలో ఏం జరుగుతోంది? ఇటీవల వైట్హౌస్ చుట్టూ కాల్పుల ఘటనలు చోటు చేసుకుంటున్నాయి? తాజాగా వైట్హౌస్ కాల్పుల ఘటన వెనుక ఏం జరిగింది? దీని వెనుక ఎవరి హస్తముంది? అధ్యక్షుడు ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సేఫ్గా బయటపడ్డారా? వారిని సురక్షిత ప్రాంతానికి తరలించినట్టు ఆదేశ మీడియా వెల్లడించింది.
వైట్హౌస్లో కాల్పుల కలకలం
ఇటీవల అమెరికాలో ఊహించని ఘటనలు జరుగుతున్నాయి. ముఖ్యంగా అధ్యక్షుడు ట్రంప్ను టార్గెట్ చేస్తూ రకరకాల ఘటనలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. వైట్హౌస్లో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై హత్యాయత్నం జరిగింది. ఈ ఘటనలో అధ్యక్షుడు ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్కు తృటిలో తప్పించుకున్నారు.
వెంటనే అలర్టయిన సెక్యూరిటీ విభాగం ట్రంప్ సహా కీలక నేతలను సురక్షిత ప్రాంతానికి తరలించారు. వైట్హౌస్లో కరస్పాండెంట్స్ విందు కార్యక్రమం ఏర్పాటు చేశారు అధ్యక్షుడు ట్రంప్. ఈవెంట్కు అధ్యక్షుడు ట్రంప్, ఆయన భార్య మెలానియా, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సహా కీలక నేతలు హాజరయ్యారు. డిన్నర్ మీటింగ్ జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా కాల్పులు మోత మోగింది.
మీడియా మిత్రులకు డిన్నర్ ఈవెంట్, సురక్షిత ప్రాంతానికి ట్రంప్ తరలింపు
వెంటనే స్పందించిన సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు.. అధ్యక్షుడు ట్రంప్, ఆయన భార్య మెలానియా, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్తోపాటు కీలక నేతలను అక్కడి నుంచి సురక్షిత ప్రాంతానికి తరలించారు. కాల్పుల సమయంలో చాలామంది అతిథులు తమ ప్రాణాలను కాపాడుకునేందుకు టేబుళ్ల కింద దాక్కున్నారు. ఏం జరుగుతుందో తెలియక ప్రాణ భయంతో వణికిపోయారు.
అక్కడి నుంచి బయటపడితే చాలని కోరుకున్నారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలుపాలైనట్లు ఎలాంటి నివేదికలు రాలేదు. ఈ సమావేశానికి దాదాపు 2,600 మంది హాజరైనట్టు తెలుస్తోంది. చాలామంది తలదాచుకోగా, వెయిటర్లు భోజనశాల ముందు భాగానికి పారిపోయారు. ఈ ఘటనకు సంబంధించి ఓ వ్యక్తిని సీక్రెట్ సర్వీస్ అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
ALSO READ: H-1B వీసాలపై 3 ఏళ్ల పాటు నిషేధం.. యూస్ కాంగ్రెస్ లో బిల్లు
ట్రంప్ సురక్షిత ప్రదేశంలో సేఫ్గా ఉన్నారని మీడియా వర్గాలు తెలిపాయి. ఈ ప్రాంతాన్ని విడిచి వెళ్లమని అధికారులు కోరడంతో తాను వైట్ హౌస్కు తిరిగి వెళ్తున్నట్లు అధ్యక్షుడు తెలిపారు. కాల్పులు ఘటన సమయంలో కొన్ని అడుగుల దూరంలో ట్రంప్ ఉన్నట్లు ప్రత్యక్షసాక్షి చెబుతున్నారు.
గడిచిన రెండువారాల కిందట వైట్హౌస్ సమీపంలోని పార్కులో కాల్పులు చోటు చేసుకున్న విషయం తెల్సిందే. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఇంతలోనే అధ్యక్షుడు ట్రంప్ హాజరైన ఈవెంట్లో ఈ విధంగా జరగడంతో అధికారులు ఉలిక్కిపడ్డారు. మరోవైపు కాల్పుల ఘటనపై ట్రంప్ స్పందించారు. భద్రతా సిబ్బంది అద్భుతంగా పని చేశారన్నారు.
కాల్పులు జరిపిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారని వెల్లడించారు. తనపై దాడి జరగడం ఇది తొలిసారి కాదని, గతంలో పెన్సిల్వేనియాలో తనపై దాడికి యత్నించారని అన్నారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకూడదన్నారు. ప్రస్తుతం కాల్పులకు పాల్పడిన వ్యక్తి కాలిఫోర్నియాకు చెందినవాడు. తనతోపాటు మెలానియా, జేడీ వాన్స్ కేబినెట్ సభ్యులంతా క్షేమమని తెలిపారు. నెల రోజుల్లో డిన్నర్ మీట్ రీషెడ్యూల్ చేస్తామన్నారు.
వాషింగ్టన్ హిల్టన్ బాల్రూమ్లో జరిగిన వైట్ హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్లో కాల్పుల శబ్దం కలకలం రేపింది. ఒక్కసారిగా గందరగోళం చెలరేగడంతో భద్రతా దళాలు వెంటనే అప్రమత్తమై ప్రెసిడెంట్ ట్రంప్ దంపతులను సురక్షిత ప్రాంతానికి తరలించాయి. అక్కడ ఉన్న సెలబ్రిటీలు, జర్నలిస్టులు భయంతో టేబుళ్ల… pic.twitter.com/WowV3x03UT
— ChotaNews App (@ChotaNewsApp) April 26, 2026