E-Paper
Advertisement

Twitter: మస్క్ షాకింగ్ నిర్ణయం.. భారత్‌లో ట్విట్టర్ ఆఫీస్‌లు క్లోజ్

Twitter: మస్క్ షాకింగ్ నిర్ణయం.. భారత్‌లో ట్విట్టర్ ఆఫీస్‌లు క్లోజ్
Advertisement

Twitter: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ట్విట్టర్‌ను కొనుగోలు చేశాక ఆ సంస్థ ఆదాయం గణనీయంగా తగ్గిపోయింది. వాణిజ్య ప్రకటనలు తగ్గిపోవడంతో సంస్థ నష్టాల్లోకి జారుకుంది. ఈక్రమంలో ట్విట్టర్‌ను నష్టాల నుంచి గట్టెక్కించేందుకు మస్క్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాడు. కొత్త కొత్త ప్లాన్‌లను అమలు చేస్తున్నాడు.

ఇప్పటికే ట్విట్టర్‌లోని 50 శాతం మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపాడు. అలాగే కొత్తగా ట్విట్టర్ బ్లూ సబ్‌స్క్రిప్షన్‌ను తీసుకొచ్చాడు. ట్విట్టర్‌కు సంబంధించిన అనేక విలువైన ఆస్తులను వేలం వేశాడు. భారత్‌లో ఉన్న తమ ఉద్యోగుల్లో దాదాపు 90 శాతం మందిని తొలగించాడు.

Advertisement

ఈక్రమంలో ఉద్యోగుల సంఖ్య తగ్గిపోవడంతో భారత్‌లో ఉన్న మూడు ఆఫీసుల్లో రెండింటిని మూసివేసినట్లు తెలుస్తోంది. ఢిల్లీ, ముంబైలో ఉన్న ఆఫీసులను మూసి వేసి అందులో పనిచేస్తున్న సిబ్బందికి శాశ్వతంగా వర్క్ ఫ్రమ్ హోం ఇచ్చినట్లు సమాచారం. అలాగే బెంగళూరులో ఉన్న ఆఫీసులో మాత్రం యాదావిధిగా సేవలు కొనసాగుతున్నాయని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.

Related News

హౌతీలు ప్రకటన.. బాబ్‌ ఎల్‌-మాండెబ్‌ జలసంధి మూసివేత, ప్రపంచ దేశాల్లో గుబులు

పశ్చిమాసియాలో యుద్ధ భేరి.. ఇరాన్‌పై విరుచుకుపడ్డ అమెరికా.. హర్మూజ్ జలసంధిలో తీవ్ర ఉద్రిక్తత!

ఆకస్మిక వరదల్లో కొట్టుకుపోయిన అఫ్గానిస్తాన్‌.. 20 మంది మృతి, 100 మంది గల్లంతు

అయ్యబాబోయ్.. ‘సైకిల్ అంబులెన్స్’ అంట.. నెట్టింట మళ్లీ జోకర్ అయిన పాక్!

పెరులో వరుస భూకంపాలు.. ఆరుగురు మృతి, వందలాది మంది నిరాశ్రయులు

అమెరికా స్థావరాలపై ఇరాన్ భీకర దాడులు.. ఇద్దరు అమెరికా సైనికులు మృతి, ట్రంప్‌పై ఖమేని ఘాటు వ్యాఖ్యలు

హార్మూజ్ జలసంధిలో హైటెన్షన్.. సముద్రంలో పేలిన రెండు చమురు ట్యాంకర్లు!

మెక్సికోలో భారీ భూకంపం.. ఒక్కసారిగా ఊగిపోయిన భవనాలు! సునామీ ముప్పు పొంచి ఉందా?

Big Stories

Advertisement
×