E-Paper
Advertisement

US Mass Shooting : అగ్రరాజ్యంలో కాల్పులు.. 22 మంది మృతి

US Mass Shooting : అగ్రరాజ్యంలో కాల్పులు.. 22 మంది మృతి

US Mass Shooting : అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి గన్‌ గర్జించింది. మైనే స్టేట్‌లోని లూయిస్టన్ నగరం కాల్పులతో దద్దరిల్లింది. రెండు ప్రాంతాల్లో జరిగిన కాల్పుల్లో కనీసం 22 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 60 మందికిపైగా గాయపడ్డారు. బార్ బౌలింగ్ అల్లే, వాల్‌మార్ట్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లలో తెల్లవారుజామున కాల్పులు జరిగాయి. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని.. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

కాల్పులు జరిపిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. సెమీ ఆటోమేటిక్ రైఫిల్‌తో కనిపించిన అనుమానితుడి ఫోటోలను పోలీసులు విడుదల చేశారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని.. దయచేసి ఎవరూ ఇంటి నుంచి బయటకు రావొద్దని పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

గతేడాది మే తర్వాత అమెరికాలో జరిగిన అత్యంత ఘోరమైన కాల్పుల ఘటన ఇదే. మే 2022లో టెక్సాస్ లోని ఒక స్కూల్‌లో ముష్కరుడు జరిపిన కాల్పుల్లో 19 మంది పిల్లలు, ఇద్దరు టీచర్లు మృతి చెందారు.

https://twitter.com/brokenDoor09/status/1717359574871892386

Related News

అమీర్‌పేటలోని షాపింగ్ కాంప్లెక్స్‌లో అగ్ని ప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు!

కూకట్‌పల్లిలో దారుణం.. భార్యను చంపి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన భర్త!

ఏపీలో దారుణం.. వీడియోలు తీస్తూ మ‌హిళ‌పై అత్యాచారం

అరుణాచలం గిరిప్రదక్షిణ దారిలో ఘోరం..ఇద్దరు యువతులపై గ్యాంగ్‌రే*ప్

గంజాయి డాన్‌గా మారిన సస్పెండెడ్ కానిస్టేబుల్.. రూ.79 లక్షల డ్రగ్స్ సీజ్!

ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి? మృతులు పెరిగే అవకాశం, పేషెంట్ల బంధువుల్లో టెన్షన్

అనంతపురంలో ఘరానా మోసం.. స్టాక్ మార్కెట్ పేరుతో రూ.25 కోట్లు స్కామ్!

ఢిల్లీ రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. 21 మంది మృతి

Big Stories

×