BigTV English

US Mass Shooting : అగ్రరాజ్యంలో కాల్పులు.. 22 మంది మృతి

US Mass Shooting : అగ్రరాజ్యంలో కాల్పులు.. 22 మంది మృతి

US Mass Shooting : అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి గన్‌ గర్జించింది. మైనే స్టేట్‌లోని లూయిస్టన్ నగరం కాల్పులతో దద్దరిల్లింది. రెండు ప్రాంతాల్లో జరిగిన కాల్పుల్లో కనీసం 22 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 60 మందికిపైగా గాయపడ్డారు. బార్ బౌలింగ్ అల్లే, వాల్‌మార్ట్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లలో తెల్లవారుజామున కాల్పులు జరిగాయి. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని.. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.


కాల్పులు జరిపిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. సెమీ ఆటోమేటిక్ రైఫిల్‌తో కనిపించిన అనుమానితుడి ఫోటోలను పోలీసులు విడుదల చేశారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని.. దయచేసి ఎవరూ ఇంటి నుంచి బయటకు రావొద్దని పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

గతేడాది మే తర్వాత అమెరికాలో జరిగిన అత్యంత ఘోరమైన కాల్పుల ఘటన ఇదే. మే 2022లో టెక్సాస్ లోని ఒక స్కూల్‌లో ముష్కరుడు జరిపిన కాల్పుల్లో 19 మంది పిల్లలు, ఇద్దరు టీచర్లు మృతి చెందారు.


https://twitter.com/brokenDoor09/status/1717359574871892386

Related News

Electric Shock: దారుణం.. హైదరాబాద్‌లో కరెంట్ షాక్‌తో మరో వ్యక్తి దుర్మరణం..

Greater Noida: భార్యని సజీవ దహనం చేసిన భర్త.. తల్లిదండ్రులతో కలిసి ఘాతుకం, ఎక్కడ?

Medchal News: గర్భవతి భార్యని చంపిన భర్త.. శరీరాన్ని ముక్కలు చేసి మూసీలో, మేడ్చల్‌ జిల్లా దారుణం

Cyber fraud: 2 నెలల్లో 500 కోట్లు.. ఇదేం మోసం.. ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు!

Sahasra Murder Case: మా బిడ్డను హత్య చేసినట్టే వాడిని చంపేయాలి.. పీఎస్ ముందు కుటుంబ సభ్యుల నిరసన

Sahasra Murder: సహస్ర హత్య కేసులో సంచలన విషయాలు.. క్రికెట్ బ్యాట్ కోసమే ఇదంతా..?

Big Stories

×