US Mass Shooting : అగ్రరాజ్యంలో కాల్పులు.. 22 మంది మృతి

US Mass Shooting : అగ్రరాజ్యంలో కాల్పులు.. 22 మంది మృతి

Share this post with your friends

US Mass Shooting : అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి గన్‌ గర్జించింది. మైనే స్టేట్‌లోని లూయిస్టన్ నగరం కాల్పులతో దద్దరిల్లింది. రెండు ప్రాంతాల్లో జరిగిన కాల్పుల్లో కనీసం 22 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 60 మందికిపైగా గాయపడ్డారు. బార్ బౌలింగ్ అల్లే, వాల్‌మార్ట్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లలో తెల్లవారుజామున కాల్పులు జరిగాయి. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని.. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

కాల్పులు జరిపిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. సెమీ ఆటోమేటిక్ రైఫిల్‌తో కనిపించిన అనుమానితుడి ఫోటోలను పోలీసులు విడుదల చేశారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని.. దయచేసి ఎవరూ ఇంటి నుంచి బయటకు రావొద్దని పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

గతేడాది మే తర్వాత అమెరికాలో జరిగిన అత్యంత ఘోరమైన కాల్పుల ఘటన ఇదే. మే 2022లో టెక్సాస్ లోని ఒక స్కూల్‌లో ముష్కరుడు జరిపిన కాల్పుల్లో 19 మంది పిల్లలు, ఇద్దరు టీచర్లు మృతి చెందారు.


Share this post with your friends

ఇవి కూడా చదవండి

Ugadi Day :ఉగాది రోజున ఏం చేయాలి?

Bigtv Digital

Rajamouli Comments : ‘కాంతార’ సక్సెస్‌పై రాజ‌మౌళి కామెంట్స్‌

BigTv Desk

PM Modi: ఒకే దేశం-ఒకే చట్టం.. ఉమ్మడి పౌర స్మృతిపై విస్తృత కసరత్తు..

Bigtv Digital

Tirumala Temple Secrets: తిరుమల శ్రీవారి గర్భాలయంలో రహస్యాలు

Bigtv Digital

Adani Stocks: అదానీకి బిగ్ రిలీఫ్.. ఎక్స్‌పర్ట్స్ కమిటీ రిపోర్ట్..

Bigtv Digital

Indian Navy: టార్పిడో టెస్ట్ సక్సెస్.. సముద్రంలో చైనాకు చెక్!

Bigtv Digital

Leave a Comment