E-Paper
Advertisement

US Mass Shooting : అగ్రరాజ్యంలో కాల్పులు.. 22 మంది మృతి

US Mass Shooting : అగ్రరాజ్యంలో కాల్పులు.. 22 మంది మృతి
Advertisement

US Mass Shooting : అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి గన్‌ గర్జించింది. మైనే స్టేట్‌లోని లూయిస్టన్ నగరం కాల్పులతో దద్దరిల్లింది. రెండు ప్రాంతాల్లో జరిగిన కాల్పుల్లో కనీసం 22 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 60 మందికిపైగా గాయపడ్డారు. బార్ బౌలింగ్ అల్లే, వాల్‌మార్ట్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లలో తెల్లవారుజామున కాల్పులు జరిగాయి. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని.. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

కాల్పులు జరిపిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. సెమీ ఆటోమేటిక్ రైఫిల్‌తో కనిపించిన అనుమానితుడి ఫోటోలను పోలీసులు విడుదల చేశారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని.. దయచేసి ఎవరూ ఇంటి నుంచి బయటకు రావొద్దని పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Advertisement

గతేడాది మే తర్వాత అమెరికాలో జరిగిన అత్యంత ఘోరమైన కాల్పుల ఘటన ఇదే. మే 2022లో టెక్సాస్ లోని ఒక స్కూల్‌లో ముష్కరుడు జరిపిన కాల్పుల్లో 19 మంది పిల్లలు, ఇద్దరు టీచర్లు మృతి చెందారు.

https://twitter.com/brokenDoor09/status/1717359574871892386

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×