ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిరుద్యోగులకు ఇది సువర్ణవకాశం. ఆంధ్రప్రదేశ్లోని ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజైంది. ఆసక్తి గల అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ నుంచి కెరీర్ & మెంటల్ హెల్త్ కౌన్సిలర్ల పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేశారు. ఎలాంటి రాత పరీక్ష, ఫీజు లేకుండా కాంట్రాక్టు పద్దతిలో పని చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు.
మొత్తం ఉద్యోగాల సంఖ్య: 255
వయస్సు: 18 నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.
విద్యార్హత: సైకాలజీలో డిగ్రీ /MA/MSC చేసినవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. వర్క్ ఎక్స్ పీరియన్స్ పరిగణలోకి తీసుకుంటారు.
దరఖాస్తు చివరి తేది: 2025 జనవరి 10 లోపు దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు విధానం: ఆన్ లైన్ లో ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాల్సి వస్తుంది.
వేతనం: ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.30,000 చెల్లిస్తారు. అలవెన్సులు ఏమీ ఉండవు.
దరఖాస్తు ఫీజు: ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఇంటర్వ్యూ ఆధారంగానే ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.
అఫీషియల్ వెబ్ సైట్: https://www.edcilindia.co.in/TCareers
Also Read: AP High Court Jobs: గుడ్ న్యూస్.. ఎలాంటి ఫీజు, రాతపరీక్ష లేకుండా జాబ్స్.. మిస్ అవ్వొద్దు..!
అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు వెంటనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోండి. ఉద్యోగం సాధింండి ఆల్ ది బెస్ట్.