E-Paper
Advertisement

AP Inter Exam Changes: ఏపీ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. పరీక్ష విధానంలో కీలక మార్పులు

AP Inter Exam Changes: ఏపీ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. పరీక్ష విధానంలో కీలక మార్పులు

AP Inter Exam Changes: ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు ఇంటర్ ఫస్టియర్ పరీక్షా విధానంలో భారీ మార్పులు చేసింది. పబ్లిక్ పరీక్షల్లో మొత్తం పేపర్లను ఐదుకి తగ్గించింది. గతంలో ఆరు పేపర్లు ఉండగా… ఈ విద్యా సంవత్సరం నుంచి గణితం-1A, 1Bలను ఒకే పేపర్లో 100 మార్కులకు ఇస్తారు. భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రం పేపర్లు ఇకపై 85 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. జువాలజీ, బోటనీ పేపర్లు కూడా 85 మార్కులకు ఇస్తారు.

గత పరీక్ష విధానంలో మార్కులు

మొత్తం 6 సబ్జెక్టులు

  1. ఇంగ్లీష్-100
  2. లాంగ్వేజ్-100
  3. గణతం 1A -75
  4. గణితం 1B-75
  5. ఫిజిక్స్-60
  6. కెమిస్ట్రీ -60
  7. బోటనీ-60
  8. జువాలజీ-60

కొత్త విధానంలో మార్కులు

మొత్తం 5 సబ్జెక్టులు మాత్రమే

  1. ఇంగ్లీ-100 మార్కులు
  2. లాంగ్వేజ్-100 మార్కులు
  3. గణితం-100 మార్కులు
  4. ఫిజిక్స్-85 మార్కులు
  5. కెమిస్ట్రీ-85 మార్కులు
  6. బయోలజీ(బోటనీ+ జువాలజీ)-85 మార్కులు
  • ఎంపీసీ 470 మార్కులు
  • బైపీసీ 455 మార్కులు

ప్రాక్టికల్స్

ఇంటర్ సెకండియర్ లో 30 మార్కులకు ప్రాక్టికల్స్ ఉంటాయి.

ఒక్కో పరీక్షలు రెండు రోజుల గ్యాప్

వచ్చే ఏడాది ఫిబ్రవరి 23 నుంచి మార్చి 24 వరకు ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ పరీక్షలు జరగనున్నాయి. ఈ క్రమంలో ఇంటర్‌ బోర్డు జాతీ­య విద్యా విధానం–2020కి అనుగుణంగా ప్రథమ సంవత్సరంలో సీబీ­­ఎస్‌ఈ విధానాన్ని అమలు చేస్తుంది. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, హిస్టరీ, ఎకనామిక్స్, కామర్స్, సివిక్స్‌ సిలబస్‌లో మార్పులు చేశారు. ఈ సబ్జెక్టుల్లో ప్రతి పేపర్‌ 100 మార్కులకు నిర్వహించనున్నారు. అలాగే ఒక్క మార్కు ప్రశ్నల విధానం అమలు చేయనున్నారు. ఆన్సర్ బుక్‌లెట్‌ను 32 పేజీలకు పెంచారు. ఒక్కో పరీక్షకు రెండు రోజుల వ్యవధి ఉండేలా టైమ్ టేబుల్ రూపొందించారు.

Also Read: RBI Internship 2026: ఆర్బీఐ సమ్మర్ ఇంటర్న్ షిప్.. నెలకు రూ.20 వేలు.. దరఖాస్తుకు రేపే లాస్ట్

పాత పద్ధతిలోనే రెండో సంవత్సరం పరీక్షలు

అయితే సెకండియర్ పరీక్షలు మాత్రం ఈ ఏడాదికి పాత విధానంలోనే నిర్వహించనున్నారు. ప్రస్తుతం ఇంటర్ సైన్స్‌ గ్రూపుల్లో రెండు లాంగ్వేజ్ లు, నాలుగు మెయిన్‌ సబ్జెక్టులతో మొత్తం 6 పేపర్లకు పరీక్షలు నిర్వహించేవారు. ఆర్ట్స్‌ గ్రూపుల్లో రెండు లాంగ్వేజ్ లు, మూడు మెయిన్‌ సబ్జెక్టులతో కలిపి మొత్తం 5 పేపర్లు ఉన్నాయి. ఈ విద్యా సంవత్సరంలో ఫస్టియర్ అన్ని గ్రూప్ లలో 5 సబ్జెక్టుల విధానం అమల్లోకి తెచ్చారు. ఒక లాంగ్వేజ్, 4 మెయిన్‌ సబ్జెక్టులు అలాగే ఇంగ్లిష్‌ తప్పనిసరి చేశారు.

Related News

టాప్ కంపెనీల్లో ప్లేస్‌మెంట్స్.. ICFAI హైదరాబాద్ 2026 అడ్మిషన్ల నోటిఫికేషన్ విడుదల

NEET Exam: నీట్ రీఎగ్జామ్ వ్యవహారం.. సుప్రీంకోర్టు కీలక తీర్పు

సీబీఎస్ఈ ఇంటర్‌లో ఆన్-స్క్రీన్ మార్కింగ్ వివాదం.. ఆ బాధ్యత నాదే-మంత్రి ధర్మేంద్ర ప్రధాన్

సీబీఎస్ఈ ఇంటర్ రీవాల్యుయేషన్‌.. 4 లక్షల మంది విద్యార్థులు అప్లై.. ఒకరి పేపర్లు మరొకరి, పేరెంట్స్ షాక్

ఇంటర్ విద్యార్థులకు అదిరిపోయే బ్రేక్‌ఫాస్ట్.. ఇడ్లీ మొదలు, జూన్ 12 నుంచి అమలు

AP EDCET 2026 Result: ఏపీ ఎడ్‌సెట్‌-2026 ఫలితాలు.. 99.3 శాతం ఉత్తీర్ణత, వారికి మంత్రి అభినందనలు

తెలంగాణలో ఎప్‌సెట్‌ ఫలితాలు-2026, కేవలం వారం రోజుల్లో, టాపర్స్ వీళ్లే

ఐఐటీ చేరేందుకు మరో పరీక్ష.. జేఈఈ అడ్వాన్సుడ్ నేడు, కొత్త మార్గదర్శకాలు

Big Stories

×