AP Inter Exam Changes: ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు ఇంటర్ ఫస్టియర్ పరీక్షా విధానంలో భారీ మార్పులు చేసింది. పబ్లిక్ పరీక్షల్లో మొత్తం పేపర్లను ఐదుకి తగ్గించింది. గతంలో ఆరు పేపర్లు ఉండగా… ఈ విద్యా సంవత్సరం నుంచి గణితం-1A, 1Bలను ఒకే పేపర్లో 100 మార్కులకు ఇస్తారు. భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రం పేపర్లు ఇకపై 85 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. జువాలజీ, బోటనీ పేపర్లు కూడా 85 మార్కులకు ఇస్తారు.
మొత్తం 6 సబ్జెక్టులు
మొత్తం 5 సబ్జెక్టులు మాత్రమే
ఇంటర్ సెకండియర్ లో 30 మార్కులకు ప్రాక్టికల్స్ ఉంటాయి.
వచ్చే ఏడాది ఫిబ్రవరి 23 నుంచి మార్చి 24 వరకు ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ పరీక్షలు జరగనున్నాయి. ఈ క్రమంలో ఇంటర్ బోర్డు జాతీయ విద్యా విధానం–2020కి అనుగుణంగా ప్రథమ సంవత్సరంలో సీబీఎస్ఈ విధానాన్ని అమలు చేస్తుంది. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, హిస్టరీ, ఎకనామిక్స్, కామర్స్, సివిక్స్ సిలబస్లో మార్పులు చేశారు. ఈ సబ్జెక్టుల్లో ప్రతి పేపర్ 100 మార్కులకు నిర్వహించనున్నారు. అలాగే ఒక్క మార్కు ప్రశ్నల విధానం అమలు చేయనున్నారు. ఆన్సర్ బుక్లెట్ను 32 పేజీలకు పెంచారు. ఒక్కో పరీక్షకు రెండు రోజుల వ్యవధి ఉండేలా టైమ్ టేబుల్ రూపొందించారు.
అయితే సెకండియర్ పరీక్షలు మాత్రం ఈ ఏడాదికి పాత విధానంలోనే నిర్వహించనున్నారు. ప్రస్తుతం ఇంటర్ సైన్స్ గ్రూపుల్లో రెండు లాంగ్వేజ్ లు, నాలుగు మెయిన్ సబ్జెక్టులతో మొత్తం 6 పేపర్లకు పరీక్షలు నిర్వహించేవారు. ఆర్ట్స్ గ్రూపుల్లో రెండు లాంగ్వేజ్ లు, మూడు మెయిన్ సబ్జెక్టులతో కలిపి మొత్తం 5 పేపర్లు ఉన్నాయి. ఈ విద్యా సంవత్సరంలో ఫస్టియర్ అన్ని గ్రూప్ లలో 5 సబ్జెక్టుల విధానం అమల్లోకి తెచ్చారు. ఒక లాంగ్వేజ్, 4 మెయిన్ సబ్జెక్టులు అలాగే ఇంగ్లిష్ తప్పనిసరి చేశారు.