E-Paper
Advertisement

Pawan Kalyan: గంటల వ్యవధిలోనే ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్

Pawan Kalyan: గంటల వ్యవధిలోనే ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్
Advertisement

టీ20 ప్రపంచకప్‌ను సాధించిన భారత అంధుల మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ దీపిక తమ విజయంపై హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచకప్ సాధించడం తమకెంతో ఆనందాన్ని ఇచ్చిందని, తమ విజయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రశంసించడం జట్టుకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చిందని ఆమె పేర్కొన్నారు.

అంతేకాకుండా, ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి (డిప్యూటీ సీఎం) పవన్ కళ్యాణ్ తమ జట్టు సభ్యులందరికీ అండగా నిలబడి, ఆర్థిక చేయూత అందించారని దీపిక తెలిపారు. తమ జట్టుకు మెరుగైన వసతులు, సౌకర్యాలు కల్పిస్తే భవిష్యత్తులో భారత జట్టుకు మరిన్ని అంతర్జాతీయ విజయాలు అందిస్తామని దీపిక విశ్వాసం వ్యక్తం చేశారు.

Advertisement

ఈ విజయవంతమైన జట్టులో అల్లూరి జిల్లాకు చెందిన యువ క్రీడాకారిణి పాంగి కరుణ కుమారి కూడా సభ్యురాలుగా ఉన్నారు. అల్లూరి జిల్లాలోని వంట్లమామిడి గ్రామానికి చెందిన కరుణ కుమారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అండగా నిలిచారు. జట్టు విజయం సాధించిన వెంటనే.. కెప్టెన్ దీపికతో పాటు కరుణ కుమారికి మరియు జట్టు సభ్యులందరికీ ఆయన ఆర్థిక చేయూత అందించారు.

పాడేరు మండలానికి చెందిన అంధ క్రికెటర్ కరుణ కుమారికి ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఐదు లక్షల రూపాయల నగదు కూడా అందజేశారు. దీనికి కొనసాగింపుగా.. ఆదివారం రోజున కరుణ కుమారి కుటుంబానికి కావాల్సిన సహాయాన్ని అందించాలని పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ నాయకులను ఆదేశించారు. డిప్యూటీ సీఎం ఆదేశాల మేరకు.. కేవలం 24 గంటల్లోనే జనసేన నాయకులు కరుణ కుమారి ఇంటికి కావాల్సిన నిత్యావసర సరుకులు, ఇతర పరికరాలను అందజేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు.

Advertisement

ప్రపంచకప్ విజేత క్రీడాకారిణిని స్వయంగా అభినందించి.. ఆమెకు, ఆమె కుటుంబానికి అండగా నిలబడటం పట్ల పవన్ కళ్యాణ్ చేసిన ఈ సహాయం సర్వత్రా ప్రశంసలు అందుకుంటోంది. దేశానికి గర్వకారణంగా నిలిచిన క్రీడాకారులకు ప్రభుత్వ మరియు ప్రముఖుల మద్దతు ఇలాగే కొనసాగాలని క్రీడాభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

Related News

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

Big Stories

Advertisement
×