APPSC JOBS: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ(ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్) గుడ్ న్యూస్ చెప్పింది. 8 నోటిఫికేషన్లకు సంబంధించి ఏప్రిల్ లో పరీక్షలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఆన్ లైన్ విధానంలో ఏప్రిల్ 27 నుంచి 30 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.
అసిస్టెంట్ డైరెక్టర్, లైబ్రేరియన్ పోస్టులకు, అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్, అసిస్టెంట్ కెమిస్ట్ , అసిస్టెంట్ ఎలిక్ట్రికల్ ఇన్స్పెక్టర్, ఏఎస్వో, ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్ పోస్టులకు పరీక్షలను నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేసింది. గత వైసీపీ ప్రభుత్వంలో ఇచ్చిన కొన్ని నోటిఫికేషన్లతో పాటు టీడీపీ-జనసేన-బీజేపీ(కూటమి) ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఇచ్చిన నోటిఫికేషన్లకు కలుపుకుని వాటికి సంబంధించిన పరీక్షలను ఏప్రిల్లో నిర్వహిస్తున్నట్లు ఏపీపీఎస్సీ వెల్లడించింది.
Also Read: APCOB Bank Recruitment: భారీగా ఉద్యోగాలు.. ఈ జాబ్ వస్తే లైఫ్ సెట్.. ఇదిగో లాస్ట్ డేట్..!
పూర్తి వివరాలను అఫీషియల్ వెబ్ సైట్లో చూడండి..
అఫీషియల్ వెబ్ సైట్: https://portal-psc.ap.gov.in