నిరుద్యోగ అభ్యర్థులకు భారీ గుడ్ న్యూస్. ముంబయిలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాల కోసం ఆసక్తి గల అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రధానంగా ఫ్యాకల్టీ, అటెండర్, వాచ్మ్యాన్ లేదా గార్డెనర్ విభాగాల్లో ఈ నియామకాలు జరుగుతున్నాయి. నిరుద్యోగులకు ఇది ఒక మంచి అవకాశంగా చెప్పవచ్చు.
వెకెన్సీ వివరాలు:
ఫ్యాకల్టీ
అటెండర్
వాచ్ మ్యాన్ / గార్డెనర్
విద్యార్హత: అర్హతల విషయానికి వస్తే అభ్యర్థులు పోస్టును బట్టి నిర్ణీత విద్యార్హతలు కలిగి ఉండాలి. ఫ్యాకల్టీ పోస్టులకు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి సంబంధిత విభాగంలో బ్యాచిలర్స్ లేదా మాస్టర్స్ డిగ్రీ ఉండాలి. బీఏ, బీఎడ్, ఎంఏ, బీఎస్సీ పూర్తి చేసిన వారు వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు. అటెండర్ అలాగే వాచ్మ్యాన్ వంటి పోస్టులకు ఏడవ తరగతి ఉత్తీర్ణత సాధించిన వారు అర్హులు. విద్యార్హతలతో పాటు సంబంధిత పనిలో అనుభవం ఉండటం తప్పనిసరి.
వయస్సు: వయోపరిమితికి సంబంధించి అభ్యర్థులు 22 ఏళ్ల నుండి 40 ఏళ్ల మధ్య వయస్సు కలిగి ఉండాలి. ఎంపికైన వారికి నెలకు రూ.30,000 వరకు వేతనం ఉంటుంది.
సెలక్షన్ ప్రాసెస్: ఎంపిక ప్రక్రియ పూర్తిగా పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా నిర్వహిస్తారు. మెరుగైన ప్రతిభ కనబరిచిన వారిని తుది జాబితాలోకి తీసుకుంటారు. బ్యాంకింగ్ రంగంలో స్థిరపడాలనుకునే వారికి ఇది చక్కని వేదిక కానుంది.
దరఖాస్తు ప్రక్రియ: దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్కు మార్చి 28, 2026 చివరి తేదీగా నిర్ణయించారు. గడువు ముగిసేలోపు అర్హులైన అభ్యర్థులు తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది.
చివరి తేది: మార్చి 28
అధికారిక వెబ్సైట్ ద్వారా పూర్తి వివరాలు తెలుసుకుని ఫామ్ నింపాలి. తప్పుడు సమాచారం ఇస్తే దరఖాస్తులు తిరస్కరించే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా పరిశీలించి అప్లై చేసుకోవాలి.
అఫీషియల్ వెబ్ సైట్: https://www.centralbankofindia.co.in/
ALSO READ: NIC Recruitment: జీతం నెలకు రూ.1,77,500.. ఈ క్వాలిఫికేషన్ ఉంటే చాలు, పూర్తి వివరాలివే